చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే నీళ్ల తరలింపు: మాజీ మంత్రి హరీశ్‌రావు

TG: దేశమంతా ఎల్‌నినో ప్రభావం ఉన్న ఈ తరుణంలో చుక్కచుక్క నీటిని ఒడిసిపట్టాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాలపై మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పంట పొలాలు ఎండుతుంటే, కృష్ణా జలాలను దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా ఏపీకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లముందే నీళ్లు పారుతున్నా ప్రజలకు ఇవ్వలేని దుస్థితి సాగుతోందని ధ్వజమెత్తారు. పాలమూరుపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న ప్రేమ … Read more

హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు తీవ్ర బీభత్సం సృష్టించింది. ఆటోను తప్పించబోయి అదుపుతప్పిన బస్సు వేగంగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. దిల్‌సుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఈ బస్సు చౌటుప్పల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు దూసుకెళ్లిన ఉద్ధృతికి ఒక కారు పూర్తిగా ధ్వంసమవగా, మరో వాహనం దెబ్బతింది. నేరుగా డీజిల్ పంపు వద్దకు దూసుకెళ్లడంతో అక్కడి పరికరాలు పూర్తిగా విరిగిపడ్డాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో … Read more

దుర్గం చెరువు సందర్శకులకు అలర్ట్.. రెండు రోజులు ఎంట్రీ బంద్

హైదరాబాదీలకు సాయంత్రం ప్రశాంతంగా గడిపే ప్రధాన స్పాట్లలో ఒకటైన దుర్గం చెరువు రెండు రోజులపాటు మూతపడనుంది. 2026 సెప్టెంబర్ 10, 11 తేదీల్లో చెరువులోకి సందర్శకులకు అనుమతి లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ రెండు రోజులు విజిటర్స్ తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. దుర్గం చెరువు వద్ద జలమండలి కొన్ని కీలక పనులను చేపట్టింది. చెరువులో వసతులు, సౌకర్యాల మెరుగుదల కోసం ప్రస్తుతం మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్వహణ పనులకు ఎలాంటి ఆటంకం … Read more

కన్నీరు పెట్టిన బొత్స సత్యనారాయణ

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ, విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. గురువారం గరివిడిలో ఈ సమావేశం నిర్వహించారు. ఇటీవల పార్టీ మారిన ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ (చిన్న శ్రీను)తో పార్టీకి ఉన్న అనుబంధాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. ఆ సమయంలో నమ్మినవాళ్లు మోసం చేశారంటూ బొత్స ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తండ్రి కంటతడి పెట్టడం చూసి చలించిపోయిన ఆయన కుమార్తె బొత్స అనూష వెంటనే … Read more

కంటతడి పెట్టిన ‘అగ్ని పరీక్ష సీజన్ 2’ రాజకుమారి

బిగ్‌బాస్ ‘అగ్ని పరీక్ష సీజన్ 2’ ద్వారా ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ రాజకుమారి దయాన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఆటతీరుతో కాదు.. తనపై వస్తున్న ట్రోలింగ్‌పై కన్నీళ్లతో స్పందించి అందరినీ భావోద్వేగానికి గురిచేశారు. ‘అగ్ని పరీక్ష’లో కామన్ మ్యాన్ కేటగిరీలో పోటీ చేసిన రాజకుమారి.. తన కాన్ఫిడెన్స్, మాటతీరు, తెగువతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్కుల్లో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడిన విధానం జడ్జీలతో పాటు … Read more

వినాయక నిమజ్జనాలపై దుష్ప్రచారం నమ్మవద్దు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై వస్తున్న వ్యతిరేక ప్రచారాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా ఖండించారు. చెరువుల్లో గణేష్ నిమజ్జనానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న చెరువుల్లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగైదు చెరువుల వద్ద మాత్రమే ఆంక్షలు ఉన్నాయని రంగనాథ్ స్పష్టం చేశారు. అమీన్‌పూర్ చెరువు దేశంలోనే ప్రప్రథమ … Read more

పర్యావరణ హితంగా వినాయక చవితి పరవళ్లు: చిరంజీవి, విజయ్ సందేశం

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణ స్పృహతో జరుపుకోవాలని సినీ నటులు చిరంజీవి, విజయ్ దేవరకొండ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విత్తన గణపతి ఉత్సవాలకు తమ మద్దతు తెలిపారు.

బిగ్ బాస్ 10: తొలి మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో చరణ్ అవుట్?

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఊహించని పరిణామం ఎదురైంది. షో చరిత్రలోనే మొదటిసారిగా ఒక కంటెస్టెంట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ నుండి బయటకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

సీఎం సొంత ఊరి ముందే కరెంట్ కోసం ధర్నానా?: హరీశ్‌రావు

నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే ఉచిత విద్యుత్ కోసం రైతులు రహదారిపై ధర్నాకు దిగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ట్రాక్టర్లతో మెరుపు ధర్నా, రాస్తారోకో చేపట్టడం రాష్ట్రంలోని ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ … Read more

BIG BREAKING: KTR, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు

హైదరాబాద్: అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న తమపై దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో BRS ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నెల 7న అసెంబ్లీ వద్ద ప్రొటోకాల్/పరిస్థితుల నిర్వహణలో భాగంగా విధుల్లో ఉండగా తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ … Read more