Telangana Weather: 5 రోజుల పాటు వర్షాలు.. జిల్లాల వారీగా వివరాలు

మన పత్రిక, హైదరాబాద్: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు (ఏప్రిల్ 18 నుంచి 23 వరకు) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున పలు … Read more

Dost Notification 2026: నేడే డిగ్రీ నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్ వివరాలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ – DOST) 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్‌ను నేడు (ఏప్రిల్ 13, సోమవారం) ఉదయం 11:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్ 15 నుంచి విద్యార్థులు dost.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ … Read more

నల్గొండ జిల్లాలో దారుణం.. భీమారంలో గొర్రెల కాపరి హత్య

మన పత్రిక, కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంచర్ల జానయ్య (65) అనే గొర్రెల కాపరిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి కమ్మ బజారులోని తన గొర్రెల దొడ్డి వద్ద మంచంపై నిద్రపోతున్న ఆయనను బలమైన ఆయుధాలతో ముఖంపై దాడి చేసి చంపేశారు. శనివారం ఉదయం జానయ్య భార్య చౌడమ్మ దొడ్డి వద్దకు వెళ్లి దుప్పటి తీసి చూడగా, రక్తపు గాయాలతో … Read more

Miryalaguda: కరెంట్ షాక్‌తో మహిళ మృతి.. పొలంలో విషాదం

మన పత్రిక, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వరి కోత పనులకు వెళ్లిన శంకరమ్మ (35) అనే మహిళ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో వరి కోత పనులు జరుగుతుండగా, కోత మిషన్‌కు మోటార్ సర్వీస్ వైర్ తగిలే అవకాశం ఉండటంతో శంకరమ్మ దానిని కర్రతో పైకి లేపే ప్రయత్నం చేసింది. అయితే ఆ కర్ర జారిపోయి … Read more

నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే

Telangana intermediate results 2026

TS Telangana Inter 1st 2nd Year Result 2026 tgbie.cgg.gov.in: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు నేడు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. పరీక్షలు ముగిసిన కేవలం 25 రోజుల్లోనే రికార్డు వేగంతో బోర్డు రిజల్ట్స్ సిద్ధం చేయడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 25 … Read more

LB Nagar: మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి

మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ చౌరస్తా సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను బలితీసుకుంది. మద్యం మత్తులో కారు నడుపుతున్న కనకాల రామ్‌కుమార్ రెడ్డి.. ముందుగా రోడ్డు దాటుతున్న శ్రీధర్ అనే వ్యక్తిని, ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న నల్గొండ జిల్లా అల్వాలకు చెందిన కంచర్ల శివ(20), మిర్యాలగూడకు చెందిన నకిరేకంటి సందీప్ కుమార్(19) మృతి చెందారు. … Read more

TGRJC Set Exam 2026: తెలంగాణ గురుకుల ఇంటర్ ప్రవేశాలు..

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (TGWREIS) ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ‘TGRJC సెట్ 2026’ నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉచితంగా లేదా తక్కువ ఫీజుతో నాణ్యమైన ఇంటర్ చదువుకునేందుకు ఈ ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలతో పాటు కేజీబీవీలలో (KGBV) సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆసక్తి … Read more

ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్

మన పత్రిక, హైదరాబాద్: ప్రజా సమస్యలు బయటకు రాకుండా ఉండేందుకే బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, సమస్యలపై తమ ధర్మ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఇక్కడ దోచుకున్న సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తరలిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాదర్‌గుల్‌లోని సర్వే నంబర్ 613/119లో ఉన్న 374 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఫేక్ డాక్యుమెంట్లతో ఆక్రమిస్తున్నారని … Read more

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

మన పత్రిక, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. ఆయనతో పాటు రితేష్ రెడ్డి, నమిత శర్మలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను మంగళవారం ఉప్పరపల్లి న్యాయస్థానం తిరస్కరించింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, ఇప్పుడు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందన్న పోలీసుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్, సరఫరాదారుల వివరాలు రాబట్టేందుకు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని … Read more

కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు వాయిదా.. కేసీఆర్ పిటిషన్‌పై ఏప్రిల్ 22న విచారణ

మన పత్రిక, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పును ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. బుధవారం నాడు ఈ తీర్పు వెలువడాల్సి ఉండగా, అనుకోకుండా ధర్మాసనం దీనిని వాయిదా వేసింది. ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు అధికారులే బాధ్యులని కమిషన్ నివేదిక పేర్కొంది. దీనిని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు, … Read more