Advertisement

రాజకీయాల్లోకి మహిళలను లాగడం సరికాదు: నారా భువనేశ్వరి

మన పత్రిక, కుప్పం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రత్యర్థులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయ స్వార్థం కోసం మహిళలను వివాదాల్లోకి లాగడం తగదని సూచించారు.

గతంలో శాసనసభలో జరిగిన కొన్ని ఘటనలను భువనేశ్వరి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో ద్రౌపదికి జరిగినట్లుగానే తనపై విమర్శలు చేశారని పరోక్షంగా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలందరూ చంద్రబాబుకు అండగా నిలిచారని, ఆ మద్దతుతోనే ముందడుగు వేస్తున్నామని ఆమె వివరించారు.

Advertisement
Advertisement