Sankranti: స్పెషల్ బస్సుల్లో 1.5 రెట్లు ఛార్జీల పెంపు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) షాక్ ఇచ్చింది. పండుగ రద్దీ కోసం ఏర్పాటు చేసిన 6,431 ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీలను సాధారణం కంటే 1.5 రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు జనవరి 9, 10, 12, 13, 18, 19 తేదీల్లో అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే, రెగ్యులర్ సర్వీసుల్లో మాత్రం పాత ఛార్జీలే కొనసాగుతాయి. మహిళలకు … Read more

అమరావతి రైతులకు శుభవార్త.. రూ.1.50 లక్షల రుణమాఫీ

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: రాజధాని ప్రాంత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అర్హులైన రైతులకు రూ.1.50 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు. తుళ్లూరు మండలం వడ్లమానులో రెండో దశ భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి … Read more

బిగ్ బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. తోయొద్దన్నా వినని ఫ్యాన్స్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఇటీవల సెలబ్రిటీల ఈవెంట్లలో భద్రతా ప్రమాణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. అభిమానం హద్దులు దాటితే ప్రమాదమేనన్న వాస్తవం మరోసారి వెలుగులోకి వచ్చింది. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ తనూజకు హైదరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. నగరంలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. తనను చుట్టుముట్టిన అభిమానులను ఉద్దేశించి “మీ కోసమే వచ్చాను, దయచేసి తోయొద్దు” అని ఆమె ఎంతగా … Read more

కవిత కుట్రలు: కేటీఆర్‌పై అక్కసు ఎందుకు? వైరల్ పోస్ట్ కలకలం

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశమయ్యేలా ‘కవిత కుట్రలు – పార్ట్ 1’ పేరుతో ‘ఉత్తమ్ బీఆర్ఎస్’ రాసిన ఓ ఆసక్తికరమైన కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూనే.. ఎమ్మెల్సీ కవిత తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్న కేటీఆర్‌పై కవిత ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారనే కోణంలో ఈ కథనం సాగింది. కేటీఆర్ విజయాలు vs కవిత ఓటమి 2009 … Read more

Dharani Portal Refund | 87 కోట్లు పెండింగ్.. రైతులకు చుక్కలు చూపిస్తున్న అధికారులు!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని, వివిధ కారణాలతో రద్దు చేసుకున్న రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న రైతులకు తిరిగి ఇవ్వాల్సిన స్టాంప్ డ్యూటీ సొమ్మును రెవెన్యూ శాఖ ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టింది. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 26,740 మంది రైతులకు సంబంధించిన రూ. 87.60 కోట్లను ప్రభుత్వం తన వద్దే అట్టిపెట్టుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు … Read more

Sankranti: చర్లపల్లి – వైజాగ్ మధ్య ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్ ఇవే

మన పత్రిక వెబ్​డెస్క్, సికింద్రాబాద్: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు గాను చర్లపల్లి – విశాఖపట్నం మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు రూట్లలో స్పెషల్ సర్వీసులను ప్రకటించిన రైల్వే శాఖ, తాజాగా ఈ రెండు నగరాల మధ్య అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. రైలు సమయాలు – తేదీలు దక్షిణ మధ్య … Read more

TG SSC Exams 2026: ఫీజు చెల్లింపునకు మరో ఛాన్స్.. షెడ్యూల్ ఇదే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు శుభవార్త అందించారు. అనివార్య కారణాల వల్ల ఇంకా పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ, తాజాగా ‘తత్కాల్ పథకం’ (Tatkal Scheme) కింద ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. అలాగే మార్చిలో జరగనున్న పరీక్షల షెడ్యూల్‌పై విద్యార్థులకు స్పష్టత ఇచ్చారు. రూ.1000 ఆలస్య రుసుముతో.. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఇప్పటికే ముగిసినా, విద్యార్థుల … Read more

ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి మరో డాక్టరేట్ గౌరవం

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University), మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో కొత్త సతీష్ డాక్టరేట్ సాధించారు. సీనియర్ ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణ, సీనియర్ ప్రొఫెసర్ కె. శ్యామల పర్యవేక్షణలో ”ఆప్టిమైజేషన్ ఆఫ్ పారామీటర్స్ అండ్ రియల్ టైమ్ టెంపరేచర్ కంట్రోల్ ఆఫ్ 3డి ప్రింటెడ్ AlSi10Mg అలయ్ స్పెసిమెన్స్ యూజింగ్ అర్డూనో సెన్సార్ ఇంటిగ్రేషన్” అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి సతీష్ సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు … Read more

District collector: నల్గొండ కలెక్టర్ తనిఖీ.. యూరియా కొరతపై కీలక ఆదేశాలు

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: రబీ సీజన్ లో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మిర్యాలగూడ సమీపంలోని తుంగపహాడ్ మార్క్​ఫెడ్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిల్వలు, రవాణా లారీల ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ నగర్ లోని ఎరువుల దుకాణాన్ని సందర్శించి ఆన్​లైన్ విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ … Read more

Sankranti: రైల్వే టికెట్లపై డిస్కౌంట్.. ఈ స్టేషన్లలో హాల్టింగ్!

మన పత్రిక వెబ్​డెస్క్, సికింద్రాబాద్: సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నగరంలోని ముఖ్యమైన స్టేషన్లలో తాత్కాలిక హాల్టింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ, టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటించింది. హైటెక్ సిటీ, చర్లపల్లిలో హాల్టింగ్ సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఈ నెల 7వ తేదీ … Read more