BREAKING: కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం కారణంగా తునిలో అలంక ఎక్స్‌ప్రెస్‌, అన్నవరంలో ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌, సామర్లకోటలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, అనకాపల్లిలో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు … Read more

నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

వివిధ డిమాండ్ల సాధనకై బ్యాంకు ఉద్యోగుల సంఘాల పిలుపు మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని, పెన్షన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.ఈ బంద్ ప్రభావంతో పాటు శనివారం రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవు కావడం, సోమవారం వినాయక చవితి పండుగ ఉండటంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్థిక లావాదేవీలు, చెక్కుల … Read more

పంచాయతీ నిధులు ఇక బ్యాంకు ఖాతాల్లోనే: మంత్రి సీతక్క

గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా నేరుగా వాటి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సంబంధించిన పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును గురువారం అసెంబ్లీ ఆమోదించింది. ఇకపై గ్రామసభ తీర్మానంతో నేరుగా ఈ నిధులను పంచాయతీల అభివృద్ధికే వాడుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటివరకు నిధులను ట్రెజరీలో జమ చేయడం వల్ల వాటిని డ్రా చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ కొత్త విధానంతో పంచాయతీల … Read more

పిల్లలు లేకపోయినా పర్వాలేదనుకున్నాం: సమంత రుత్ ప్రభు

నటి సమంత రుత్ ప్రభు తన గర్భధారణ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పిల్లలు కనడంపై తాము ముందేమీ ప్రణాళికలు వేసుకోలేదని ఆమె పేర్కొన్నారు.

ఉరవకొండ శివారులో ఘోరం.. ముగ్గురు దుర్మరణం

AP CRIME: ఓ కేసు రాజీకి సంబంధించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తిరుగు ప్రయాణమైన ముగ్గురు ప్రాణస్నేహితులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలిగొంది. అనంతపురం జిల్లా ఉరవకొండ శివారు గుంతకల్లు ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పోలీసుల వివరాల ప్రకారం.. వజ్రకరూరుకు చెందిన జైనుల్లా(44), మహబూబ్‌బాషా(33), మహమ్మద్‌రఫీ(29) ఆప్తమిత్రులు. వీరు ఓ గొడవకు సంబంధించి లోక్‌ అదాలత్‌లో రాజీ పడేందుకు ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పని ముగించుకుని బైక్‌పై … Read more

మెదక్: పోలీస్ స్టేషన్‌లో యువకుడి బలవన్మరణం

TG CRIME: మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దుర్గాప్రసాద్ (30) అనే యువకుడు గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం ఒక యువతి, ఆమె కుటుంబ సభ్యులు దుర్గాప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు ఈ నెల 7న అతడిని స్టేషన్‌కు పిలిపించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే దుర్గాప్రసాద్ ఠాణాలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. … Read more

TG: ఒకేరోజు దంపతుల బలవన్మరణం

CRIME: తార్నాక: ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఓ దంపతుల సంసారంలో మనస్పర్థలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. గురువారం లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందిన శరణప్ప (28), లక్ష్మి (24) దంపతులకు 15 నెలల క్రితం వివాహమైంది. తార్నాక విజయపురి కాలనీలో శరణప్ప తల్లిదండ్రులతో కలసి నివసిస్తున్నారు. శరణప్ప నాచారంలోని … Read more

ఏపీలో వర్షాలు.. 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు గంటల్లో తొమ్మిది జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్నం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాలకు ఈ హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. … Read more

సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ

TG: ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, సంఘాల నాయకులపై ఉన్న ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల కలుగుతున్న నష్టం, పీఆర్సీ కమిటీ నివేదిక ఆలస్యంపై నెలకొన్న ఆవేదనను వివరించారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం.. తాను ఎల్లప్పుడూ ఉద్యోగుల … Read more

మహిళా పోలీసుల సమర్థత అభినందనీయం: స్పీకర్ గడ్డం

TG: అసెంబ్లీ బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 7న అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆయన ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సమయంలో తలెత్తిన పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళా ఉద్యోగులు తమ విధులను అత్యంత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించారని స్పీకర్ … Read more