విజయ్-రష్మిక ‘రణబాలి’ టీజర్ అప్‌డేట్

సినిమా: టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహబంధం తర్వాత జంటగా నటిస్తున్న తొలి భారీ పాన్ ఇండియా పిరియాడిక్ డ్రామా ‘రణబాలి’. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 1854 నుండి 1878 మధ్య బ్రిటిష్ కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా నటిస్తుండగా, అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ … Read more

తెలంగాణలో ఓటర్ల సవరణ గడువు పొడిగింపు

తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం మరోసారి సవరించింది. ఓటర్ల నమోదు, క్లెయిమ్‌లు అలాగే అభ్యంతరాల స్వీకరణ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సవరించిన తాజా షెడ్యూల్ ప్రకారం.. క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించే ప్రక్రియను నవంబర్ 5 లోపు పూర్తి చేయనున్నారు. అన్ని ప్రక్రియలు … Read more

ఆడబిడ్డలకు క్షమాపణ కాంగ్రెస్ చెప్పేదాకా వదిలిపెట్టం: కేటీఆర్‌

అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని గొంతు నొక్కే ప్రయత్నం చేశారని, ఈ దాడికి సీఎం రేవంత్‌రెడ్డే పూర్తిగా బాధ్యుడని ఆరోపించారు. రాష్ట్రంలో శాసనసభ కాస్తా కౌరవ సభలా, దుశ్శాసన పర్వంలా మారిందని విమర్శించారు. డిస్ట్రక్షన్, డైవర్షన్ రాజకీయాలే రేవంత్‌కు తెలుసని, మహిళలపై … Read more

HYD: అసెంబ్లీలో కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే తీవ్ర ఉద్రిక్తత, భావోద్వేగ వాతావరణం చోటుచేసుకుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బ్లాక్ టీ-షర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై అసెంబ్లీలో … Read more

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్

లండన్‌లో విలాసవంతమైన జీవితాన్ని చూపి యూట్యూబ్‌లో ఫాలోవర్లను సంపాదించుకున్న ‘నందూస్ వరల్డ్’ దంపతులు భారీ వీసా స్కామ్‌లో చిక్కుకున్నారు. విజయవాడ, హైదరాబాద్, లండన్‌లలో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరిట ఆఫీసులు ఏర్పాటు చేసి, నిరుద్యోగులను మోసం చేశారు. యూకేలో వర్క్ వీసాలు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామంటూ ఒక్కో బాధితుడి నుంచి రూ.15 నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేశారు. సుమారు 8కి పైగా షెల్ కంపెనీలను సృష్టించి నకిలీ ఆఫర్ లెటర్లు పంపారు. బాధితులు ప్రశ్నిస్తే … Read more

స్పీకర్‌కు అవమానం.. కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: సీఎం రేవంత్‌

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అవమానం జరిగిన నేడు తెలంగాణ చరిత్రలోనే ఒక చీకటి రోజని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై జుగుప్సాకరమైన, అసభ్యకరమైన భాష ఉపయోగించారని తీవ్రంగా మండిపడ్డారు. ఇది అనాలోచితంగా జరిగిన చర్య కాదని, నిన్న కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ సభ్యులను పిలిపించుకుని పథకం ప్రకారం స్పీకర్‌పైకి ఉసిగొల్పారని ఆరోపించారు. ఈ ఘటన కేవలం సభాపతికి మాత్రమే కాకుండా, నాలుగు కోట్ల తెలంగాణ … Read more

బిగ్ బాస్ 10 హౌస్‌లోకి ఆటో రాంప్రసాద్, నరేష్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్‌లోకి జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, నరేష్ ఒకేసారి ప్రవేశించారు. బయట ఆప్తమిత్రులైన వీరు బిగ్ బాస్ హౌస్‌లో ఎలా రాణిస్తారో చూడాలి.

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. టీషర్ట్ విప్పేసిన హరీశ్ రావు

హైదరాబాద్‌: శాసనసభ సమావేశాల ప్రారంభం వేళ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనగా నల్ల టీషర్టులతో వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో హరీశ్‌రావు, కేపీ వివేకానంద్‌ టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. ఈ తోపులాటలో ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి స్పృహతప్పి పడిపోగా, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తనతో అమానుష్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలో కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. … Read more

కేడర్‌కు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం

అమరావతి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కుప్పం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఉండవల్లి నివాసంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల ముఖ్య నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీ, మండల, జడ్పీ, మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. “పదవులు పొంది కష్టపడకపోతే కుదరదు. ఫలితాల్లో తేడా వస్తే ఉపేక్షించేది లేదు. లాలూచీ రాజకీయాలకు స్వస్తి పలకాలి” అని … Read more

AP: కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సచివాలయాల్లో సోమవారం నుంచి వారం రోజుల పాటు నూతన దరఖాస్తులను స్వీకరించనున్నారు. YCP హయాంలో జారీ చేసిన జీవో 174నే ప్రామాణికంగా తీసుకుని ఆరంచెల తనిఖీ విధానం ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం అనర్హులుగా తేలిన వారికి తిరస్కరణ పత్రం అందజేస్తారు. దరఖాస్తు మరియు తనిఖీ విధానం: కావలసిన ముఖ్యమైన … Read more