రాజమండ్రిలో గాల్లోకి లేచిన ఆటో

AP: రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైలు వంతెన ప్రారంభంలో ఓ ఆటో అనూహ్య రీతిలో గాల్లోకి లేచిన సంఘటన కలకలం రేపింది. అధిక బరువుతో చెక్కల లోడును తీసుకెళ్తున్న ఆటో, రోడ్డుపై ఉన్న మూడు స్పీడ్ బ్రేకర్లను దాటే క్రమంలో తీవ్రంగా అదుపుతప్పింది. వెనుక వైపు బరువు ఎక్కువగా ఉండటంతో వాహనం ముందు భాగం ఒక్కసారిగా పైకి లేచింది. ప్రమాదాన్ని గమనించిన స్థానిక యువకులు తక్షణమే స్పందించి, ఆటోలోని చెక్కలను బయటకు తీసి వాహనాన్ని సురక్షితంగా కిందకు … Read more

ఆదిలాబాద్‌లో విద్యార్థి సూసైడ్

TG: ఆదిలాబాద్‌ పట్టణంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఫౌండేషన్ కోర్సు కోచింగ్ తీసుకుంటున్న మంచిర్యాల జిల్లాకు చెందిన స్వామిరామంతో అనే అభ్యర్థి ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం టిఫిన్ చేద్దామని స్నేహితులు పిలిచారు. తర్వాత వస్తానని చెప్పి అనంతరం భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గత నాలుగు నెలలుగా ఆయన ఆదిలాబాద్‌లో ఉంటూ శిక్షణ పొందుతున్నాడు. కుటుంబ కారణాల వల్లే స్వామిరామం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు … Read more

రేపటి నుంచే తెలంగాణ శాసనసభ సభలు

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. భద్రతా దృష్ట్యా పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సభల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని స్పీకర్ కోరగా, అన్ని రకాల ప్రభుత్వ సమాచారాన్ని త్వరితగతిన అందిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విడత సమావేశాల్లో ప్రధానంగా యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించేందుకు 21 ఏళ్లకే పోటీ … Read more

సిద్దిపేట: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి SUICIDE

TG: సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నంగునూరు మండలం రాజగోపాల్‌పేటకు చెందిన ఆకుబత్తిని పవన్ (30) ఏడేళ్లుగా ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ల్యాబ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం విధులకు వచ్చిన అతను, ఆస్పత్రిలోని ఓ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని … Read more

TG: ఉచిత బస్సు పథకంపై సీఎం కీలక ప్రకటన

TG: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నకిరేకల్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రోజుకు కోటి మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని సీఎం తెలిపారు. మహిళలకు ఉచిత సదుపాయాన్ని చూసి ఓర్వలేక కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ … Read more

హైదరాబాద్: రాంనగర్ గణేశ్ ఆగమన్‌లో విషాదం

హైదరాబాద్: రాంనగర్‌ వినాయకుని ఆగమన ఊరేగింపులో తీవ్ర విషాదం నెలకుంది. శనివారం రాత్రి VST నుంచి రాంనగర్‌ చౌరస్తా వరకు భారీ డీజే శబ్దాల నడుమ యువకులు ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో బద్రినాథ్ అనే యువకుడు ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు అంబులెన్స్‌ ద్వారా అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. … Read more

నరసరావుపేట: మహిళ కడుపులో పెన్నులు, స్పూన్లు

AP: నరసరావుపేటలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ పొత్తికడుపులో పెన్నులు, స్పూన్లు ఉండటం చూసి వైద్యులు విస్తుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటకు చెందిన 30 ఏళ్ల పెనుగొండ పావని కడుపునొప్పితో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. స్కానింగ్, ఇతర పరీక్షలు చేసిన నిపుణులు ఆమె పొత్తికడుపులో పెన్నులు, చెక్క స్పూన్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి వాటిని సురక్షితంగా తొలగించారు. ప్రస్తుతం ఆమె … Read more

సిద్ధిపేట: నేడు BRS నేతలతో KCR మీటింగ్

హైదరాబాద్: గురువారం నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు కీలక భేటీ జరగనుంది. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ఎల్పీ (BRSLP) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ విధిగా హాజరుకావాలని అధిష్టానం సూచించింది. సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై గళమెత్తే తీరుపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైతాంగ … Read more

బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత

TG: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె సుస్మిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి తమ అమ్మపై పగ పెంచుకున్నారని ఆరోపించారు. తాను కేవలం వ్యక్తిగత అంశంపైనే మాట్లాడానని, పార్టీ గురించి కాదని స్పష్టం చేశారు. ఎంపీపీ స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన సురేఖను బలి చేయడం సరికాదన్నారు. “మా అమ్మ ఏం తప్పు చేసింది? ఆమె శాఖలో ఎటువంటి తప్పూ జరగలేదు. … Read more