ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులందరికీ ‘ప్రశస్త్ 2.0’ మొబైల్ యాప్ ద్వారా తప్పనిసరిగా దివ్యాంగ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి. శ్రీనివాసరావు ప్రకటించారు. పిల్లల్లో ఉండే 21 రకాల దివ్యాంగత్వాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2026-27 విద్యాసంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు 100 శాతం స్క్రీనింగ్ … Read more

AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి

మన పత్రిక, మదనపల్లె: వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన మయూరి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన … Read more

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖలు

Andhra Pradesh aqua sector Crisis

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: Andhra Pradesh aqua sector Crisis ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని లక్షలాది మంది ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతిదారులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు పీయుష్ గోయల్, నిర్మలా సీతారామన్‌లకు విడివిడిగా లేఖలు రాశారు. అమెరికా విధిస్తున్న 50 శాతం అదనపు సుంకం వల్ల భారత ఎగుమతులపై ఏకంగా 60 శాతం పన్ను … Read more

AP Inter Hall Tickets 2026 : సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల..

AP Inter Hall Tickets 2026

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈ వివరాలను ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించారు. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌పోర్టల్‌తో పాటు ‘మన మిత్ర’ వాట్సాప్ నంబరు 9552300009 కు మెసేజ్ చేసి కూడా తమ హాల్‌టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈసారి ఇంటర్నెట్ లేదా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదని … Read more

ఏపీలో ‘ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు’ నియామకం

AP Transgender Welfare Board

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: సమాజంలో ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డు’ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఈ బోర్డు పనిచేయనుంది. ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 కింద ఏర్పాటు చేసిన ఈ బోర్డులో ఆంధ్ర ప్రాంత ప్రతినిధిగా విశాఖపట్నం కలెక్టర్, రాయలసీమ ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ అధికారులతో … Read more

Tirumala: తిరుమలలో ముగింపు దశకు ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు

మన పత్రిక, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ చరిత్రను డిజిటల్ రూపంలో చూపేందుకు చేపట్టిన శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో టీటీడీ ఈ ప్రపంచస్థాయి పునర్నిర్మాణాన్ని నిర్వహిస్తోంది. బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ ఏడాది జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులు … Read more

ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

AP Polytechnic Hall Ticket Release 2026

మన పత్రిక: AP Polytechnic Hall Ticket Release 2026 | ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET – 2026) హాల్ టికెట్లు ఈరోజు (ఏప్రిల్ 18) ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఏప్రిల్ 25వ తేదీ (శనివారం) ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ polycetap.ap.gov.in ద్వారా లేదా ఏపీ ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ సర్వీస్ … Read more

AP News: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

మన పత్రిక, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకల డోన్ వద్ద ఓ బొలెరో వాహనం, లారీని బలంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. … Read more

BIE AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..

మన పత్రిక, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఈరోజు (బుధవారం) ఉదయం 10:31 గంటలకు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని మంత్రి ప్రశంసించారు. ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోయినా, ఫెయిల్ అయినా విద్యార్థులు ఏమాత్రం అధైర్యపడొద్దని అధికారులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ సున్నితమైన సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు నైతిక … Read more

అమరావతి నిర్మాణం వేగవంతం చేయకుంటే నష్టమే.. జమీన్ రైతు విశ్లేషణ

మన పత్రిక, నెల్లూరు: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై నెల్లూరుకు చెందిన చారిత్రక పత్రిక ‘జమీన్ రైతు’ ఆసక్తికరమైన, కుండబద్దలు కొట్టే విశ్లేషణను ప్రచురించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయకపోతే, అది భవిష్యత్తులో భూత్ బంగళాగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రతిపక్ష నేత జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మద్రాస్-విశాఖపట్నం-గన్నవరం) ఒక సూచన కాదని, అది చంద్రబాబుకు వార్నింగ్ అని ఆ పత్రిక విశ్లేషించింది. 180 కిలోమీటర్ల మేర రోడ్డు … Read more