మన పత్రిక, వెబ్డెస్క్: బీహార్లోని ఛాప్రాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉండటం స్థానికులను కలచివేసింది.
గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వెలువడిన ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్ వాయువు గది అంతా వ్యాపించింది. నిద్రలోనే ఆ విషవాయువును పీల్చడంతో వారంతా ఊపిరాడక, స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా, వారి పరిస్థితి విషమంగా ఉంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
