నారాయణపేట: చిన్నారి అపహరణ.. చెరువు కట్టపై శవమై ప్రత్యక్షం!

మన పత్రిక, తెలంగాణ, క్రైం: నారాయణపేట జిల్లాలో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య కలకలం రేపింది. నారాయణపేట మండలం అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తేజశ్రీ (5) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిన్నారి మృతదేహం గ్రామ సమీపంలోని చెరువు కట్టపై లభ్యమవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. తేజశ్రీ తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లగా, చిన్నారిని తాతమ్మల వద్ద ఉంచారు. మంగళవారం రాత్రి భోజనం అనంతరం ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని … Read more

యుద్ధం ఎఫెక్ట్‌.. పడిపోయిన బంగారం ధరలు!

మన పత్రిక: యుద్ధ ప్రభావంతో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం నాటికి 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,48,970 వద్ద ట్రేడ్ కాగా, 22 క్యారెట్ బంగారం రూ.1,36,550, 18 క్యారెట్ బంగారం రూ.1,11,730 వద్ద నమోదైంది. అయితే శుక్రవారం ఉదయం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 24 … Read more

కమెడియన్ నుంచి హీరోగా సత్య కొత్త అవతారం

మన పత్రిక, సినిమా: టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సత్య ఇప్పుడు హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘జెట్లీ’ అనే చిత్రంతో కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ‘వివాహ భోజనంబు’తో హీరోగా మెప్పించిన ఆయన, ఈసారి కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని రిథేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ‘మత్తు వదలరా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన … Read more

TG: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత ‘రైతుభరోసా’కు రంగం సిద్ధం!

మన పత్రిక: తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే దిశగా రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.2,650 కోట్లను సమీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం. జీతాలు, అప్పుల కిస్తీలు చెల్లించిన తర్వాత మిగిలిన వనరులతో నిధుల సమీకరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.మొత్తం మూడు విడతల్లో యాసంగి రైతుభరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా మార్చి 22న రూ.3,590 కోట్లను సుమారు … Read more

ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు పోలింగ్ రోజున పెయిడ్ లీవ్ ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు జిల్లాలైన తిరుపతి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సదుపాయం వర్తించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, పరిశ్రమల ఉద్యోగులతో పాటు రోజువారీ కూలీలు కూడా ఈ … Read more

యుద్ధం.. ఆకాశానంటుతున్న గ్యాస్, నూనె ధరలు

మన పత్రిక, TG: నిత్యావసర ధరల పెరుగుదల సామాన్యుడి జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఒకవైపు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్ దందా.. మరోవైపు వంట నూనెల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో సరఫరా వ్యవస్థ దెబ్బతిని, వంటగది ఖర్చులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాలో అంతరాయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ అధికారిక ధర రూ.965 … Read more

పగలు ఎండ.. సాయంత్రం ఉరుములు, మెరుపులు

మన పత్రిక, వాతావరణం: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. India Meteorological Department (ఐఎమ్‌డీ) హెచ్చరికల ప్రకారం నేడు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశమూ ఉంది. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 36°C నుంచి 38°C వరకు నమోదవుతున్నాయి. Hyderabadలో పాక్షిక మేఘావరణం ఉండి, సాయంత్రం లేదా రాత్రి సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి మోస్తరు … Read more

IPL.. నేడు చెన్నై వర్సెస్ పంజాబ్ కింగ్స్

మన పత్రిక, స్పోర్ట్స్: పీఎల్ 2026 సీజన్‌లో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. చెన్నైలోని చేపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సీఎస్కేకు కీలకంగా మారింది. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ చేతిలో ఘోర ఓటమి పాలైన చెన్నై, ఈసారి గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది. సారథి రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని సీఎస్కే జట్టు ఆశలు ప్రధానంగా స్టార్ ఆటగాళ్లపై నిలిచాయి. భారీ ధరకు జట్టులోకి వచ్చిన … Read more

విజయవాడ: పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా

మన పత్రిక: తెలుగు బిగ్‌బాస్‌ 3వ సీజన్‌లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే వివాహం జరిగినప్పటికీ, తొలి వార్షికోత్సవం సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సొంతూరికి వెళ్లి భర్తతో కలిసి వేడుకలు జరుపుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ఫ్రెండ్స్‌తో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయవాడకు చెందిన తమన్నాతెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్‌ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. … Read more

మీసేవ వినియోగ ఛార్జీలు పెంపు

మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవల వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలపై వినియోగ ఛార్జీలను 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ఫీజులతో పాటు సేవలపై 18 శాతం జీఎస్టీ విధించడంతో మొత్తం భారం 77–78 శాతం వరకు పెరిగింది. కేటగిరీ-ఏ … Read more