Tirumala: తిరుమలలో ముగింపు దశకు ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు
మన పత్రిక, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ చరిత్రను డిజిటల్ రూపంలో చూపేందుకు చేపట్టిన శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో టీటీడీ ఈ ప్రపంచస్థాయి పునర్నిర్మాణాన్ని నిర్వహిస్తోంది. బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ ఏడాది జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులు … Read more