సిమెంట్ మిల్లర్‌లో చిక్కుకుని యువకుడి చేయి నుజ్జునుజ్జు

మన పత్రిక, వెబ్​డెస్క్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్ పల్లిలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్లాబ్ వేస్తుండగా సిమెంట్ మిల్లర్ యంత్రాన్ని ఆపరేట్ చేస్తున్న కొమరం మహేశ్ అనే యువకుడి చేయి ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుంది. దీంతో అతని మణికట్టు వరకు చేయి నుజ్జునుజ్జు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది కిషన్, రఫిక్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం … Read more

కరెంట్ షాక్‌తో కొడుకు, రైలు కింద పడి తండ్రి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో కొడుకు మరణించగా, ఆ బాధను తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. అట్లూరి సునీల్ అనే యువకుడు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా, భార్య ప్రస్తుతం … Read more

కొండగట్టుకు పవన్ కల్యాణ్.. రూ.35 కోట్లతో టీటీడీ పనులకు శంకుస్థాపన

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టును సందర్శించనున్నారు. 2026 జనవరి 3 (శనివారం) ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం పనులకు భూమిపూజ నిర్వహిస్తారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా … Read more

హైదరాబాద్ క్రైమ్త గ్గిన నేరాలు.. మహిళలపై పెరిగిన కేసులు

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ నగరంలో 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక నేర నివేదికను పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ విడుదల చేశారు. నగరంలో ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 15 శాతం తగ్గినప్పటికీ, మహిళలు, చిన్నారులపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2024తో పోలిస్తే మొత్తం కేసులు 35,944 నుంచి 30,690కి తగ్గాయని సిపి వెల్లడించారు. అయితే, మహిళలపై నేరాలు 6 శాతం పెరిగాయని, ముఖ్యంగా గృహ హింస కేసులు 31 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం … Read more

అంగన్‌వాడీ జాబ్స్.. 92 పోస్టులు, టెన్త్ అర్హత.. వివరాలివే

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అనంతపురం జిల్లా మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న 92 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 78 అంగన్‌వాడీ వర్కర్, 14 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 2025 జూలై 1 నాటికి … Read more

చలి కోసం బొగ్గుల కుంపటి.. చిన్నారులు సహా నలుగురు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బీహార్‌లోని ఛాప్రాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉండటం స్థానికులను కలచివేసింది. గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వెలువడిన ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్ వాయువు గది అంతా వ్యాపించింది. నిద్రలోనే ఆ విషవాయువును పీల్చడంతో వారంతా ఊపిరాడక, స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు వైద్యులు … Read more

Sangareddy: బైక్ బోల్తా, ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్-బీదర్ జాతీయ రహదారి (NH 161B)పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులను నర్సింహులు (27), మల్లేష్ (24), మహేష్ (23)గా గుర్తించారు. వీరు వరుసకు బావ, బావమరుదులు అవుతారు. నర్సాపూర్ నుంచి నారాయణఖేడ్ వచ్చి తిరిగి వెళ్తుండగా, శివారులో కొత్తగా నిర్మిస్తున్న హైవే పక్కన ఉన్న కల్వర్టు గుంతలో బైక్ … Read more

ఒక్కరోజే రూ.1150 పెరుగుదల.. హైదరాబాద్‌లో రేట్లు ఇవే

మన పత్రిక, వెబ్​డెస్క్: పసిడి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. ఆదివారం (డిసెంబర్ 28) ఉదయం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 10 గ్రాములపై 22 క్యారెట్లకు రూ.1100, 24 క్యారెట్లకు రూ.1150 మేర పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. కుటుంబాల బడ్జెట్‌ను ఈ ధరల పెరుగుదల దెబ్బతీస్తోంది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,000కు చేరగా, 24 క్యారెట్ల ధర రూ.1,36,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులోనూ … Read more

వనవీర ట్రైలర్ విడుదల.. మైథలాజికల్ డ్రామాతో అవినాష్ ఎంట్రీ, విలన్‌గా

మన పత్రిక, వెబ్​డెస్క్: అవినాష్ తిరువీధుల కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం ‘వనవీర’. మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, నందు ప్రతినాయకుడి పాత్రలో వైవిధ్యంగా కనిపించనున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు, వివేక్ సాగర్ … Read more

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టీజర్.. ఆర్మీ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ లుక్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన 60వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో సల్మాన్ మునుపెన్నడూ చూడని సీరియస్ ఆర్మీ ఆఫీసర్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. “చావుకి భయం ఎందుకు.. అది ఎలాగైనా వస్తుంది” అనే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా అపూర్వ లఖియా ఈ … Read more