మన పత్రిక, వెబ్డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్-బీదర్ జాతీయ రహదారి (NH 161B)పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులను నర్సింహులు (27), మల్లేష్ (24), మహేష్ (23)గా గుర్తించారు. వీరు వరుసకు బావ, బావమరుదులు అవుతారు.
నర్సాపూర్ నుంచి నారాయణఖేడ్ వచ్చి తిరిగి వెళ్తుండగా, శివారులో కొత్తగా నిర్మిస్తున్న హైవే పక్కన ఉన్న కల్వర్టు గుంతలో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్ర గాయాలపాలైన ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
