సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే దాడి: హరీశ్ రావు

మన పత్రిక, రాజకీయం: గజ్వేల్‌లో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ దాడి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగినదేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడిగా దీనిని అభివర్ణించిన ఆయన, కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో … Read more

శాలరీ రౌండ్ ట్రిప్పింగ్.. ఎమ్మెల్యే నాగమాధవిపై ఈసీకి ఫిర్యాదు

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: నెల్లిమర్ల రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. లోకం నాగమాధవి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదు తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమెకు చెందిన ‘మిరాకల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్’ సంస్థ ద్వారా 2024 ఎన్నికల సమయంలో భారీగా నగదు మళ్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఆనంద్, పక్కా సాక్ష్యాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఫిర్యాదు ప్రకారం … Read more

శంకరపల్లిలో వారణాసి సినిమా షూటింగ్

మన పత్రిక, సినిమా: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఇండియన్ సినిమాల్లో ‘వారణాసి’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుండగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శంకర్‌పల్లి ప్రాంతంలో జరుగుతోంది. … Read more

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

మన పత్రిక: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలను అకస్మాత్తుగా వాయిదా వేయడంపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నుకోవడానికి సరిపడా కోరం ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికను వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా బీజేపీ … Read more

కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో

మన పత్రిక, తెలంగాణ: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్‌చల్ చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు అనుముల రేవంత్ రెడ్డి ఫోటోతో క్యాంప్ ఆఫీస్‌లోకి దూసుకెళ్లి, అక్కడ సీఎం ఫోటోను ఏర్పాటు చేశారు. అనంతరం కార్యాలయంలోనే జై కాంగ్రెస్ అంటూ నినాదాలు … Read more

క్యాతన్‌పల్లి బీఆర్ఎస్ కైవసం

మన పత్రిక: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పలుమార్లు వాయిదా పడిన ఈ ఎన్నికలు శనివారం నిర్వహించగా, బీఆర్ఎస్-సీపీఐ కూటమి విజయం సాధించింది. చైర్మన్‌గా సంధ్యారాణి (బీఆర్ఎస్), వైస్ చైర్మన్‌గా సరిత (సీపీఐ) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండటం గమనార్హం. ఎన్నికల ముందు బీఆర్ఎస్ 10, సీపీఐ 4 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 7, ఒక ఇండిపెండెంట్‌కు ఒక స్థానం లభించింది. అయితే … Read more

‘పోలీస్ మామల స్క్వాడ్’ బట్టబయలు.. వాట్సాప్ గ్రూప్‌లో ఎస్సై ఎంట్రీ

మన పత్రిక, తెలంగాణ వైరల్: పోలీసుల తనిఖీలను తప్పించుకోవడానికి కొందరు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే, గోదావరిఖనిలో కొందరు యువకులు ‘పోలీస్ మామల స్క్వాడ్’ పేరుతో వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించారు. నగరంలో పోలీసులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు, ఎక్కడ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అనే వివరాలను గ్రూప్‌లో పరస్పరం పంచుకుంటూ, ఆ మార్గాలను తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఒక యువకుడు పోలీసులకు చిక్కాడు. … Read more

హైదరాబాద్: పెళ్లి దుస్తుల్లో ధరించి OYOలో సూసైడ్

మన పత్రిక, క్రైం: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధిలో శుక్రవారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లికి చెందిన వనమల లోకేశ్‌ (29) నగరంలోని గండిమైసమ్మ ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీలో పని చేసేవాడు. లోకేశ్ గత రెండేళ్లుగా సహచరితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ వివాహానికి ముందే నిర్ణయం తీసుకొని, పెళ్లి బట్టలు కూడా కొనుగోలు చేసుకున్నారు. శుక్రవారం లోకేశ్ ఓయో గదిని అద్దె తీసుకొని, … Read more

తిరుమలలో భక్తుల వెల్లువ.. సర్వదర్శనానికి 15 గంటలు

మన పత్రిక, తిరుమల తిరుపతి దేవస్థానం: పవిత్ర క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. వరుస సెలవులు, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో శనివారం తెల్లవారుజామున నుంచే తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో బయట క్యూలైన్లలో భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టీటీడీ … Read more

ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

మన పత్రిక: దేశంలో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుండటంతో పసిడి డిమాండ్ కొనసాగుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు శనివారం కొద్దిగా పెరిగాయి. ఏప్రిల్ 4వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,350గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 … Read more