Tirumala: తిరుమలలో ముగింపు దశకు ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు

మన పత్రిక, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ చరిత్రను డిజిటల్ రూపంలో చూపేందుకు చేపట్టిన శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో టీటీడీ ఈ ప్రపంచస్థాయి పునర్నిర్మాణాన్ని నిర్వహిస్తోంది. బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ ఏడాది జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులు … Read more

ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

AP Polytechnic Hall Ticket Release 2026

మన పత్రిక: AP Polytechnic Hall Ticket Release 2026 | ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET – 2026) హాల్ టికెట్లు ఈరోజు (ఏప్రిల్ 18) ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఏప్రిల్ 25వ తేదీ (శనివారం) ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ polycetap.ap.gov.in ద్వారా లేదా ఏపీ ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ సర్వీస్ … Read more

AP News: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

మన పత్రిక, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకల డోన్ వద్ద ఓ బొలెరో వాహనం, లారీని బలంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. … Read more

BIE AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల..

మన పత్రిక, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఈరోజు (బుధవారం) ఉదయం 10:31 గంటలకు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని మంత్రి ప్రశంసించారు. ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోయినా, ఫెయిల్ అయినా విద్యార్థులు ఏమాత్రం అధైర్యపడొద్దని అధికారులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ సున్నితమైన సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు నైతిక … Read more

అమరావతి నిర్మాణం వేగవంతం చేయకుంటే నష్టమే.. జమీన్ రైతు విశ్లేషణ

మన పత్రిక, నెల్లూరు: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై నెల్లూరుకు చెందిన చారిత్రక పత్రిక ‘జమీన్ రైతు’ ఆసక్తికరమైన, కుండబద్దలు కొట్టే విశ్లేషణను ప్రచురించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయకపోతే, అది భవిష్యత్తులో భూత్ బంగళాగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రతిపక్ష నేత జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (మద్రాస్-విశాఖపట్నం-గన్నవరం) ఒక సూచన కాదని, అది చంద్రబాబుకు వార్నింగ్ అని ఆ పత్రిక విశ్లేషించింది. 180 కిలోమీటర్ల మేర రోడ్డు … Read more

AP SMAM Agriculture Mechanization Subsidy 2025-26: రైతుల యంత్రాలపై భారీ సబ్సిడీ

AP SMAM Agriculture Mechanization Subsidy 2025-26

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (Sub-Mission on Agriculture Mechanization – SMAM) పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూతన మార్గదర్శకాలను (New Guidelines) విడుదల చేసింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు విడుదల చేసిన అధికారిక మెమో (Official Memo) ప్రకారం, ఆధునిక వ్యవసాయ యంత్రాలను భారీ సబ్సిడీ (Huge Subsidy) తో పొందే అవకాశం … Read more

చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి

మన పత్రిక: చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ (YSR జంక్షన్) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జుగా అయి, లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు గుర్తించిన మేరకు, మృతులు తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన హరీష్, … Read more

నమ్మించి వంచించిన కిరాతకుడు.. టీచర్ సూసైడ్

మన పత్రిక, AP: నమ్మిన ప్రేమే ఆమెకు శాపమైంది. పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన ఓ కిరాతకుడి చేతిలో మోసపోయిన యువతి, చివరకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుతూ ఆమె రాసిన చివరి అక్షరాలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని పామూరు మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. అయ్యవారిపల్లికి చెందిన మాధవి (24) స్థానికంగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. … Read more

AP, TGలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎంతంటే..?

మన పత్రిక: దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరణకు లోనవుతుంటాయి. అయితే ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం ప్రభావంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుతో వినియోగదారులపై భారం పెరిగింది. ఏప్రిల్ 1న గ్యాస్ ధరలు తగ్గుతాయనే ఆశతో ఎదురుచూసిన వినియోగదారులకు నిరాశ ఎదురైంది. గృహవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం … Read more

AP: ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగుల భయం!

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజుల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరోవైపు అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు ఉండగా, సాయంత్రానికి వర్షాలు, ఉరుములు, పిడుగులతో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అలాగే రాయలసీమ … Read more