తిరుమలలో భక్తుల వెల్లువ.. సర్వదర్శనానికి 15 గంటలు

మన పత్రిక, తిరుమల తిరుపతి దేవస్థానం: పవిత్ర క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. వరుస సెలవులు, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో శనివారం తెల్లవారుజామున నుంచే తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో బయట క్యూలైన్లలో భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టీటీడీ … Read more

ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

మన పత్రిక: దేశంలో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండటంతో పసిడి డిమాండ్ కొనసాగుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు శనివారం కొద్దిగా పెరిగాయి. ఏప్రిల్ 4వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,350గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 … Read more

తెల్లవారుజామున గోదావరిఖనిలో ఘోన రోడ్డుప్రమాదం

మన పత్రిక, తెలంగాణ క్రైం: కరీంనరగ్ జిల్లాలోని గోదావరిఖనిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో వచ్చి రాజేశ్ థియేటర్ సమీపంలో ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టిన తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు అందరూ లోపలే ఇరుక్కుపోయారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కారులో … Read more

ఈనెల 5న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం..?

మన పత్రిక, సినిమా: టాలీవుడ్‌లో మరో శుభవార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వివాహ వార్తలకు తాజాగా స్పష్టత వచ్చింది. ఈ నెల 5న తిరుమలలో ఆయన నిశ్చితార్థం జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిశ్చితార్థం అనంతరం ఈ నెల 29న హైదరాబాద్లో వివాహాన్ని … Read more

సర్కారు విద్యార్థులకు అదనపు సౌకర్యాలు.. షూస్‌, బెల్టులతో నూతన కిట్

మన పత్రిక, తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే విద్యా సంవత్సరంనుంచి విద్యార్థులకు అందించే సౌకర్యాలను మరింత విస్తరించనుంది. ఇప్పటికే యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్న ప్రభుత్వం, ఇకపై బ్లాక్ షూస్‌, బెల్టులు, సాక్స్‌లను కూడా అందించనుంది.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18.70 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ రెండు జతల సాక్స్‌, బ్లాక్ షూస్‌, బెల్టులు అందించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. అబ్బాయిలు, … Read more

అనర్హల రేషన్ కార్డుల తొలగింపునకు సిద్ధం

మన పత్రిక, తెలంగాణ: రాష్ట్రంలో అర్హత లేకుండా ఆహార భద్రత కార్డులు పొందుతున్న వారిపై కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆదాయ పన్ను చెల్లించే వారు, అధిక ఆస్తులు కలిగిన వారి రేషన్ కార్డులను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయనుంది. లబ్ధిదారుల ఆధార్, పాన్ వివరాలను ఆదాయపన్ను శాఖతో సరిపోల్చి వారి ఆర్థిక స్థితిని పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన 83,545 మంది పేర్లపై ఇంకా రేషన్ పంపిణీ జరుగుతుండగా, దీనివల్ల … Read more

నిర్మల్: కాంగ్రెస్ సర్పంచ్ సూసైడ్.. కారణం ఇదే..?

మన పత్రిక, TG క్రైం: పల్లె ప్రజల మద్దతుతో సర్పంచిగా ఎన్నికైన మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కుటుంబ తగాదాల కారణంగా మనోవేదనకు గురై పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం నిర్మల్ జిల్లా కండెం మండలం మాసాయిపేటలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మాసాయిపేట సర్పంచి దుర్గం లహరిక (31) ఇంటి వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే … Read more

TG: నేడు క్యాతన్‌పల్లి, ఖానాపూర్‌ ఛైర్మన్ ఎన్నిక

మన పత్రిక, TG: క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. గతంలో అల్లర్లు, గొడవల కారణంగా వాయిదా పడిన నేపథ్యంలో ఈసారి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. క్యాతన్‌పల్లి సమావేశ మందిరంలో కౌన్సిలర్ల మధ్య గొడవలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వేర్వేరు పార్టీలకు చెందిన సభ్యులు విడివిడిగా కూర్చునేలా ఇనుప … Read more

కరీంనగర్‌లో దారుణం.. పిల్లలను బావిలో పడేపిన తండ్రి

మన పత్రిక, క్రైం: కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి అమానుషానికి పాల్పడి తన కవల కూతుళ్ల ప్రాణాలను బలి తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం జూబ్లీ నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి శుక్రవారం ఉదయం తన భార్యతో గొడవ పడ్డాడు. ఆగ్రహానికి లోనైన అతడు కన్నప్రేమను మరచి సుమారు ఐదేళ్ల వయస్సున్న తన కవల కూతుళ్లపై … Read more

ఆదివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్

మన పత్రిక: భాగ్యనగర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డెవిస్ వివరాలు వెల్లడించారు. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 5) ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు … Read more