చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి

మన పత్రిక: చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ (YSR జంక్షన్) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జుగా అయి, లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు గుర్తించిన మేరకు, మృతులు తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన హరీష్, … Read more

నమ్మించి వంచించిన కిరాతకుడు.. టీచర్ సూసైడ్

మన పత్రిక, AP: నమ్మిన ప్రేమే ఆమెకు శాపమైంది. పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన ఓ కిరాతకుడి చేతిలో మోసపోయిన యువతి, చివరకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుతూ ఆమె రాసిన చివరి అక్షరాలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని పామూరు మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. అయ్యవారిపల్లికి చెందిన మాధవి (24) స్థానికంగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. … Read more

హైదరాబాద్: సైబర్ మోసం.. రూ.2.36 కోట్లు స్వాహా

మన పత్రిక, క్రైం: హైదరాబాద్ నగరంలో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.2.36 కోట్లు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మోసం గతేడాది ఆగస్టులో ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన వీరభద్రరావు అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ‘కోరా’ అనే పేరుతో Facebookలో ఒక గుర్తుతెలియని మహిళ పరిచయమైంది. తాను సింగపూర్‌కు … Read more

ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. యువతి సూసైడ్

మన పత్రిక, ఆంధ్రప్రదేశ్ క్రైం: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేయడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణ జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కట్నం ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని తెగేసి చెప్పడంతో చేసేది లేక ఎలుకల మందు మింగింది. గొడుగుపేటకు చెందిన రాగశ్రీకి ఇన్ స్టాగ్రామ్‌లో కోనసీమ జిల్లా మండపేటకు చెందిన లీలా కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. రాగశ్రీ పెళ్లి … Read more

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వ్యభిచారం

మన పత్రిక, క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వ్యభిచార దందా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పట్టణంలోని రద్దీ ప్రాంతమైన అశోక్ టాకీస్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఏడుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు పట్టుబడటం సంచలనంగా మారింది. పోలీసుల నిత్య గస్తీ ఉండే ప్రాంతాలు, నివాస గృహాలు అధికంగా ఉన్న మర్లు, బైపాస్ రోడ్డు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని నిర్వాహకులు ఈ దందాను సాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది మంది విటులతో ఒక … Read more

హైదరాబాద్: పెళ్లి దుస్తుల్లో ధరించి OYOలో సూసైడ్

మన పత్రిక, క్రైం: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధిలో శుక్రవారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లికి చెందిన వనమల లోకేశ్‌ (29) నగరంలోని గండిమైసమ్మ ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీలో పని చేసేవాడు. లోకేశ్ గత రెండేళ్లుగా సహచరితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ వివాహానికి ముందే నిర్ణయం తీసుకొని, పెళ్లి బట్టలు కూడా కొనుగోలు చేసుకున్నారు. శుక్రవారం లోకేశ్ ఓయో గదిని అద్దె తీసుకొని, … Read more

తెల్లవారుజామున గోదావరిఖనిలో ఘోన రోడ్డుప్రమాదం

మన పత్రిక, తెలంగాణ క్రైం: కరీంనరగ్ జిల్లాలోని గోదావరిఖనిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న కారు అతివేగంతో వచ్చి రాజేశ్ థియేటర్ సమీపంలో ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టిన తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారు అందరూ లోపలే ఇరుక్కుపోయారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కారులో … Read more

కరీంనగర్‌లో దారుణం.. పిల్లలను బావిలో పడేపిన తండ్రి

మన పత్రిక, క్రైం: కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి అమానుషానికి పాల్పడి తన కవల కూతుళ్ల ప్రాణాలను బలి తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం జూబ్లీ నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గచ్చు శ్రీశైలం అనే వ్యక్తి శుక్రవారం ఉదయం తన భార్యతో గొడవ పడ్డాడు. ఆగ్రహానికి లోనైన అతడు కన్నప్రేమను మరచి సుమారు ఐదేళ్ల వయస్సున్న తన కవల కూతుళ్లపై … Read more

నిర్మల్: పురుగు మందు తాగి సర్పంచ్ సూసైడ్

మన మత్రిక, TG క్రైం: నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి దురదృష్టకర పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం లహరి పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కారులో సమీప ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి వేగంగా తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యలో కారు అదుపుతప్పి రోడ్డు … Read more

పల్నాడు: దాహమని నీళ్లు అడిగి.. మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై అత్యాచారం

మన పత్రిక, AP క్రైం: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. దాహమని నీళ్లు అడిగిన వ్యక్తికి సహాయం చేయబోయిన ఓ మహిళపై అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మాచర్లలో చోటుచేసుకుంది. సత్తెనపల్లికి చెందిన బాధితురాలు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ మాచర్లలో ఒంటరిగా నివసిస్తోంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో, సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇంటి తలుపు తట్టి తాగడానికి నీళ్లు అడిగాడు. ఆమె లోపలికి … Read more