PM Kisan: రైతులకు రూ.2000.. జమ అయ్యేది అప్పుడే! ఈ-కేవైసీ తప్పనిసరి

మన పత్రిక, వెబ్​డెస్క్: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ద్వారా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించనుంది. త్వరలోనే 22వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఎప్పుడు జమ అవుతాయంటే? ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఏటా రూ.6,000 మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 21 విడతల … Read more

కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.3000 కోట్ల నిధులు విడుదల? మాజీ సర్పంచుల్లో ఆశలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు పట్టిన గ్రహణం వీడనుంది. ఎంతోకాలంగా నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసినట్లు సమాచారం. రూ.3000 కోట్లు పెండింగ్: గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు రూ.3000 కోట్ల నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో, పెండింగ్ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర … Read more

TG News: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ మహానగర రూపురేఖలు మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రతిష్టాత్మకమైన ‘మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు’ (Musi River Rejuvenation Project) పనులను వేగవంతం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. మార్చి 31లోపు అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం వెల్లడించిన కీలక అంశాలు:

సౌందర్య మరణానికి ముందురోజు ఏం జరిగింది? అనుకోకుండా రికార్డయిన ఆ ఫోన్ కాల్ ఏం చెప్పింది?

మన పత్రిక, వెబ్​డెస్క్: సినీ నటి సౌందర్య మరణం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తూనే ఉంటుంది. 2004 ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రమాదానికి రెండు రోజుల ముందు (ఏప్రిల్ 15, 2004) జరిగిన ఓ సంఘటన, అనుకోకుండా రికార్డయిన ఓ ఫోన్ కాల్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. అప్పట్లో బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తేజా టీవీకి … Read more

కేసీఆర్, హరీష్‌లే టార్గెట్.. ఉరితీసినా తప్పులేదంటూ ఫైర్!

మన పత్రిక, వెబ్​డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS) చుట్టూ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, హరీష్ రావు చేసిన ‘జల ద్రోహం’పై ‘సిట్’ (SIT – Special Investigation Team) విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ ఆరోపణలు – సిట్ విచారణకు కారణాలు: హరీష్ రావు కౌంటర్ … Read more

నీటి వాటాల్లో రాజీపడేదే లేదు: గత పాలకుల పాపాలివే.. అసెంబ్లీలో లెక్క తేలుస్తాం

మన పత్రిక, వెబ్​డెస్క్: కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) అనంతరం సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ, వ్యూహాత్మకంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాలివే:

మహిళా సంఘాలకు గుడ్ న్యూస్: ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్.. 70% సబ్సిడీతో గేదెల పంపిణీ

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో మహిళా సాధికారత, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు( Indira Dairy Project )’ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఒక్కో సభ్యురాలికి రూ.2 లక్షల విలువైన రెండు పాడి గేదెలు లేదా ఆవులను పంపిణీ చేయనున్నారు. భారీ సబ్సిడీ: ఈ పథకం కింద … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 02 జనవరి 2026 Horoscope in Telugu

గ్రహాల సంచారం, నక్షత్ర బలం ఆధారంగా దినఫలాలు మారుతుంటాయి. ఈరోజు (శుక్రవారం) ఏ రాశి వారికి కాలం కలిసి వస్తుంది? ఎవరికి ధనలాభం ఉంది? ఎవరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? ద్వాదశ రాశుల వారి జాతక చక్రం ఆధారంగా నేటి రాశి ఫలాలను మనపత్రికలో తెలుసుకుందాం. మేష రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసరమైన విషయాలతో కాలాన్ని వృథా చేయవద్దు. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. మీ … Read more

ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య.. కారణం ఇదే

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే యముడిగా మారి ముగ్గురు చిన్నారులను పొట్టనబెట్టుకున్నాడు. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే సురేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. మృతులను కావ్య (7), జ్ఞానేశ్వరి (4), సూర్య గగన్ (2)గా గుర్తించారు. … Read more

Drunk and Drive: న్యూ ఇయర్ రోజు 1198 కేసులు.. వాహనాలు సీజ్ 

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర వేడుకల జోష్‌లో నిబంధనలు మరిచిన మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నగరవ్యాప్తంగా యువత మద్యం సేవించి రోడ్లపై చిందులు వేశారు. అర్ధరాత్రి దాకా రోడ్లపై హల్చల్ చేస్తూ, పోలీసు ఆంక్షలను బ్రేక్ చేశారు. దీంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మందుబాబుల భరతం పట్టారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో పోలీసులు రికార్డు స్థాయిలో తనిఖీలు చేపట్టారు. కేవలం హైదరాబాద్ … Read more