తెలంగాణలో నేడు భారీ వానలు, హైదరాబాద్‌లోనూ వర్ష సూచన

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. ఇక భాగ్యనగరంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే సూచనలున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు వెళ్లేవారు … Read more

నాగర్‌కర్నూల్: నిండు గర్భిణీ భార్యను హత్య చేసిన భర్త

వివాహమై ఏడాది కూడా పూర్తికాకముందే ఓ నిండు గర్భిణీ ప్రాణం బలయింది. మద్యం మత్తులో భర్త జరిపిన అఘాయిత్యంతో అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వెంకటేష్, నారాయణమ్మ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చి జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, రెండో కుమార్తె శివాణికి ఏడాది క్రితం అదే జిల్లాకు చెందిన పరుశురాంతో వివాహం జరిగింది. పరుశురాం ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి … Read more

79 ఏళ్లుగా చెక్క వినాయకుడితోనే పూజలు

MH: వినాయక చవితి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి వినాయకులను ప్రతిష్టిస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం గత 79 ఏండ్లుగా ఒకే చెక్క వినాయకుడిని ప్రతిష్టిస్తూ భక్తిశ్రద్ధలు చాటుకుంటున్నారు. ఆదివారం ఉదయం వేద మంత్రోచ్ఛరణలు, హోమాల మధ్య ఈ కర్ర వినాయకుడిని గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా పాలజ్ గ్రామంలో ఈ ‘సత్య గణేశుడు’ కొలువుదీరాడు. 1948లో అంటు రోగాలు, తీవ్ర సంక్షోభ … Read more

ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తొలి పూజ

దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఊరూవాడలాంటి ప్రాంతాలన్నీ వినాయక మండపాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణనాథుల ప్రతిమలతో ఎటు చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ గణపతి నామస్మరణలతో మార్మోగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోని చారిత్రక ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు విగ్రహానికి తొలిపూజలు నిర్వహించి, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు విగ్రహ కమిటీ సభ్యులు, మంత్రి పొన్నం … Read more

తూ. గో: పండగ పూట విషాదం.. చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో వినాయక చవితి పర్వదినాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగ వేడుకల కోసం భక్తిశ్రద్ధలతో పూలు కోసేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు యువకులు నీటమునిగి దుర్మరణం పాలయ్యారు. సంతోషంగా సాగాల్సిన పండుగ పూట ఈ ఘోరం జరగడంతో ఆ ప్రాంతమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. కోరుకొండ కొత్త చెరువులోకి పూలు కోసేందుకు వీరబాబు (35), శివ (35) దిగారు. అయితే లోపల ఊబి ఉన్న విషయాన్ని గమనించకపోవడంతో వారు ప్రమాదవశాత్తు అందులో కూరుకుపోయారు. … Read more

వివాహేతర సంబంధం.. కన్నకొడుకునే కడతేర్చిన తల్లి

ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని మహరాజ్‌పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాన్ని చూడటంతో కన్నకొడుకునే తల్లి ప్రియుడితో కలిసి పొట్టనబెట్టుకుంది. విపౌసి గ్రామానికి చెందిన ఓ వివాహితకు 14 ఏళ్ల కుమారుడు సత్యం ఉన్నాడు. అయితే ఆమె స్థానికంగా ఉండే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 10వ తేదీ గురువారం రాత్రి గదిలో ప్రియుడితో ఆమె ఏకాంతంగా ఉండగా కొడుకు సత్యం కంటపడ్డాడు. దీంతో ఖంగుతిన్న అతను ఈ విషయాన్ని వెంటనే తన … Read more

రాష్ట్ర ప్రజలకు సీఎం, కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని సీఎం రేవంత్‌ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. అలాగే, రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం మళ్లీ గాడినపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పాడి పంటలతో తెలంగాణ రైతు కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని ఏకదంతుడిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలను ప్రజలంతా … Read more

విశాఖలో ఆకట్టుకుంటున్న ‘వ్యాయామ గణపతి’

వినాయక చవితి వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో వినూత్న ఆలోచనతో రూపొందించిన ఓ ప్రతిమ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాఖలోని గాజువాక బీహెచ్‌పీవీ కూడలి సమీపంలో జిమ్ నిర్వాహకుడు బర్ల రవికుమార్ యాదవ్ ‘వ్యాయామ గణపతి’ని ఏర్పాటు చేసి భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. సాధారణంగా మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో విగ్రహాలను తయారు చేస్తుంటారు. కానీ, ఇక్కడ పూర్తిగా వ్యాయామ సామగ్రితో గణనాథుడిని తీర్చిదిద్దడం విశేషం. దైవభక్తితో పాటు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ … Read more

రణబాలి షెడ్యూల్ పూర్తి చేసిన నటి రష్మిక మందన్న

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమాలో తన పాత్ర షూటింగ్‌ను రష్మిక మందన్న పూర్తి చేసుకున్నారు.