పంచముఖ సంకటహర మహా గణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ బడా గణేష్ ఈ ఏడాది 72వ ఉత్సవాలతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రెండ్రోజుల క్రితమే విగ్రహ ఏర్పాటు పూర్తికాగా, ఉత్సవ కమిటీ గణేషుడి ఆగమనాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈసారి ఏకంగా 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతి కొలువుదీరాడు. వినాయకచవితి పూజలందుకునేందుకు బొజ్జ గణపయ్య పూర్తిగా సిద్ధమయ్యాడు. సోమవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ ఘనంగా జరగనుంది. ఆ … Read more

ర్యావరణ పరిరక్షణకు పెద్దపీట.. నాగబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన నాగబాబు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కుంకీ ఏనుగులకు స్వయంగా ఆహారం అందించి, వాటి పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా దృష్టి సారించామని … Read more

వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచే పోటీ చేసి గెలుస్తా: కొండా సురేఖ

వరంగల్: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ఊహాగానాలను మాజీ మంత్రి కొండా సురేఖ పూర్తిగా తోసిపుచ్చారు. తాము కాంగ్రెస్‌లోనే పుట్టామని, చివరి వరకు కాంగ్రెస్‌లోనే ఉంటామని స్పష్టం చేశారు. 2026 సెప్టెంబర్ 13న వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు హాల్‌లో నిర్వహించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కొండా దంపతులు పాల్గొన్నారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు టికెట్ తనదేనని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి మంత్రి అవుతానని ధీమా వ్యక్తం చేశారు. పదవులు … Read more

ఎస్పీ జానకి షర్మిలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: పోలీసు సంక్షేమ సంఘం

నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నిర్మల్ జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. పోలీసుల ముసుగులో కొంతమంది అనామకులు స్వార్థం కోసం ఎస్పీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు ఎస్పీకి సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎస్పీ జానకి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సిబ్బంది తమ సమస్యలను నేరుగా ఎస్పీకి చెప్పుకునే వెసులుబాటు కల్పించారని, చరిత్రలో ఎడలేవిధంగా హోంగార్డులు కూడా నేరుగా ఆమెను … Read more

అవకాశవాద రాజకీయం పెరిగిపోయింది: మాజీ మంత్రి కొండా సురేఖ

వరంగల్: పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, ఎప్పుడూ ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో నిర్వహించిన కార్యకర్తలు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను సాధారణ ఎంపీటీసీ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగానంటే కష్టకాలంలో వెన్నంటి నిలిచిన కార్యకర్తలదే ప్రధాన పాత్ర అని కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కోసం క్షణం కూడా ఆలోచించకుండా మంత్రి పదవికి రాజీనామా చేశానని, ఆయన ఉన్నన్నాళ్లు తమను కంటికి రెప్పలా … Read more

సెప్టెంబరు 17 నుంచి ‘సేవా సంకల్ప అభియాన్’: ఏపీ బీజేపీ అధ్యక్షుడు

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వెల్లడించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు సాగుతాయని తెలిపారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ అందించిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 … Read more

తెలంగాణపై జనసేన దృష్టి: గేర్ మార్చిన పవన్ కళ్యాణ్

TG: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు కాస్త శాంతంగా ఉన్న జనసేన పార్టీ ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. రాబోయే అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి వెల్లడించారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సాధిస్తున్న ఆదరణ తరహాలోనే తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ బలమైన ప్రజాశక్తిగా ఎదిగారని ఆయన వ్యాఖ్యానించడం పొలిటికల్ హీట్ పెంచింది. … Read more

కార్యకర్తలతో భేటీకి పిలుపు.. సురేఖకు కొత్త పోస్ట్?

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్న కొండా దంపతులు, ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కొండా సురేఖ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో భేటీ అయి … Read more

అభిజిత్ దీప్కే కారును ముట్టడించిన ఇన్‌ఫ్లుయెన్సర్లు

మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు చేదు అనుభవం ఎదురైంది. అంతుచిక్కని వ్యాధుల బారిన పడి గిరిజన చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన అడోరి, కోర్కా, బొందారి గ్రామాల్లో ఆయన పర్యటించారు. బాధితులను పరామర్శించి అక్కడి వైద్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఆయన పర్యటన ముగించుకుని తిరుగుపయనమవుతున్న సమయంలో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు కారును చుట్టుముట్టి ఆందోళన చేశారు. ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ మైక్ పట్టుకుని “శవాల మీద రాజకీయాలు చేయడానికి వచ్చారా? … Read more

సూర్యాపేట: కాలువలో గల్లంతై ఇద్దరు విద్యార్థుల మృతి

TG CRIME: సెలవు రోజు స్నేహితులతో సరదాగా గడపాలనుకున్న ఆ బాలురకు అదే చివరి రోజు అయింది. ఈత సరదా ఇద్దరు నిండు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం గ్రామంలో చోటుచేసుకుంది. ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు తొమ్మిదవ తరగతి విద్యార్థులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ముకుందపురం, కోదాడ ప్రాంతాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో శనివారం … Read more