‘ఫౌజీ’ సెట్స్‌కు సెప్టెంబర్ 15 వరకు విరామం

సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం లభించింది. వరుస ప్రాజెక్టుల చిత్రీకరణలతో బిజీగా ఉన్న ప్రభాస్‌కు సంబంధించి ఈ సినిమాలో ఇంకా 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అయితే, ఆయన వరుసగా షూటింగ్స్‌లో పాల్గొనడంతో సెప్టెంబర్ 15 వరకు ఈ చిత్ర చిత్రీకరణకు విరామం ఇచ్చినట్లు సమాచారం. షూటింగ్‌లో విరామం వచ్చినప్పటికీ, మైత్రి మూవీ … Read more

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. వారం వ్యవధిలో రానున్న పండుగలు, వారాంతపు సెలవులతో ప్రజలు ప్రయాణాలు, వేడుకలకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబరు 12న రెండో శనివారం, 13న ఆదివారం కావడంతో సాధారణ సెలవులు ఉండనున్నాయి. ఆ వెంటనే సెప్టెంబరు 14న సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. దీంతో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా మూడు రోజులు విరామం లభించనుంది. … Read more

తిరుపతి: రాత్రి రోడ్డు రక్షణ గోడపై చిరుత

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పరిధిలోని చిట్వేలి-రాపూరు ఘాట్‌ రోడ్డులో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి ఘాట్‌ రోడ్డులోని రక్షణ గోడపై చిరుత కూర్చొని ఉండటాన్ని గమనించిన కారు ప్రయాణికులు ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. గతంలోనూ ఈ రహదారిలో పలుమార్లు చిరుతలు కనిపించాయి. ఘటనపై చిట్వేలి ఎఫ్‌ఆర్‌ఓ ధీరజ్‌కుమార్‌ స్పందిస్తూ.. అటవీ ప్రాంత పరిధిలో దాదాపు 20 చిరుతలు, ఒక పెద్దపులి సంచరిస్తున్నట్లు … Read more

BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు

TG POLITICS: తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల రెండోరోజు తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన BRS ఎమ్మెల్సీ తాతా మధు, పోలీసులపై దౌర్జన్యానికి దిగిన ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిల వైఖరిని సభ తీవ్రంగా తప్పుపట్టింది. వారిపై చర్యలు తీసుకోవాలని శాసనసభ తీర్మానం చేసి మండలి ఛైర్మన్‌కు పంపడంతో, ఈ సెషన్ ముగిసే వరకు వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం నాటి ఘటనలపై నమోదైన … Read more

ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలకు ఊరట

హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసుకు సంబంధించి అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌ రెడ్డికి నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. వారిద్దరి రిమాండ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని వారిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తూ, ఆ రోజు … Read more

వికారాబాద్: కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు

TG CRIME: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తీవ్ర దుర్వాసన రావడంతో అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతుల్లో ఒకరు పురుషుడు కాగా, మరొకరు మహిళగా గుర్తించారు. అయితే మృతదేహాల వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు దొరకలేదని పోలీసులు తెలిపారు. అలాగే మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో … Read more

ఏటా 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి సిద్ధం: హోంమంత్రి అనిత

అమరావతి: కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరి ప్రలోభాలకూ లోనై ఆందోళనలకు దిగి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు. పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్‌లో 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చి 6 వేల … Read more

టీచర్ పోస్టులకు విద్యార్హతలు, టెట్ తప్పనిసరి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: సరైన విద్యార్హతలు, ‘టెట్’ లాంటి నిర్దేశిత అర్హతలు లేని ఉపాధ్యాయులను నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్హత లేని టీచర్లతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అస్సాం టీచర్ రిక్రూట్‌మెంట్‌ కేసులో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అర్హతలు లేకుండా టీచర్ల నియామకాలు చేపట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అస్సాంలో అర్హత లేని టీచర్ల నియామకంపై … Read more

స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అక్రమాల వెనుక లోకేష్ హస్తం: మార్గాని భరత్

అమరావతి: స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులే అంగీకరించారని, దీనిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందంటే అవకతవకలు జరిగినట్లు స్పష్టమైపోయిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ అక్రమాల వెనుక మంత్రి నారా లోకేష్‌ హస్తం ఉందని ఆరోపించారు. విజిలెన్స్‌ కాకుండా ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని, ఫేక్ … Read more

మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు కీలక పదవి

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత కొణిదెల సుస్మితకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బాధ్యత ద్వారా సుస్మిత ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ సమగ్ర అభివృద్ధి, … Read more