నేటి నుంచే ఐపీఎల్.. తొలి పోరులో బెంగళూరు vs హైదరాబాద్‌!

ఐపీఎల్‌ 19వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. పది జట్లు మరోసారి అసలైన టీ20 మజాను అందించేందుకు పోటీపడుతున్నాయి. శనివారం బెంగళూరు-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానుంది. గతేడాది టైటిల్‌ గెలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ట్రోఫీని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఒకసారి ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో కప్పుపై దృష్టి సారించింది. చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు తమ ఆధిపత్యాన్ని మళ్లీ చాటుకోవాలని చూస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గత సీజన్‌ నిరాశను మరచి నాలుగో … Read more

ఐఫోన్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్

మన పత్రిక, బిజినెస్: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు కొత్త ఫీచర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్‌ యూజర్ల కోసం ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్‌ ఖాతాలను వినియోగించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంపైనా విస్తరించనుంది. దీంతో వ్యక్తిగత, వృత్తిపర అవసరాల కోసం రెండు ఫోన్లు వాడాల్సిన అవసరం లేకుండా పోతుంది. యాప్‌లో కింద భాగంలో … Read more

రణబలి షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంట

మన పత్రిక, సినిమా: ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ మ్యారేజ్ లైఫ్‌ను ఆస్వాదిస్తూ కూడా పనిలో ఏమాత్రం విరామం ఇవ్వడం లేదు. ఈ జంట కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో విజయ్ ‘రణబలి’గా, రష్మిక ‘జయమ్మ’గా కనిపించనున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. … Read more

ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో 84 మండలాల్లో వడగాల్పుల తీవ్రత

మన పత్రిక అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మొన్నటి వరకు వర్షాలతో అల్లాడిన ప్రజలకు ఇప్పుడు భానుడి సెగలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 68 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎండ … Read more

రంగారెడ్డి: నేడు పరీక్ష.. నిన్న పదో తరగతి విద్యార్థి మృతి

మన పత్రిక, తెలంగాణ: పండుగ పూట ఆ ఇంట్లో విషాదం నిండింది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తొర్రూరు గ్రామానికి చెందిన బచ్చిగళ్ల శంకరయ్య, అనిత దంపతుల కుమారుడు అభిలాష్‌ (16) ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల … Read more

HYD: చిరంజీవి గొప్ప మనసు.. అవార్డు డబ్బు విరాళంగా

మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’తో పాటు తనకు అందిన రూ.10 లక్షల నగదును ఆయన వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ప్రకటించారు. సామాజిక బాధ్యతగా ఈ మొత్తాన్ని సర్వ్, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లకు అందజేశారు. వీటితో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి … Read more

నేటి దినఫలాలు (28 మార్చి 2026): సుకర్మ యోగం.. ఈ రాశులకు విశేష ధనలాభం!

మన పత్రిక, హైదరాబాద్: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం (మార్చి 28, 2026) రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గురుడు, శుక్రుడి ప్రభావంతో ఈరోజు ‘సుకర్మ’, ‘ఉభయచారి’ యోగాలు ఏర్పడనున్నాయి. ప్రముఖ పండితులు ఆచార్య క్రిష్ణ దత్త శర్మ అంచనా ప్రకారం నేటి 12 రాశుల ఫలాలు (Today Horoscope) ఎలా ఉన్నాయంటే.. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి … Read more

సుంకం తగ్గినా.. వినియోగదారులకు అందని రూ. ‘పది’ తగ్గింపు

మన పత్రిక, కేంద్రం: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.10 మేర తగ్గించిన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ తగ్గింపు నేరుగా వినియోగదారులకు లభించదనే అంశం స్పష్టమవుతోంది. ఈ ఉపశమనం ప్రధానంగా HP, BP, IOC వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకే వర్తిస్తుంది. క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఖర్చులు భారీగా పెరగడంతో ఆయిల్ కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగింది. … Read more

రేపటి నుంచి ఐపీఎల్.. RCBకి కీలక బౌలర్ దూరం!

మన పత్రిక, స్పోర్ట్స్: రేపు ప్రారంభమయ్యే Indian Premier Leagueకు ముందే Royal Challengers Bengaluruకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. జట్టుకు కీలక బౌలర్‌గా భావించిన నువాన్ తుషారా(Nuwan Thushara) ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు ఎన్‌ఓసీ ఇవ్వడానికి శ్రీలంక క్రికెట్ బోర్డు నిరాకరించినట్లు సమాచారం. గాయం ఏదీ లేకపోయినా ఫిట్‌నెస్ సరిగా లేదనే కారణంతో ఐపీఎల్‌లో పాల్గొనడాన్ని అడ్డుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంపై శ్రీలంక మాజీ క్రికెటర్ చమిందా వాస్(Chaminda … Read more

లాక్‌డౌన్ వార్తలు.. కేంద్రం మంత్రి ఏమన్నారంటే..?

మన పత్రిక: దేశంలో ఇంధన కొరత నేపథ్యంలో లాక్‌డౌన్ విధించే అవకాశముందన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, లాక్‌డౌన్‌పై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి సమయంలో ఐకమత్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్న మంత్రి, … Read more