కాళేశ్వరం నీటితో కళకళలాడుతున్న శ్రీరాంసాగర్ వరద కాలువ
శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంలో భాగంగా నీటిని ఎత్తిపోయడంతో వరద కాలువలో నీటి మట్టం పెరిగి జలకళ సంతరించుకుంది.
శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంలో భాగంగా నీటిని ఎత్తిపోయడంతో వరద కాలువలో నీటి మట్టం పెరిగి జలకళ సంతరించుకుంది.
ఓటరు జాబితాలో పేరు నమోదు, వివరాల సవరణ, అడ్రస్ మార్పు మరియు అనర్హుల పేర్ల తొలగింపు కోసం ఎన్నికల కమిషన్ అందించే వివిధ ఫారమ్ల సమాచారం.
తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పనపై సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు.
రేషన్కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేయనున్నారు.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించగా, విచారణను న్యాయస్థానం ఆగస్టు 25కి వాయిదా వేసింది.
కామారెడ్డి జిల్లాలో ఆన్లైన్ గేమింగ్ లింక్ల ద్వారా పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.15 వేల నగదు, ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
కామారెడ్డి జిల్లా మద్నూర్ పరిధిలోని చెక్పోస్ట్ వద్ద వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు.
పాఠశాల విద్యలో తెస్తున్న సంస్కరణల పట్ల ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బాన్సువాడ టీచర్స్ కాలనీలో ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రథమ చికిత్స అనంతరం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ప్రభుత్వం గురువారం మూడో విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేసి, ఇచ్చిన హామీ ప్రకారం రూ.6 వేల కోట్ల నిధులను పూర్తి స్థాయిలో చెల్లించింది.