మన పత్రిక, రాయ్పూర్: రాబోయే శాసనసభ శీతాకాల సమావేశాల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ తెలిపారు. రాష్ట్రంలో Chhattisgarh UCC అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరు వెళ్లేందుకు రాయ్పూర్ విమానాశ్రయానికి వచ్చిన సందర్భంలో శుక్రవారం జులై 24న ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఛత్తీస్గఢ్లో యుసిసి అమలు కోసం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వంలో గతేడాది ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తొలి సమావేశం శుక్రవారం నవ రాయ్పూర్ అటల్ నగర్లోని మంత్రాలయ మహానది భవన్లో జరిగింది. కమిటీ నివేదికను పరిశీలించి రాబోయే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో యుసిసి బిల్లును ఆమోదింపజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
కమిటీ బాధ్యతలు, వివరాలు
ఈ కమిటీలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు శత్రుఘ్న సింగ్, ఎమ్.కే. రౌత్, సీనియర్ అడ్వకేట్ మోహన్ పవార్, మాజీ ప్రిన్సిపాల్ జ్యోతి రాణి సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ప్రస్తుత చట్టపరమైన అంశాలను పరిశీలించి వివాహం, విడాకులు, జీవనభృతి, వారసత్వ హక్కులు, దత్తత వంటి అంశాలపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. పౌరులు, సామాజిక సంస్థలు, చట్ట నిపుణుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని యుసిసి చట్టాలను కూడా పరిశీలించి, ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పిస్తుందని అధికారులు వెల్లడించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- జంతర్ మంతర్ లో నీట్ పేపర్ లీక్ నిరసనలకు పెరుగుతున్న పెద్దల మద్దతు
- విద్యార్థులకు మార్కులు తగ్గితే లోకేశ్కే తగ్గినట్లు: చంద్రబాబు
- బెల్లంపల్లి గురుకులంలో విషాహారం ఘటనపై స్పందించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్
- ఈపీఎఫ్ ఖాతాల్లోకి 8.25 శాతం వడ్డీ జమ ప్రారంభం
- మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
