Sircilla Municipality Elections: సిరిసిల్ల మున్సిపల్ పీఠం జనరల్ మహిళకు.. బీసీలకు నిరాశేనా?

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ పీఠం రిజర్వేషన్ మార్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ స్థానాన్ని ‘జనరల్ మహిళ’ (General Women) కేటగిరీకి కేటాయించడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ బీసీ (పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన నేతలే ఏకచక్రాధిపత్యం వహిస్తూ వచ్చారు. అయితే, చుట్టుపక్కల గ్రామాల విలీనం, తాజా రిజర్వేషన్ మార్పుతో పీఠం బీసీల చేజారిపోతుందా? అనే ఆందోళన ఆ వర్గంలో … Read more

ఫ్రీగా రూ.5 వేలు వస్తున్నాయా? ఆ లింక్ క్లిక్ చేశారో ఇక అంతే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: పండుగలు, ప్రత్యేక దినోత్సవాల వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా సంక్రాంతి, రాబోయే గణతంత్ర దినోత్సవాల (Republic Day) పేరుతో సోషల్ మీడియాలో భారీ మోసం జరుగుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. వాట్సాప్‌లో “ఫోన్ పే రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్”, “సంక్రాంతి కానుక” అంటూ కొన్ని నకిలీ లింకులు చక్కర్లు కొడుతున్నాయని, వాటిని క్లిక్ చేస్తే రూ. 5,000 ఉచితంగా … Read more

తీర్థయాత్రలకు వెళ్లలేక.. మహిళలపై ఆఘాయిత్యాలా? కాంగ్రెస్ ఎమ్మెల్యే నీచ వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం

మన పత్రిక వెబ్​డెస్క్: సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొందరు వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరయ్యా (Phool Singh Baraiya) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల మహిళలను ఉద్దేశించి చేసిన అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తీర్థయాత్రలు, పుణ్యకార్యాలను మహిళలపై లైంగిక దాడులతో ముడిపెడుతూ ఆయన మాట్లాడిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే నోటి దురుసు.. పార్టీ మౌనం … Read more

మెదక్‌లో కలకలం: కాళ్లకు ‘జీపీఎస్’తో రాబందు.. జనం భయం

మన పత్రిక వెబ్​డెస్క్, మెదక్: జిల్లాలోని అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ గ్రామంలో ఆదివారం ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని పొలాల్లో సంచరిస్తున్న ఒక రాబందును చూసి స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ పక్షి కాళ్లకు జీపీఎస్ ట్రాకర్ (GPS Tracker), స్టిక్కర్లు, నంబర్లు ఉండటంతో ఇది ఏదో గూఢచారి పక్షి అయి ఉంటుందని, లేదా గ్రామానికి ఏదో కీడు జరుగుతుందని జనం భయపడ్డారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ … Read more

ఏం ఆశించి.. ఎవరి కోసం రాశారు?’.. ఆ పత్రిక కథనంపై భట్టి విక్రమార్క సీరియస్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికో, అధికారాన్ని అనుభవించడానికో తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్తులను దోచుకునే బందిపోట్ల నుంచి తెలంగాణ వనరులను రక్షించి, ప్రజలకు పంచడమే తన లక్ష్యమని తేల్చిచెప్పారు. ఆరోపణలు వస్తే రద్దు చేయమన్నా.. సింగరేణి బొగ్గు సంస్థ … Read more

సంక్రాంతి రిటర్న్ జర్నీ అలర్ట్: ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా?

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: సంక్రాంతి పండుగ ముగించుకొని సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌ నగరానికి తిరిగి వస్తున్న ప్రజలకు నల్గొండ జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా సాఫీగా ప్రయాణించేందుకు పోలీసులు ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే: ట్రాఫిక్ … Read more

TG TET Results 2026: టెట్ ఫలితాలు.. చెక్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇదే

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ టెట్ (TG TET) – 2026 పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తారు. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TG TET-2026 ఫలితాలు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య విడుదల కానున్నాయి. ఈసారి పేపర్‌-1, పేపర్-2 కలిపి మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 71,670 మంది … Read more

Meta layoffs 2026: 1,000 మందిపై వేటు.. ఏఐ వైపే జుకర్‌బర్గ్ చూపు

మన పత్రిక వెబ్​డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) 2026లో తొలిసారిగా భారీ లేఆఫ్స్‌ను ప్రకటించింది. సంస్థకు చెందిన ‘రియాలిటీ ల్యాబ్స్’ (Reality Labs) విభాగంలో సుమారు 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఐటీ రంగంలో చర్చనీయాంశమైంది. ఈ విభాగంలో మొత్తం 15,000 మంది ఉద్యోగులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 10 శాతం మంది ఉపాధి కోల్పోయినట్లయింది. మంగళవారం ఉదయం నుంచే ప్రభావిత ఉద్యోగులకు సమాచారం అందినట్లు బ్లూమ్‌బెర్గ్ … Read more

సిరిసిల్ల టీచర్స్ క్రికెట్ టోర్నీ.. విజేతగా కోనరావుపేట జట్టు

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: మండల విద్యాధికారి మంకు రాజయ్య స్మారకార్థం నిర్వహించిన ‘టీచర్స్ ప్రీమీయర్ లీగ్’ (TPL) జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ పోటీల్లో జిల్లాలోని ఆరు జట్లు తలపడగా, ఫైనల్ లో సిరిసిల్ల జట్టుపై గెలిచిన కోనరావుపేట టీమ్ విజేతగా నిలిచింది. సిరిసిల్ల జట్టు రన్నరప్ గా నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే విజేతలకు కప్ ను అందించి … Read more

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.567 కోట్ల నిధులు విడుదల

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి ఐదవ మరియు చివరి విడతగా రూ. 567.40 కోట్ల గ్రాంట్‌ను విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా నిధులతో కలిపి రాష్ట్రం మొత్తం రూ. 2,600 కోట్ల గ్రాంట్‌ను పూర్తిస్థాయిలో సాధించిందని మంత్రి తెలిపారు. నిధుల … Read more