Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఎండల తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, పలు విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం మే 31తో ముగియాల్సిన సెలవులు తాజా నిర్ణయంతో పొడిగించబడ్డాయి. జూన్ 7 ఆదివారం కావడంతో తిరిగి జూన్ 8న కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఓయూ బాటలోనే … Read more

TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్‌లైన్ పరీక్షలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) జూన్ 2026 ఎడిషన్‌కు సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. జూన్ 16 నుంచి 22 వరకు మొత్తం ఐదు రోజుల పాటు 10 సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో (CBT) ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. షిఫ్ట్-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, షిఫ్ట్-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 … Read more

TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్​ ట్రస్ట్..

TG Employees Health Scheme

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ‘ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్’ (EHS)ను పారదర్శకంగా అమలు చేసేందుకు ‘ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్’ ఏర్పాటు చేయనున్నారు. ఈ నూతన ఆరోగ్య భద్రత పథకం అమలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో నేడు (మే 31) సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పథకం కింద ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు), … Read more

AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి

మన పత్రిక, మదనపల్లె: వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన మయూరి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన … Read more

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజా రెడ్డి

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా నర్రా శ్రీజా రెడ్డిని ప్రభుత్వం నియమించింది. గ్రూప్-1 ద్వారా గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్‌గా ఎంపికైన శ్రీజా రెడ్డి ఇటీవల తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఆమెను మిర్యాలగూడకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఇప్పటివరకు మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్‌ను ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేసింది.

Telangana Welfare Schemes: తెలంగాణలో ఒకే కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. లబ్ధిదారుల డేటాను నిరంతరం ట్రాక్ చేసేలా, అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పనిచేసే ‘మల్టీ-పర్పస్ యూనిఫైడ్ కార్డ్’ను తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), ఫీజు రీఇంబర్స్‌మెంట్, కార్మిక, విద్యా శాఖల … Read more

బీఎస్ఎన్ఎల్‌లో 100 జేటీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మన పత్రిక, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ (జేటీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్ 4వ తేదీ నుంచి జూలై 3, 2026 వరకు బీఎస్ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ bsnl.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు … Read more

హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు

మన పత్రిక, హైదరాబాద్: ఒకప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటోంది. భారీ ప్రకటనలు, గ్రాండ్ లాంచ్ ఈవెంట్లు, ‘ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్’ బోర్డుల వెనుక పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఫ్లాట్లను విక్రయించడానికి బిల్డర్లు, రియల్టర్లు తీవ్రంగా శ్రమిస్తుండగా, మార్కెట్‌లోని ఈ నిశ్శబ్ద పతనం ఇప్పుడు ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. నగరంలోని టాప్ రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం నెలకు … Read more

Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు

Petrol Diesel price hike

మన పత్రిక, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై తీవ్రంగా పడుతోంది. సోమవారం లీటరు పెట్రోల్‌పై రూ. 2.61, డీజిల్‌పై రూ. 2.71 చొప్పున ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచాయి. ఈ తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా పెట్రోల్ ధర రూ. 100 మార్కును దాటి రూ. 102.12 కి చేరింది. అక్కడ డీజిల్ ధర లీటరు రూ. 95.20 వద్ద … Read more

నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు

TG DOST Registrations 2026

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘దోస్త్’ (TG DOST) రెండో విడత రిజిస్ట్రేషన్ల గడువు నేటితో (మే 25) ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. మొదటి విడతలో సీటు రాని విద్యార్థులు, అలాట్ అయిన కాలేజీ నచ్చని వారు, అసలు దరఖాస్తు చేసుకోని కొత్త అభ్యర్థులు … Read more