జనవరి 1న గ్యాస్ ధరల్లో మార్పులు? కొత్త ఏడాదిలో ‘వంట’ కష్టాలు తీరేనా?

మన పత్రిక, వెబ్​డెస్క్: సామాన్యుల చూపు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలపై పడింది. ప్రతి నెలా 1వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో రాబోయే కొత్త ఏడాది (జనవరి 1) సందర్భంగా గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. గత నెలలో వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు స్వల్పంగా తగ్గించి ఊరటనిచ్చాయి. అయితే, గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్ ధరల్లో … Read more

Telangana: పెరిగిన సంక్రాంతి సెలవులు..

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు వరుసగా 9 రోజులు సెలవులను ఖరారు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సెలవుల సంఖ్య పెరగడంతో విద్యార్థులు పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. సెలవుల వివరాలు: గత ఏడాది కేవలం 6 రోజులే ఉండగా, ఈసారి రెండో శనివారం, ఆదివారాలు కలిసి రావడంతో మొత్తం 9 రోజులు సెలవులు వచ్చాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే విధంగా 9 రోజులు సెలవులు … Read more

గ్రామగ్రామాన మహిళా భవనాలు.. ఒక్కో దానికి రూ.10 లక్షలు మంజూరు!

మన పత్రిక, వెబ్​డెస్క్: మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై వారు చెట్ల కింద, ఆలయాల వద్ద సమావేశాలు నిర్వహించే అవస్థలకు చెక్ పడనుంది. ఉపాధిహామీ నిధులతో ప్రతి గ్రామంలో ‘మహిళా సమాఖ్య భవనాల’ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 561 గ్రామ సమాఖ్యలు ఉండగా, ఇప్పటివరకు 256 గ్రామాల్లో స్థలాలను గుర్తించినట్లు … Read more

సర్కార్‌పై హరీష్ రావు ఫైర్.. ఎజెండాపై మండిపాటు

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) శీతాకాల సమావేశాల నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన బీఏసీ (BAC) సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల రంగంపై ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వనున్న నేపథ్యంలో, ప్రతిపక్షంగా తమకు కూడా పీపీటీ … Read more

ఆశా వర్కర్లపై పోలీసుల ప్రతాపం.. సూర్యాపేటలో ఉద్రిక్తం | Telangana Assembly

మన పత్రిక, వెబ్​డెస్క్: అసెంబ్లీ సమావేశాల వేళ సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఏకంగా ఆశా వర్కర్ల ఇళ్లకు వెళ్లి, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యంపై … Read more

TG Assembly: మాజీ సర్పంచుల ముట్టడి.. రూ.531 కోట్ల కోసం రచ్చ!

మన పత్రిక, వెబ్​డెస్క్: పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ మాజీ సర్పంచులు చేపట్టిన ఆందోళనతో తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మారినా విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.531 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వారు తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అసెంబ్లీని ముట్టడించేందుకు మాజీ సర్పంచులు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో … Read more

మాజీ సర్పంచులు, ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు.. సర్కార్‌పై ఆగ్రహం

మన పత్రిక, వెబ్​డెస్క్: పెండింగ్ బిల్లులు, జీతాల పెంపు డిమాండ్‌తో మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సూర్యాపేట నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పలువురు నాయకులను, ఆశా వర్కర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. దీంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు విస్మరించిందని వారు మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా … Read more

యూట్యూబ్ స్టార్ టు సర్పంచ్..

మన పత్రిక, వెబ్​డెస్క్: సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారి, ఇప్పుడు ప్రజాసేవలో నిమగ్నమయ్యారు ఓ యువతి. షార్ట్ ఫిలింల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని, లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన రజిత.. ఇప్పుడు సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేశారు. యూట్యూబర్‌గా మొదలైన ఆమె ప్రయాణం, నేడు ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా ఎన్నికయ్యే స్థాయికి చేరింది. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సర్పంచ్‌గా ఎన్నికైన రజిత, మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజలతో … Read more

రోడ్లపై కేక్ కటింగ్ చేస్తే కేసులే.. ఎస్పీ సీరియస్ వార్నింగ్!

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర వేడుకల వేళ సూర్యాపేట జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచే విస్తృత తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఇవే:

మాజీ సర్పంచ్ తల్లి మృతి.. కాంగ్రెస్ నేతల నివాళి

మన పత్రిక, వెబ్​డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గుండాల నరసింహ గౌడ్ మాతృమూర్తి గుండాల ఆండాలు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గ్రామానికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి … Read more