మన పత్రిక, వెబ్డెస్క్: బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్తో కొడుకు మరణించగా, ఆ బాధను తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.
వివరాల్లోకి వెళ్తే.. అట్లూరి సునీల్ అనే యువకుడు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్కు ఏడాది క్రితమే వివాహం కాగా, భార్య ప్రస్తుతం 9 నెలల గర్భవతి. పరిహారం కోసం స్థానికులు ఆందోళన చేయడంతో విద్యుత్ శాఖ, సదరు రైతు ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించారు. అయితే, కొడుకు మరణవార్త విని తట్టుకోలేకపోయిన సునీల్ తండ్రి, తీవ్ర మనస్తాపంతో వేమూరు రైల్వే ట్రాక్పై రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
