ఖైరతాబాద్‌లో 24 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో వినాయకచవితి సందడి మొదలైంది. గణేష్ ఆగామన్‌ ఉత్సవాలతో కోలాహలంగా మారిన భాగ్యనగరంలో అసలైన పండుగ శోభ సంతరించుకోనుంది. ఇక ఖైరతాబాద్ బడా గణేషుడి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని బట్టి ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి … Read more

నటీ సమంతకు సర్ నోటీసులు

హైదరాబాద్: ఓటరు సమగ్ర ఇంటింటి సర్వే ప్రక్రియలో భాగంగా ప్రముఖ సినీ నటి సమంతకు నోటీసు అందించినట్లు శేరిలింగంపల్లి సర్కిల్‌ అధికారులు వెల్లడించారు. నానక్‌రాంగూడలోని ఆమె నివాసంలో గత నెలలోనే సమంత తల్లికి ఈ నోటీసు అందజేసినట్లు తెలిపారు. గత నెల 31న నిర్వహించిన హియరింగ్‌కు సమంత వ్యక్తిగతంగా హాజరు కాలేదని, ఆమె ప్రతినిధులు కూడా ఎలాంటి ధ్రువపత్రాలు తీసుకోరాలేదని శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్, నియోజకవర్గం ఓటరు జాబితా బాధ్యుడు నారాయణ అమిత్‌ మాలెంపాటి స్పష్టం చేశారు. … Read more

హనుమకొండ: ఓనర్ వేధింపులు.. పెట్రోల్ పోసుకుని దంపతుల ఆత్మహత్య

TG CRIME: అద్దె చెల్లించలేదనే నెపంతో ఇంటి యజమాని అవమానించడంతో మనస్తాపం చెందిన దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టిన హోటల్ యజమానులు కేదారి, పుష్పలత దంపతులు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ క్రమంలో సమయానికి అద్దె చెల్లించలేదని హోటల్ యజమాని కుమారుడు రాము షట్టర్‌కు తాళం వేశాడు. పుష్పలతను … Read more

లక్నో: నెట్‌వర్క్ సమస్య.. జియో ఉద్యోగిని టవర్‌కు కట్టేసిన గ్రామస్థులు

లక్నో: మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా రాకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లో గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏకంగా జియో కంపెనీ ఉద్యోగిని మొబైల్ టవర్‌కు తాళ్లతో కట్టేసి బందీగా ఉంచిన విచిత్ర ఘటన ఫతేపూర్ జిల్లా హర్దౌలీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో గత కొద్ది రోజులుగా జియో సిగ్నల్స్ అందక కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై విసిగిపోయిన స్థానికులకు.. కంపెనీ పనులపై గ్రామానికి వచ్చిన ఓ ఉద్యోగి కనిపించడంతో ఆగ్రహం కట్టలు … Read more

కుల సర్వే దేశానికే రోల్ మోడల్: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (కుల సర్వే) దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే 2027 జాతీయ జనగణనలో బీసీ, ఓబీసీ కులగణనను తప్పనిసరిగా చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రంలో బీసీల జనాభాపై ప్రభుత్వం వద్ద అత్యంత ప్రామాణికమైన, కచ్చితమైన గణాంకాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ … Read more

గద్వాల: కోడలి తలపై గొడ్డలితో నరికిన మామ

TG CRIME: ప్రశ్నించిన కోడలిపై సొంత మామ గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చాగదోణ గ్రామంలో చోటుచేసుకుంది. గట్టు ఎస్సై శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చాగదోణ గ్రామానికి చెందిన జాన్‌కు, కర్ణాటక రాష్ట్రంలోని ఎరిగేరకు చెందిన రీటాతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అయితే పెళ్లై ఇన్నాళ్లయినా పిల్లలు కలగలేదనే నెపంతో మామ కొయ్య తిమ్మప్ప తరచూ కోడలు రీటాను వేధించేవాడు. బెదిరింపులకు తాళలేక … Read more

గద్వాల: ప్రేమ వివాహం.. యువకుడి ఇల్లు ధ్వంసం

TG: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల రూరల్ మండలం రేపల్లి గ్రామంలో కులాంతర ప్రేమ వివాహం ఉద్రిక్తతకు దారితీసింది. వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కక్షతో యువతి కుటుంబసభ్యులు అతని ఇంటిని కూల్చివేశారు. గ్రామానికి చెందిన రంగముని (26), మహేశ్వరి (21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం వీరు వివాహం చేసుకుని రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడగా.. తాను మేజరని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, భర్తతోనే ఉంటానని మహేశ్వరి తేల్చిచెప్పింది. … Read more

మళ్లీ పట్టాలెక్కనున్న కమల్ హాసన్ ‘ఇండియన్ 3’?

కమల్ హాసన్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ‘ఇండియన్ 3’ చిత్ర పనులు త్వరలోనే తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కుమారుడి ముఖాన్ని పరిచయం చేసిన వరుణ్ తేజ్, లావణ్య

టాలీవుడ్ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెల ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. బాబు మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ జంట సోషల్ మీడియాలో ప్రత్యేక చిత్రాలను పంచుకుంది.

బిగ్ బాస్ 10: నాలుగో రోజే చరణ్ ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ ప్రారంభమైన కొద్ది రోజులకే తొలి వికెట్ పడింది. ఆటలో నిలదొక్కుకోలేకపోయిన కంటెస్టెంట్ చరణ్ హౌస్ నుండి బయటకు వచ్చారు.