అల్లూరి జిల్లాలో రాత్రి భూప్రకంపనలు

మన పత్రిక, ఏపీ: మన్యం ప్రాంతంలో శనివారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించి ప్రజల్లో కలకలం రేపాయి. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి దాదాపు 30 సెకన్ల పాటు కంపించింది. ముఖ్యంగా అరకు వ్యాలీ, పాడేరు, పెడబయలు, హుకుంపేట ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా అనుభూతి అయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఉలిక్కిపడి లేచి భయాందోళనకు గురయ్యారు. కొందరు ప్రాణభయంతో … Read more

ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకున్న కీలక నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర నూతన మ్యాప్‌ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఈ నెల 2న అధికారికంగా ఈ మ్యాప్‌ను ప్రకటించింది. మొత్తం 28 జిల్లాలతో రూపొందించిన ఈ మ్యాప్‌లో కొత్తగా ఏర్పడిన జిల్లాల సరిహద్దులను స్పష్టంగా చూపించారు. ఈ మ్యాప్‌లో అత్యంత ముఖ్యమైన అంశం అమరావతి కు ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల … Read more

తిరుమలలో భక్తుల వెల్లువ.. సర్వదర్శనానికి 15 గంటలు

మన పత్రిక, తిరుమల తిరుపతి దేవస్థానం: పవిత్ర క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. వరుస సెలవులు, విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో శనివారం తెల్లవారుజామున నుంచే తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో బయట క్యూలైన్లలో భక్తులు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోందని టీటీడీ … Read more

శ్రీధర్‌ ప్లాన్‌తోనే నాపై దాడి జరిగింది: హర్ష వీణ

మన పత్రిక, AP: రైల్వే కోడూరులో జరిగిన దాడి ఘటనపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. పథకం ప్రకారమే తమపై దాడి జరిగిందని, తనను చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆమె, “నేను చావడానికైనా సిద్ధమే కానీ నా పోరాటం ఆపను” అని స్పష్టం చేశారు. దాడి సమయంలో అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారని, తనపై దాడికి ఆయనే ప్రేరేపించారని ఆరోపించారు. తాతంశెట్టి నాగేంద్ర తనపై దాడి చేశారని, మరికొందరు … Read more

జగన్ మానసిక పరిస్థితి ఏం బాలేదు: మాజీ మంత్రి

మన పత్రిక, ఏపీ రాయజకీయం: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. గతంలో విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అంశంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలోనూ వైఖరి మారిందని, గతంలో వ్యతిరేకించి ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం సరైంది … Read more

AP: మాజీ మంత్రిపై పేర్ని నానిపై కేసు నమోదు

మన పత్రిక, రాజకీయం: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు దిగిన ఆరోపణలపై పోలీసులు చర్యలు చేపట్టారు. చిలకలపుడి చిలకలపూడి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం, మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని తన అనుచరులతో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా … Read more

ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు పోలింగ్ రోజున పెయిడ్ లీవ్ ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు జిల్లాలైన తిరుపతి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ సదుపాయం వర్తించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, పరిశ్రమల ఉద్యోగులతో పాటు రోజువారీ కూలీలు కూడా ఈ … Read more

ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదలకు కసరత్తు

మన పత్రిక : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చంద్రబాబు సర్కార్ తీపికబురు అందించింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏతో పాటు ఇతర భారీ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి నిలిచిపోయిన ఈ బిల్లుల కోసం ఉద్యోగులు ఎప్పటికప్పుడు మొరపెట్టుకుంటున్నా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో, బకాయిల చెల్లింపులపై తగిన కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన … Read more

AP: డిసెంబర్‌ నాటికి మరో 4.50 లక్షల ఇళ్లు..

మన పత్రిక, నాయుడుపేట: పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో ఏర్పాటు చేసిన ‘టిడ్కో’ (TIDCO) సంక్షేమ గృహ సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కింద ఏకకాలంలో 2.50 లక్షల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రాయచోటిలో … Read more

ఆంధ్రప్రదేశ్: విద్యుత్తు రంగంలో విప్లవాత్మక నిర్ణయం

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రానున్న ఆర్థిక సంవత్సరం (FY27)లో కరెంట్ ఛార్జీలు పెంచకూడదని, అలాగే ట్రూఅప్ రూపంలో ప్రజలపై అదనపు భారం వేయకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిస్కమ్‌లకు ఏర్పడే ₹15,790 కోట్ల రెవెన్యూ లోటును ప్రభుత్వమే భరిస్తుందని ఏపీఈఆర్‌సీ (APERC)కి లేఖ రాసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 కోట్ల గృహ వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. గతంలో ప్రకటించిన విధంగానే 22 లక్షల … Read more