ఆరోగ్యశ్రీ బకాయిలు గత ప్రభుత్వ పాపమే: ముఖ్యమంత్రి

మన పత్రిక, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం బిల్లుల పెండింగ్‌పై అసెంబ్లీలో శుక్రవారం ఆసక్తికర చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ బిల్లులను తమ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టలేదని, అవి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన బకాయిలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రూ.627 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను బకాయి పెట్టిందని, అందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.240 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.360 కోట్లు ఉన్నాయని … Read more

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. అగ్నివీర్లకు ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్

మన పత్రిక, న్యూఢిల్లీ: అగ్నివీర్లకు (Agniveers) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు పంపిన విషయాన్ని సైనిక్ సంక్షేమ శాఖ డైరెక్టర్ (రిటైర్డ్) బ్రిగేడియర్ మదన్ షీల్ శర్మ అధికారికంగా వెల్లడించారు. 2027 నాటికి తమ నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్న అగ్నివీర్లకు ఆయా రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని హోం మంత్రి … Read more

TG: తెలంగాణలో పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారుల్లో భయాందోళనలు పెరిగి బంకుల వద్ద బారులు తీరుతున్నారు. దీనివల్ల నగరంలోని ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఆఫీసులు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పెట్రోల్ కొరత వార్తలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో మూడు నెలలకు సరిపడా ఇంధన … Read more

కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్.. పథకాలకు ఇందిరమ్మ పేరెందుకు?

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ కల్లు, గల్ఫ్ కార్మికుల సమస్యలు, ప్రభుత్వ పథకాల పేర్లు, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర తెలంగాణలో ఆల్ఫ్రాజోలం (Alprazolam) కల్తీ కల్లు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ లేని తెలంగాణను నిర్మించాలని డిమాండ్ చేస్తూనే.. మద్యం బ్రాండ్లలాగే … Read more

మెటాలో ఏఐ ‘స్ట్రీమ్‌లైన్’.. 700 మంది ఇంటికి!

మన పత్రిక, కాలిఫోర్నియా: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ‘మెటా’ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సంస్థను మరింత క్రమబద్ధీకరించే క్రమంలో భాగంగా వివిధ విభాగాలకు చెందిన సుమారు 700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్ (FAIR)తో పాటు ఇతర ఏఐ అనుబంధ టీమ్స్‌పై ఈ ప్రభావం పడింది. ఒకే తరహా పనులు చేసే బహుళ బృందాల వల్ల నిర్ణయాల్లో … Read more

AP: ఘోర ప్రమాదం.. 10 మంది సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని క్వారీల వద్ద చందూ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. అతివేగం, ప్రమాదకరమైన మూలమలుపే ఈ విపత్తుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌ డీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు క్షణాల్లోనే బస్సును చుట్టేసి, రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక లోపలే … Read more

ITR Filing: కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి ‘ఫామ్ 16’ రద్దు

మన పత్రిక, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి ‘కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు-2026’ అమల్లోకి రానున్నాయి. దీంతో ఐటీఆర్ (ITR) ఫైలింగ్ విధానం సమూలంగా మారబోతోంది. ఇప్పటివరకు ఉద్యోగులకు యాజమాన్యాలు ఇచ్చే ‘ఫామ్ 16’ (Form 16) రద్దు కానుంది. దీని స్థానంలో మరింత పకడ్బందీగా ఉండే ‘ఫామ్ 130’ని ప్రవేశపెడుతున్నారు. కొత్త పన్ను సైకిల్‌లో ‘ఫామ్ 130’ అత్యంత కీలకం కానుంది. … Read more

TGSRTC Ticket Price: బంపర్ ఆఫర్.. ఏసీ బస్సులపై 30% రాయితీ

మన పత్రిక, హైదరాబాద్: నగరంలో పెట్రోల్ కొరత భయంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నగర పరిధిలో తిరిగే మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల టికెట్ ధరలపై ఏకంగా 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు సంస్థ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుత ఇంధన సంక్షోభం, పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు … Read more

Miryalaguda: ఫోన్ చేయగానే స్పందించి రక్తదానం..

మన పత్రిక, మిర్యాలగూడ: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి ప్రాణదాతగా నిలుస్తున్నారు. రక్తం అవసరమైన రోగుల కోసం ఫోన్ చేయగానే తక్షణమే స్పందిస్తూ ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళవారం స్థానిక జ్యోతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక రోగికి రక్తం అవసరం ఉందని తెలియగానే, జానకిరామ్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఇలా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం తనకు ఇది … Read more

నేటి దినఫలాలు (మార్చి 25, 2026): బుధవారం ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

మన పత్రిక, హైదరాబాద్: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం.. నేటి (మార్చి 25, 2026 – బుధవారం) రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.) పంచాంగ వివరాలు: