మన పత్రిక, ధమగ్నాపూర్: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని ధమగ్నాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బుధవారం ఉచితంగా సైకిళ్లు మరియు షూస్ను పంపిణీ చేశారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
విద్యార్థుల ఇబ్బందులను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతిరోజూ కిలోమీటర్ల కొద్దీ ఎండలో, వర్షంలో నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్లడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా నడుచుకుంటూ వెళ్లే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇకపై విద్యార్థులెవరూ నడవాల్సిన అవసరం లేదని, సైకిళ్లపై జాగ్రత్తగా వెళ్తూ ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకుని బాగా చదువుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే చొరవపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
