ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం

మన పత్రిక: నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో జరిగిన ఈ ఎన్నికలో అంకం మౌనిక చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలిచాయి. స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో కాంగ్రెస్ బలం నాలుగుకు చేరింది. దీంతో … Read more

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. యువతి సూసైడ్

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్ క్రైం: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేయడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణ జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కట్నం ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని తెగేసి చెప్పడంతో చేసేది లేక ఎలుకల మందు మింగింది. గొడుగుపేటకు చెందిన రాగశ్రీకి ఇన్ స్టాగ్రామ్‌లో కోనసీమ జిల్లా మండపేటకు చెందిన లీలా కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. రాగశ్రీ పెళ్లి … Read more

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వ్యభిచారం

మన పత్రిక, క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వ్యభిచార దందా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పట్టణంలోని రద్దీ ప్రాంతమైన అశోక్ టాకీస్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఏడుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు పట్టుబడటం సంచలనంగా మారింది. పోలీసుల నిత్య గస్తీ ఉండే ప్రాంతాలు, నివాస గృహాలు అధికంగా ఉన్న మర్లు, బైపాస్ రోడ్డు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని నిర్వాహకులు ఈ దందాను సాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది మంది విటులతో ఒక … Read more

అర్ధరాత్రి తెలంగాణలోని పలు జిల్లాలో వర్షం

మన పత్రిక: తెలంగాణలో శనివారం అర్థరాత్రి వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షాలు కురిసి పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణలోని కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ నగర పరిధిలోనూ వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా నార్త్ హైదరాబాద్ ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లులు కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పలుచోట్ల వర్షం పడడంతో రోడ్లపై నీరు నిలిచింది. … Read more

నేటి బంగారం ధరలు ఇలా

మన పత్రిక: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 5) ఉదయం 6:30 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,930 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,350గా నమోదైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం ధరలు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,51,080, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,500 వద్ద ట్రేడవుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో … Read more

అల్లూరి జిల్లాలో రాత్రి భూప్రకంపనలు

మన పత్రిక, ఏపీ: మన్యం ప్రాంతంలో శనివారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించి ప్రజల్లో కలకలం రేపాయి. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి దాదాపు 30 సెకన్ల పాటు కంపించింది. ముఖ్యంగా అరకు వ్యాలీ, పాడేరు, పెడబయలు, హుకుంపేట ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా అనుభూతి అయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడి లేచి భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణభయంతో … Read more

అడవి శేష్ ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్

మన పత్రిక, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ డెకాయిట్ విడుదలకు సిద్ధమైంది. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్ ప్రారంభంలో శేష్, మృణాల్ మధ్య అందమైన ప్రేమకథను చూపిస్తూ పెళ్లి, కుటుంబం వంటి … Read more

రిలయన్స్ జియోకు ట్రాయ్ షాక్

మన పత్రిక: టెలికాం రంగంలో కీలక పరిణామంగా, నియంత్రణ సంస్థ ట్రాయ్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. టారిఫ్ విధానాల్లో పారదర్శకత నిబంధనలు పాటించలేదని గుర్తించిన ట్రాయ్, వెంటనే మార్పులు చేయాలని సూచించింది. ఈ ఆదేశాలను అమలు చేసేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు విధించింది. నివేదికల ప్రకారం, జియో రెండు కీలక అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు ట్రాయ్ పేర్కొంది. ముఖ్యంగా కంపెనీ తన అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో టారిఫ్ ప్లాన్‌లను ఒకే … Read more

ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర నూతన మ్యాప్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఈ నెల 2న అధికారికంగా ఈ మ్యాప్‌ను ప్రకటించింది. మొత్తం 28 జిల్లాలతో రూపొందించిన ఈ మ్యాప్‌లో కొత్తగా ఏర్పడిన జిల్లాల సరిహద్దులను స్పష్టంగా చూపించారు. ఈ మ్యాప్‌లో అత్యంత ముఖ్యమైన అంశం అమరావతి కు ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల … Read more

బాసర మాస్టర్ ప్లాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

మన పత్రిక, తెలంగాణ: చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయం పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా బాసర ఆలయ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రణాళికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, భక్తుల సౌకర్యాలను … Read more