పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై శుభవార్త

మన పత్రిక, న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ఎటువంటి అనిశ్చితి నెలకొన్నా, దేశీయ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలోని ప్రతి పౌరుడికి రాబోయే 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దీనికి అదనంగా, తదుపరి రెండు నెలల అవసరాలను తీర్చేందుకు వీలుగా ముడి చమురు … Read more

TG: ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌.. మెనూ ఇదే..!

మన పత్రిక, తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ అమలుకు అధికారులు కసరత్తు పూర్తి చేసి, వారాంతపు మెనూను సిద్ధం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం బలవర్ధక అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.720 కోట్లను కేటాయించింది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు … Read more

తిరుపతి: పాల కోపం ఏడ్చిందని.. కూతురిని చంపేసింది

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్: పాల కోసం ఏడుస్తోందని ఆగ్రహించిన ఓ తల్లి.. ఆరు నెలల పసికందును ఊపిరాడకుండా చేసి చంపేసిన అమానుష ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండలం నరసరాజు అగ్రహారంలో జరిగింది. తమిళనాడుకు చెందిన వెంకటేశ్‌కు, హేమావతితో 2018లో వివాహమైంది. వీరికి కుమారుడు రుత్విక్(5), కుమార్తె జోషిక(6 నెలలు) ఉన్నారు. గురువారం ఉదయం వెంకటేశ్ పనికి వెళ్లిన కొద్దిసేపటికే హేమావతి ఫోన్ చేసి.. “నీకో బ్యాడ్ న్యూస్, నాకో గుడ్ న్యూస్.. పాపను చంపేశాను” అని … Read more

HYD: నేడు వైన్ షాపులు బంద్..!

మన పత్రిక, హైదరాబాద్: నగరంలో శుక్రవారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కళ్లుదుకాణాలు అలాగే స్టార్ హోటళ్లలోని బార్లలో కూడా మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధికారిక ఉత్తర్వులు జారీచేస్తూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు … Read more

నేడే శ్రీరామనవమి..శుభ ముహూర్తం ఎప్పుడంటే

మన పత్రిక: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ ఏడాది పూజాదికాలకు సంబంధించి పండితులు ముఖ్యమైన సమయాలను సూచించారు. ముహూర్త విశేషాలు భక్తులకు సూచనలు ఇంట్లో పూజ చేసుకునే భక్తులు మధ్యాహ్నం ఒంటి గంటలోపు స్వామివారికి నైవేద్యం (వడపప్పు, పానకం) సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాతే ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. రామాలయాలన్నీ భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి.

HYD: 29, 30వ తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్రీడా పోటీలు

మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ నెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. నిరంతరం ప్రజా సమస్యలు, రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఉమ్మడి రాష్ట్రం నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రస్తుత శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్ పర్యవేక్షణలో … Read more

ఆరోగ్యశ్రీ బకాయిలు గత ప్రభుత్వ పాపమే: ముఖ్యమంత్రి

మన పత్రిక, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం బిల్లుల పెండింగ్‌పై అసెంబ్లీలో శుక్రవారం ఆసక్తికర చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ బిల్లులను తమ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టలేదని, అవి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన బకాయిలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రూ.627 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను బకాయి పెట్టిందని, అందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.240 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.360 కోట్లు ఉన్నాయని … Read more

రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. అగ్నివీర్లకు ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్

మన పత్రిక, న్యూఢిల్లీ: అగ్నివీర్లకు (Agniveers) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు పంపిన విషయాన్ని సైనిక్ సంక్షేమ శాఖ డైరెక్టర్ (రిటైర్డ్) బ్రిగేడియర్ మదన్ షీల్ శర్మ అధికారికంగా వెల్లడించారు. 2027 నాటికి తమ నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్న అగ్నివీర్లకు ఆయా రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని హోం మంత్రి … Read more

TG: తెలంగాణలో పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నగరంలోని పలు బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారుల్లో భయాందోళనలు పెరిగి బంకుల వద్ద బారులు తీరుతున్నారు. దీనివల్ల నగరంలోని ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఆఫీసులు, పాఠశాలలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, పెట్రోల్ కొరత వార్తలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో మూడు నెలలకు సరిపడా ఇంధన … Read more

కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్.. పథకాలకు ఇందిరమ్మ పేరెందుకు?

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ కల్లు, గల్ఫ్ కార్మికుల సమస్యలు, ప్రభుత్వ పథకాల పేర్లు, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర తెలంగాణలో ఆల్ఫ్రాజోలం (Alprazolam) కల్తీ కల్లు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ లేని తెలంగాణను నిర్మించాలని డిమాండ్ చేస్తూనే.. మద్యం బ్రాండ్లలాగే … Read more