జీవోలన్నీ ఆన్‌లైన్‌లో పెట్టాల్సిందే.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ హైకోర్టు (Telangana High Court) రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో (G.O.), నోటిఫికేషన్లు, నిబంధనలు మరియు సర్క్యులర్లను తక్షణమే ఆయా శాఖల అధికారిక వెబ్‌సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. జీవోలను వెబ్‌సైట్‌లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. అదృశ్యమైన 15 వేల జీవోలు: విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు … Read more

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి, కేసు నమోదు.

మన పత్రిక, వెబ్​డెస్క్: కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన మిట్టపల్లి రత్నా అనే మహిళ రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతి చెందారు. స్థానిక గోపాల్‌పూర్ ఎక్స్ రోడ్ (Gopalpur X Road) పై ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చల్మెడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ … Read more

నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. కేసీఆర్ అధ్యక్షతన సమావేశం.

మన పత్రిక, వెబ్​డెస్క్: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ అధ్యక్షతన నేడు (ఆదివారం) కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ఎలా … Read more

Bonus: రైతులకు రూ.500.. సోమవారం నుంచే జమ.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సన్న వడ్ల బోనస్’ (Sanna Vadlu Bonus) పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. సన్న రకాలు సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ. 500 చొప్పున అదనపు బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, రూ. 649 కోట్ల నిధులను ఆమోదించింది. ముఖ్యాంశాలు:

జర్నలిస్టులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సూపర్ స్పెషాలిటీ సేవలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈజేహెచ్‌ఎస్ (EJHS) వెల్‌నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. వెల్‌నెస్ సెంటర్లలో కేవలం ప్రాథమిక వైద్యమే కాకుండా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తేవాలన్నారు. ఇందులో భాగంగా … Read more

పంచాయతీ ఫలితాలే మా పాలనకు గీటురాయి.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్

మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రంలో ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తం 12,702 పంచాయతీలకు గాను 7,527 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా గెలవగా, మరో 808 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారని వివరించారు. మొత్తంగా 66 శాతం ఫలితాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్, బీజేపీ కూటమి కేవలం 33 శాతం (బీఆర్ఎస్ 3,511, బీజేపీ 710) స్థానాలకే పరిమితమయ్యాయని … Read more

ఉపాధి హామీ పేరు మార్పుపై హరీష్ రావు ఫైర్.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే!

మన పత్రిక, వెబ్​డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును తొలగించి, ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’గా మార్చాలనుకోవడం అత్యంత ఆక్షేపణీయం అని మండిపడ్డారు. ఇది కేవలం పేరు మార్పు కాదని, దేశ సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని ‘ఎక్స్’ (Twitter) వేదికగా ధ్వజమెత్తారు. హరీష్ … Read more

స్కూల్ టైమింగ్స్ చేంజ్.. కలెక్టర్ ఆదేశాలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలోని ఉత్తర జిల్లాలను చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 6 నుంచి 7 డిగ్రీలకు పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. ఉదయం వేళల్లో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి గురువారం పాఠశాలల వేళలను మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ అనే తేడా లేకుండా జిల్లాలోని అన్ని ప్రాథమిక, … Read more

GHMC ఉద్యోగులకు జాక్‌పాట్.. విలీన ప్రాంతాల్లో 24% HRA అమలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనమైన చుట్టుపక్కల మున్సిపాలిటీలు, ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే 24% ఇంటి అద్దె భత్యం (HRA) అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వం శివారు మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రాంతాల్లోని ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు వర్తింపజేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (TGOs) ప్రభుత్వాన్ని … Read more

నేడే ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు | Telangana Speaker Gaddam Prasad

మన పత్రిక, వెబ్​డెస్క్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ నేడు (బుధవారం) సాయంత్రం తీర్పు చెప్పబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో, వారిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, ఫిరాయింపుల వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని, ఈ నెల 18వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం వెల్లడించాలని … Read more