ఈ 3 రాశుల వారికి రాజయోగం, విశేష ధనలాభం! (ఏప్రిల్ 5 – 11)

మన పత్రిక, హైదరాబాద్: గ్రహాల కదలికలు, సంచారాల ఆధారంగా కొత్త వారం (ఏప్రిల్ 5 నుంచి 11 వరకు) రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఈ వారంలో సూర్యుడు, కుజుడు, శని గ్రహాలు మీన రాశిలో సంచరించనున్నాయి. అలాగే బుధుడు కుంభ రాశిలో, శుక్రుడు మేష రాశిలో, గురువు మిథున రాశిలో ఉండనున్నారు. ఇక చంద్రుడు వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో సంచరిస్తాడు. ఈ విశేష గ్రహాల కలయిక వల్ల ఈ … Read more

TG Inter Result 2026: టీజీ ఇంటర్ ఫలితాలపై అప్‌డేట్..

మన పత్రిక, హైదరాబాద్: Telangana Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియ పూర్తిగా ముగిసింది. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ నుంచి 4 లక్షల మంది, సెకండ్ ఇయర్ నుంచి 5 లక్షల మంది.. మొత్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. … Read more

సూర్యాపేట లోక్ అదాలత్‌లో 3890 కేసుల పరిష్కారం

మన పత్రిక, సూర్యాపేట: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. పోలీసు, న్యాయ, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,890 కేసులను వేగవంతంగా పరిష్కరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాలత్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పరిష్కారమైన కేసుల వివరాలను ఎస్పీ వెల్లడిస్తూ.. ఇందులో ఎంవీ … Read more

AP: డిసెంబర్‌ నాటికి మరో 4.50 లక్షల ఇళ్లు..

మన పత్రిక, నాయుడుపేట: పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో ఏర్పాటు చేసిన ‘టిడ్కో’ (TIDCO) సంక్షేమ గృహ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కింద ఏకకాలంలో 2.50 లక్షల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రాయచోటిలో … Read more

ఏప్రిల్ 2026 బ్యాంక్ 14 రోజులు సెలవులు..

మన పత్రిక, హైదరాబాద్: ఏప్రిల్ (2026) నెలలో బ్యాంకు పనుల నిమిత్తం వెళ్లే కస్టమర్లకు ముఖ్య గమనిక. రాబోయే ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు ఏకంగా 14 రోజుల పాటు మూతపడనున్నాయి. ఆర్థిక సంవత్సర ముగింపు, వరుస పండుగలు, ప్రభుత్వ మరియు వారాంతపు సెలవులు కలుపుకుని ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం సెలవులు ఉండనున్నాయి. ఈ 14 రోజుల సెలవుల్లో 4 ఆదివారాలు, 2 శనివారాలు (రెండో, … Read more

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గిన ధరలు

మన పత్రిక, హైదరాబాద్: మాంసాహార ప్రియులకు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. గతవారం వరకు చుక్కలనంటిన చికెన్ ధరలు ఈ వారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కిలో చికెన్‌పై ఏకంగా రూ. 100 వరకు ధర దిగిరావడం విశేషం. మార్చి నెల ఆరంభంలో వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో కోళ్లు చనిపోవడం, దాణా ఖర్చులు పెరగడంతో ఫామ్ యజమానులు ధరలు పెంచారు. దానికితోడు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ … Read more

నేటి నుంచే ఐపీఎల్.. తొలి పోరులో బెంగళూరు vs హైదరాబాద్‌!

ఐపీఎల్‌ 19వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. పది జట్లు మరోసారి అసలైన టీ20 మజాను అందించేందుకు పోటీపడుతున్నాయి. శనివారం బెంగళూరు-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానుంది. గతేడాది టైటిల్‌ గెలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ట్రోఫీని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఒకసారి ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో కప్పుపై దృష్టి సారించింది. చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు తమ ఆధిపత్యాన్ని మళ్లీ చాటుకోవాలని చూస్తున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గత సీజన్‌ నిరాశను మరచి నాలుగో … Read more

రణబలి షూటింగ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంట

మన పత్రిక, సినిమా: ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ మ్యారేజ్ లైఫ్‌ను ఆస్వాదిస్తూ కూడా పనిలో ఏమాత్రం విరామం ఇవ్వడం లేదు. ఈ జంట కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో విజయ్ ‘రణబలి’గా, రష్మిక ‘జయమ్మ’గా కనిపించనున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. … Read more

ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో 84 మండలాల్లో వడగాల్పుల తీవ్రత

మన పత్రిక అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మొన్నటి వరకు వర్షాలతో అల్లాడిన ప్రజలకు ఇప్పుడు భానుడి సెగలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 68 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎండ … Read more

రంగారెడ్డి: నేడు పరీక్ష.. నిన్న పదో తరగతి విద్యార్థి మృతి

మన పత్రిక, తెలంగాణ: పండుగ పూట ఆ ఇంట్లో విషాదం నిండింది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ పదో తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తొర్రూరు గ్రామానికి చెందిన బచ్చిగళ్ల శంకరయ్య, అనిత దంపతుల కుమారుడు అభిలాష్‌ (16) ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల … Read more