TGPSC Recruitment: 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న 20 అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 27 నుంచి మే 25 సాయంత్రం 5 గంటల వరకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వన్ … Read more

RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. స్తంభించిన ప్రజా రవాణా వ్యవస్థ

RTC Strike

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక సంఘాల పిలుపుతో, అన్ని డిపోల వద్ద కార్మికులు భారీ ఎత్తున బైఠాయించారు. ఉదయం నుంచే గేట్ల వద్ద ధర్నాలు నిర్వహించడంతో ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. బస్టాండ్లు వెలవెలబోతుండగా, డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ప్రయాణికులు తీవ్ర … Read more

TGBIE ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు ఏప్రిల్ 23 వరకు పెంపు

TGBIE Supplementary Exams 2026

మన పత్రిక: ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఒక గుడ్ న్యూస్ అందించింది. 2026 సంవత్సరానికి గాను జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును బోర్డు అధికారికంగా పెంచింది. ఇంతకుముందు ఉన్న ఫీజు చెల్లింపు చివరి తేదీ ముగియడంతో, ఇప్పుడు ఆ గడువును ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ విద్యార్థులకు మరో అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలలో ఫెయిల్ అయిన జనరల్ మరియు వొకేషనల్ … Read more

హైదరాబాద్‌లో వడగళ్ల వాన.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మన పత్రిక, హైదరాబాద్: నగరంతో పాటు పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చల్లబడింది. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని పలుచోట్ల వడగళ్లు, మోస్తరు వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 19 నుంచి 22 వరకు రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బోయిన్‌పల్లి, బాలానగర్‌లో వడగళ్ల వాన పడగా, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, అల్వాల్‌లో మోస్తరు వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి జల్లులు … Read more

Rythu Bharosa: 20న రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల

మన పత్రిక, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత రైతు భరోసా నిధుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఈ డబ్బులను జమ చేయనుంది. భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. రెండో విడత కింద మొత్తం 45,11,947 మంది రైతులకు రూ. 2063 కోట్లు అందనున్నాయి. నిధుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అధికారులను … Read more

తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. జాబితా ఇదే

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం కీలక బదిలీలు చేపట్టింది. అదనపు ఎస్పీ (ఏఎస్పీ) హోదాలో ఉన్న 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు ఈ మేరకు అధికారిక ఆదేశాలు వెలువరించారు. పరిపాలనా సౌలభ్యం, మెరుగైన పోలీసింగ్, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ అయిన అధికారులంతా తక్షణమే … Read more

Telangana Weather: 5 రోజుల పాటు వర్షాలు.. జిల్లాల వారీగా వివరాలు

మన పత్రిక, హైదరాబాద్: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు (ఏప్రిల్ 18 నుంచి 23 వరకు) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున పలు … Read more

Dost Notification 2026: నేడే డిగ్రీ నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్ వివరాలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ – DOST) 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్‌ను నేడు (ఏప్రిల్ 13, సోమవారం) ఉదయం 11:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్ 15 నుంచి విద్యార్థులు dost.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ … Read more

నల్గొండ జిల్లాలో దారుణం.. భీమారంలో గొర్రెల కాపరి హత్య

మన పత్రిక, కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంచర్ల జానయ్య (65) అనే గొర్రెల కాపరిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి కమ్మ బజారులోని తన గొర్రెల దొడ్డి వద్ద మంచంపై నిద్రపోతున్న ఆయనను బలమైన ఆయుధాలతో ముఖంపై దాడి చేసి చంపేశారు. శనివారం ఉదయం జానయ్య భార్య చౌడమ్మ దొడ్డి వద్దకు వెళ్లి దుప్పటి తీసి చూడగా, రక్తపు గాయాలతో … Read more

Miryalaguda: కరెంట్ షాక్‌తో మహిళ మృతి.. పొలంలో విషాదం

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వరి కోత పనులకు వెళ్లిన శంకరమ్మ (35) అనే మహిళ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో వరి కోత పనులు జరుగుతుండగా, కోత మిషన్‌కు మోటార్ సర్వీస్ వైర్ తగిలే అవకాశం ఉండటంతో శంకరమ్మ దానిని కర్రతో పైకి లేపే ప్రయత్నం చేసింది. అయితే ఆ కర్ర జారిపోయి … Read more