Advertisement

పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదు

మన పత్రిక, పర్వతగిరి: యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో పర్వతగిరి మండల Youth Congress President గొడుగు వినయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే వ్యవహారంలో బాధితురాలిని దూషించి బెదిరించారనే ఆరోపణలతో వినయ్ బావ భాషబోయిన వీరస్వామిపై కూడా కేసు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

గుండా మానస అనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, ప్రాథమిక ఆధారాల ప్రకారమే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశారని, ఈ విషయమై నిలదీయగా వినయ్ తో పాటు అతని బావ వీరస్వామి ఫోన్ లోనూ, ప్రత్యక్షంగానూ తనను దూషిస్తూ బెదిరించారని బాధితురాలు పేర్కొంది. తన కుటుంబ సభ్యులను కూడా అవమానించారని ఆమె ఫిర్యాదులో తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఘటనపై విచారణ వేగవంతం చేశామని పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement
Advertisement