Advertisement

క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీని గ్లోబల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు

మన పత్రిక: క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి హబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి Chandrababu Naidu తెలిపారు. దేశ క్వాంటమ్ భవిష్యత్తుకు అమరావతిని ఒక ముఖద్వారంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రంగానికి సంబంధించి రాష్ట్రంలో అవసరమైన అన్ని రకాల వసతులను పటిష్టం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

ప్రముఖ క్వాంటమ్ సాంకేతిక సంస్థ ‘క్వాంటినమ్‌’ సీఈవోతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశోధనలు, హార్డ్‌వేర్ అభివృద్ధి, నూతన స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చేలా సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో విస్తృత పురోగతి సాధించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు సీఎం వివరించారు.

Advertisement
Advertisement