చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి

మన పత్రిక: చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ (YSR జంక్షన్) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జుగా అయి, లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు గుర్తించిన మేరకు, మృతులు తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన హరీష్, … Read more

గజ్వేల్‌ బంద్‌.. BRS ఆధ్వర్యంలో నిరసన

మన పత్రిక, తెలంగాణ: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ‘గజ్వేల్ బంద్’ ఉదయం నుంచే ఉధృతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్‌లో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున బస్సులు బయటకు … Read more

నమ్మించి వంచించిన కిరాతకుడు.. టీచర్ సూసైడ్

మన పత్రిక, AP: నమ్మిన ప్రేమే ఆమెకు శాపమైంది. పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన ఓ కిరాతకుడి చేతిలో మోసపోయిన యువతి, చివరకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుతూ ఆమె రాసిన చివరి అక్షరాలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని పామూరు మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. అయ్యవారిపల్లికి చెందిన మాధవి (24) స్థానికంగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. … Read more

శిలలతో రూపుదిద్దుకోనున్న బాసర ముగ్గురమ్మల ఆలయం!

మన పత్రిక, తెలంగాణ: అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన బాసర క్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రూ.225 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భూమిపూజ చేయనున్నారు. దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది తీరాన వెలసిన ఈ క్షేత్రం అక్షరాభ్యాసాలకు కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి వంటి పర్వదినాల్లో వేలాదిమంది చిన్నారులు … Read more

తెలంగాణ: పెరగనున్న మద్యం, బీర్ల ధరలు..?

మన పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన మార్పులు మద్యం ధరల పెంపుకు దారితీస్తున్నాయి. ఈ వేసవిలో మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిసారిగా 2023 మేలో ధరలు పెంచగా, నిబంధనల ప్రకారం 2025 మేలో మళ్లీ సమీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ గడువు … Read more

AP, TGలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎంతంటే..?

మన పత్రిక: దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరణకు లోనవుతుంటాయి. అయితే ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం ప్రభావంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుతో వినియోగదారులపై భారం పెరిగింది. ఏప్రిల్ 1న గ్యాస్ ధరలు తగ్గుతాయనే ఆశతో ఎదురుచూసిన వినియోగదారులకు నిరాశ ఎదురైంది. గృహవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం … Read more

ఆదిలాబాద్: CM వస్తుండు.. వరాలు కురిపించేనా..?

మన పత్రిక, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బజార్‌హట్‌నూర్ మండలం పిప్పిరి గ్రామంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానుండటంతో కొత్త ప్రకటనలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన కీలకంగా మారింది. జిల్లాలో ప్రధాన సమస్యలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ప్రవహించే పెన్‌గంగా … Read more

ఆదిలాబాద్ జిల్లాకు సీఎం.. 900 మంది పోలీసులతో బందోబస్తు

మన పత్రిక, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం పిప్రి గ్రామంలో జరగనున్న బహిరంగ సభకు అనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 900 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో సభ నిర్వహించేందుకు ప్రత్యేక … Read more

జైలర్ 2లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్..?

మన పత్రిక, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో అత్యంత ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ జైలర్- 2 ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్లు తలైవా స్వయంగా వెల్లడించారు. తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న రజినీకాంత్, “జైలర్ 2” చిత్రీకరణ త్వరలో పూర్తవుతుందని, విడుదల తేదీని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాను … Read more

AP: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగుల భయం!

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు ఉండగా, సాయంత్రానికి వర్షాలు, ఉరుములు, పిడుగులతో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అలాగే రాయలసీమ … Read more