తల్లిదండ్రులని చూడకపోతే జీతంలో కోత: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం – 15% కట్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని గాలికి వదిలేస్తున్న వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరిక జారీ చేశారు. తల్లిదండ్రుల బాగోగులు చూడని ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అవసరమైతే వారి జీతాల్లో కోత విధించి, ఆ డబ్బును నేరుగా తల్లిదండ్రులకే అందేలా చేస్తామని సంచలన ప్రకటన చేశారు. జీతంలో 15 శాతం కట్! బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్ల ప్రారంభోత్సవం … Read more

Peddi : పెద్ది నుండి అదిరిపోయే అప్డేట్… స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ రూమర్?

Peddi next sechdule update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న “పెద్ది” (Peddi) సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటుంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ గురించి నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్ కూడా వచ్చింది. మొన్నటివరకు ఢిల్లీ లో జరిగిన షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి సంక్రాంతి పండగ సందర్బంగా కాస్త విరామం ప్రకటించారు. అయితే పండగ తర్వాత షెడ్యూల్ గురించి ఓ … Read more

సంక్రాంతికి ముందు ఈ ఆలయంలో వింత ఆచారం.. ఆడవారికి నో ఎంట్రీ

మన పత్రిక వెబ్​డెస్క్, అన్నమయ్య జిల్లా: సాధారణంగా పండుగలు అంటేనే ఆడవారు పిండివంటలు చేయడం, ఇంటిల్లిపాదీ ఆనందంగా గడపడం. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో మాత్రం సంక్రాంతికి ముందు ఒక వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ జరిగే పండుగలో మహిళలకు ప్రవేశమే ఉండదు. వంట చేయడం నుంచి నైవేద్యం సమర్పించడం వరకు అన్నీ మగవారే దగ్గరుండి చూసుకుంటారు. ఎక్కడ? ఏంటి ఆచారం? రైల్వేకోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలోని శ్రీ సంజీవరాయ (ఆంజనేయ స్వామి) ఆలయంలో … Read more

‘పరీక్షా పే చర్చ 2026’ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్..

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించే ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha – PPC 2026) 9వ ఎడిషన్‌కు సమయం ఆసన్నమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లకు నేడే (జనవరి 11) ఆఖరు తేదీ. ప్రధానితో నేరుగా మాట్లాడే అరుదైన అవకాశాన్ని అందుకోవాలనుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ల సునామీ ఈ ఏడాది పీపీసీకి అసాధారణ స్పందన లభించింది. … Read more

జర్నలిస్టులకు గుడ్ న్యూస్: ఈసారి ఎక్కువగానే అక్రిడిటేషన్ కార్డులు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య తగ్గుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన సుమారు 23 వేల కార్డుల కంటే.. ఈసారి ఎక్కువగానే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం సచివాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. … Read more

TG FSL Recruitment: జనవరి 20 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ (TG FSL)లో 60 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) తదుపరి దశ అయిన ధ్రువపత్రాల పరిశీలన (Certificate Verification) షెడ్యూల్‌ను ప్రకటించింది. తేదీలు – వేదిక వివరాలు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇంటిమేషన్ లెటర్స్ డౌన్లోడ్ ఇలా.. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యేందుకు … Read more

Suryapet: నడిరోడ్డుపై పువ్వులిచ్చి పంపిన ఎస్పీ!

మన పత్రిక వెబ్​డెస్క్, సూర్యాపేట: సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే వాహనదారులతో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా రోడ్డుపై పోలీసులు ఆపితే చలానా వేస్తారని భయపడే వాహనదారులకు.. జిల్లా ఎస్పీ నరసింహ పువ్వులు అందించి ఆశ్చర్యపరిచారు. ఆంధ్ర వెళ్లే వారికి.. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనదారులకు ఎస్పీ నరసింహ స్వయంగా పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట … Read more

Tollywood : నన్నెవరూ కలుస్తలేరు.. సినిమాటోగ్రఫీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Cinematography minister Komati Reddy Venkat Reddy about Movie Ticket Hikes

టాలీవుడ్ పై గత కొంత కాలంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను బట్టి తెలుస్తుంది. ఆ మధ్య అల్లు అర్జున్ విషయం నుండి నిన్నటి ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ సినిమా వరకు ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుండి సమస్య వస్తూనే ఉంది. అసలు విషయానికి వస్తే.. మొన్న రాజా సాబ్ (Rajasaab) రిలీజ్ సందర్బంగా అయిన రచ్చ గురించి తెలిసిందేగా. ప్రభాస్ “రాజాసాబ్” సినిమాని పాన్ … Read more

Telangana: ఉద్యోగులకు రూ.1.02 కోట్ల బీమా.. ఎవరికి వర్తిస్తుందంటే?

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఏకంగా రూ.1.02 కోట్ల ప్రమాద బీమా (Accident Insurance) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అధికారిక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకర్లతో చర్చలు సఫలం రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ (Regular Employees) ఈ బీమా పథకం వర్తిస్తుందని డిప్యూటీ … Read more

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ‘సీరియల్ స్నాచర్’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిల విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ‘సీరియల్ స్నాచర్’ (Serial Snatcher) లా వ్యవహరిస్తూ విశ్వవిద్యాలయాల భూములను లాక్కుంటోందని మండిపడ్డారు. ఉర్దూ వర్సిటీ భూముల వివాదం నేపథ్యంలో నందినగర్ లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం భూములు తీసుకోవడం ఇదే తొలిసారి కాదని, గతంలో జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి 100 ఎకరాలు తీసుకున్నారని గుర్తుచేశారు. … Read more