జీహెచ్‌ఎంసీ కొత్త మ్యాప్ విడుదల.. 300 డివిజన్లు, 60 సర్కిళ్లుగా పెంపు

GHMC New Map: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. డివిజన్ల పునర్విభజనను అధికారికంగా ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో, తాజాగా కొత్త జీహెచ్‌ఎంసీ మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ కొత్త వ్యవస్థలో గ్రేటర్ పరిధిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజా మ్యాప్ ప్రకారం నగరంలో మొత్తం డివిజన్ల సంఖ్య 300కు చేరింది. పరిపాలనా సౌలభ్యం కోసం జోన్ల సంఖ్యను 6 నుంచి 12కు, … Read more

అసెంబ్లీకి కేసీఆర్: ఎర్రవెల్లి భేటీలో కీలక నిర్ణయం.. డిసెంబర్ 29న హాజరు!

ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణపై చర్చించిన ఆయన.. ఈనెల 29న శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేస్తోందని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ బీఆర్ఎస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. … Read more

టీజీ టెట్ టెస్ట్ లింక్ విడుదల | TG TET 2026 Mock Test

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026)కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకునేందుకు వీలుగా అధికారిక మాక్ టెస్ట్ లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలో పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మాక్ టెస్ట్ కోసం అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లింక్‌లో డిఫాల్ట్‌గా ఉండే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో … Read more

School Holidays: స్కూళ్లకు 9 రోజులు సెలవులు.. సంక్రాంతి హాలిడేస్ లిస్ట్ ఇదే

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు వరుసగా 9 రోజుల పాటు సెలవులను ఖరారు చేసింది. జనవరి 10 (రెండో శనివారం) నుంచి సెలవులు మొదలై జనవరి 18 (ఆదివారం) వరకు కొనసాగుతాయని, తిరిగి జనవరి 19న బడులు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు. గత ఏడాది కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా, ఈసారి శని, ఆదివారాలు కలిసి రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. పొరుగున … Read more

చిల్లపల్లి సర్పంచ్ గెలిచిన వెంటనే నీటి సమస్య పరిష్కారం..

చిల్లపల్లి సర్పంచ్‌గా భారీ మెజారిటీతో విజయం సాధించిన యువ నాయకుడు గోపు సంతోష్ కుమార్, గెలిచిన వెంటనే తన పనితీరుతో ప్రశంసలు అందుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఆయన, ప్రజలకు ఇచ్చిన మాటను చేతల్లో చేసి చూపిస్తున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న బోరు గత కొద్ది రోజులుగా పనిచేయకపోవడంతో స్థానికులు, విద్యార్థులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ సంతోష్ కుమార్ వెంటనే … Read more

ధర్మపురి ఆలయాల్లో చోరీ.. వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు

జగిత్యాల జిల్లా ధర్మపురిలో దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని కమలాపూర్ రోడ్డులో ఉన్న శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం నిత్య పూజల కోసం ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన అర్చకులు, తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని వెండి ప్రాణ వట్టం, అమ్మవారి వెండి ముఖ కవచాన్ని … Read more

భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి చంపిన భర్త

హైదరాబాద్‌లోని నల్లకుంటలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కిరాతక భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు ఘటన జరిగిన 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో వెంకటేష్ వేధించేవాడు. గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిన త్రివేణిని నమ్మించి నగరానికి … Read more

ఆ ఇద్దరు మంత్రులు జైలుకే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మన పత్రిక, వెబ్​డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు భారీగా అవినీతికి పాల్పడ్డారని, ఆధారాలతో సహా కేంద్రం వద్ద వారి చిట్టా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా వారిపై ఉందని, ఆ ఇద్దరు మంత్రులు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కూడా సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్‌ను బూతులు తిట్టడం వెనుక పెద్ద కుట్ర … Read more

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 304 వాహనాలు సీజ్

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర (2026) వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిన్న ఒక్క రాత్రే రికార్డు స్థాయిలో 304 వాహనాలను (కార్లు, బైకులు) సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. నేరం తీవ్రతను … Read more

TG News: సాగునీటి శాఖ రూ. 22 వేల కోట్ల బకాయిలు

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. గత ఐదేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పెరిగాయి. ఈ జాబితాలో సాగునీటి పారుదల శాఖ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క శాఖే ఏకంగా రూ. 22,926 కోట్లు బాకీ పడటం గమనార్హం. ఆ తర్వాత హైదరాబాద్ వాటర్ బోర్డు రూ. … Read more