కరీంనగర్‌లో దారుణం.. పిల్లలను బావిలో పడేపిన తండ్రి

మన పత్రిక, క్రైం: కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి అమానుషానికి పాల్పడి తన కవల కూతుళ్ల ప్రాణాలను బలి తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం జూబ్లీ నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి శుక్రవారం ఉదయం తన భార్యతో గొడవ పడ్డాడు. ఆగ్రహానికి లోనైన అతడు కన్నప్రేమను మరచి సుమారు ఐదేళ్ల వయస్సున్న తన కవల కూతుళ్లపై … Read more

ఆదివారం హైదరాబాద్‌లో ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్

మన పత్రిక: భాగ్యనగర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డెవిస్ వివరాలు వెల్లడించారు. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 5) ట్రాఫిక్ డైవర్షన్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు … Read more

TG: ఈ రోజు రాత్రి నుంచి మీసేవ బంద్

మన పత్రిక: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేసే ప్రక్రియలో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి అన్ని రకాల సేవలను నిలిపివేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనితో వివిధ అవసరాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లే ప్రజలకు సేవలు అందుబాటులో ఉండవు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తయ్యేందుకు సుమారు 36 గంటల సమయం పట్టనుంది. ఇదే సమయంలో శనివారం, … Read more

రానున్న 3 రోజులు తెలంగాణలో వర్షాలు

మన పత్రిక, వాతావరణం: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముంది. శనివారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, … Read more

నిర్మల్: పురుగు మందు తాగి సర్పంచ్ సూసైడ్

మన మత్రిక, TG క్రైం: నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి దురదృష్టకర పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం లహరి పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కారులో సమీప ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి వేగంగా తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యలో కారు అదుపుతప్పి రోడ్డు … Read more

శ్రీధర్‌ ప్లాన్‌తోనే నాపై దాడి జరిగింది: హర్ష వీణ

మన పత్రిక, AP: రైల్వే కోడూరులో జరిగిన దాడి ఘటనపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందని, తనను చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆమె, “నేను చావడానికైనా సిద్ధమే కానీ నా పోరాటం ఆపను” అని స్పష్టం చేశారు. దాడి సమయంలో అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారని, తనపై దాడికి ఆయనే ప్రేరేపించారని ఆరోపించారు. తాతంశెట్టి నాగేంద్ర తనపై దాడి చేశారని, మరికొందరు … Read more

40 ఏళ్ల అనుబంధం కట్.. కారెక్కనున్న జీవన్ రెడ్డి..?

మన పత్రిక, TG: తెలంగాణ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 13న ఆయన భారత్ రాష్ట్ర సమితి కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. ముందుగా ఈ నెల 7న జగిత్యాలకు వెళ్లనున్న కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఈ చర్చలు వేగం పుంజుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు … Read more

జగన్ మానసిక పరిస్థితి ఏం బాలేదు: మాజీ మంత్రి

మన పత్రిక, ఏపీ రాయజకీయం: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. గతంలో విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అంశంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలోనూ వైఖరి మారిందని, గతంలో వ్యతిరేకించి ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం సరైంది … Read more

పల్నాడు: దాహమని నీళ్లు అడిగి.. మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై అత్యాచారం

మన పత్రిక, AP క్రైం: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. దాహమని నీళ్లు అడిగిన వ్యక్తికి సహాయం చేయబోయిన ఓ మహిళపై అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మాచర్లలో చోటుచేసుకుంది. సత్తెనపల్లికి చెందిన బాధితురాలు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మాచర్లలో ఒంటరిగా నివసిస్తోంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో, సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇంటి తలుపు తట్టి తాగడానికి నీళ్లు అడిగాడు. ఆమె లోపలికి … Read more

TG: గ్రూప్-1 అభ్యర్థులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మన పత్రిక, జాబ్స్: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం, సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటగా నిలుస్తుందన్నారు. “ఏళ్ల తరబడి కష్టపడి, … Read more