సర్పంచ్ అభ్యర్థిపై కారం పొడితో దాడి!

మన పత్రిక, వెబ్​డెస్క్: కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేళ కలకలం రేగింది. శంకరపట్నం మండలం మొలంగూర్‌లో సర్పంచ్ అభ్యర్థి కొమురయ్యపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం.. కొమురయ్యను గుర్తుపట్టకుండా ఉండేందుకు ముందుగా ఆయన కళ్లలో కారం పొడి చల్లి, ఆపై దాడికి తెగబడ్డారు. ఊహించని పరిణామంతో బాధితుడు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కొమురయ్య … Read more

మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి: రేపే బిగ్ మ్యాచ్, వివరాలివే

మన పత్రిక, వెబ్​డెస్క్: ఒకప్పుడు ఫుట్‌బాల్‌కు అడ్డాగా ఉన్న హైదరాబాద్‌లో మళ్లీ సాకర్ మానియా కనిపిస్తోంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ రాకతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు సాగనున్న మెస్సీ భారత పర్యటనలో భాగంగా, రేపు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. కోల్‌కతాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ ప్రమోటర్ శతద్రు దత్తా ఆధ్వర్యంలో ఈ ప్రైవేట్ టూర్ జరుగుతోంది. గతంలో పీలే, మారడోనా వంటి దిగ్గజాలను భారత్‌కు రప్పించిన … Read more

Nalgonda: 21 ఏళ్ల యువతి సర్పంచ్ అయింది…

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లాలో (Nalgonda District) ఓ యువతి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన బోయపల్లి అనూష (21) ఇటీవలే బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మంచి ఉద్యోగం సాధించినప్పటికీ, ప్రజాసేవపై మక్కువతో ఆ కార్పొరేట్ ఆఫర్‌ను తిరస్కరించారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. బీఆర్ఎస్ (BRS) మద్దతుతో పోటీ చేసిన అనూష, సీనియర్ నాయకురాలిపై 182 ఓట్ల మెజార్టీతో ఘన … Read more

TGSEB: టెన్త్, ఇంటర్ బోర్డుల విలీనం!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టే యోచనలో ఉంది. పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి, ఇకపై ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు’ పేరిట ఒకే బోర్డును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ‘తెలంగాణ రైజింగ్ విజన్’ డాక్యుమెంట్‌లో ఈ కీలక అంశాన్ని పొందుపరిచారు. దేశంలో ప్రస్తుతం కేవలం 6 రాష్ట్రాల్లోనే టెన్త్, ఇంటర్ లకు వేర్వేరు బోర్డులు ఉన్నాయని ఇటీవల కేంద్ర విద్యాశాఖ … Read more

ఎన్నికల సిబ్బందికి గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన రెమ్యూనరేషన్!

telangana polling staff remuneration hike 2025 panchayat elections

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పోలింగ్ సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్‌ (REMUNERATION FOR POLLING PERSONALS IN TELANGANA 2025) ను పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఈ పెరిగిన చెల్లింపులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి టి.ఏ (TA), డి.ఏ (DA) మరియు ఇతర … Read more

TG News: తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడతాం

Telangana Rising Global Summit 2025

తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు.. చైనా, జపాన్‌లతో పోటీ పడతాం: సీఎం రేవంత్ రెడ్డి మన పత్రిక, వెబ్​డెస్క్: మీర్‌ఖాన్‌పేట్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit 2025) తొలిరోజు ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. … Read more

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. అమెరికా విమానాలే టార్గెట్.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్! మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టామని, టేకాఫ్ అయిన పది నిమిషాల్లో వాటిని పేల్చేస్తామంటూ ఆగంతకులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. బాంబు పేలకుండా ఉండాలంటే వెంటనే మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మెయిల్‌తో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది, పోలీసులు విమానాశ్రయంలోని అన్ని … Read more

హైదరాబాద్ భవిష్యత్తుకు కొత్త చిరునామా… Telangana Future city

telangana vision

మన పత్రిక, వెబ్​డెస్క్: దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తాలకు అనుబంధంగా శాటిలైట్ నగరాలు అభివృద్ధి చెందినట్లే, హైదరాబాద్‌కు ‘ఫ్యూచర్ సిటీ’ అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్, సైబరాబాద్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లతో విస్తరించిన హైదరాబాద్‌కు పెరుగుతున్న జనాభా, వలసల కారణంగా మరో కొత్త నగరం అవసరం ఏర్పడింది. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడానికి రేవంత్ రెడ్డి ఈ బృహత్తర ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. దేశ … Read more

తీవ్ర సంక్షోభంలో తెలంగాణ వర్సిటీలు.. పాలకులు మారుతున్నా తీరని వెతలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిధుల లేమి, అధ్యాపకుల కొరతతో సతమతమవుతున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో (Osmania University) ఆగస్టు 25న రెండు వసతి గృహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినప్పటికీ, అక్కడ నెలకొన్న ప్రధాన సమస్యలు మాత్రం ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజున వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేవలం ఓయూపైనే కాకుండా మిగిలిన వర్సిటీలపైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం … Read more

Teachers: టీచర్లకు సమానం సీనియారిటీ

NOTIONAL SERVICE FOR MODEL SCHOOL TEACHERS.

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ‘నోషనల్ సర్వీస్’ (Notional Service) అంశాన్ని పరిష్కరిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే నోటిఫికేషన్ అయినప్పటికీ, నియామకాలు రెండు విడతలుగా (2013, 2014) జరగడంతో రెండో దశలో చేరిన వారు సర్వీస్ పరంగా నష్టపోయారు. తాజా నిర్ణయంతో 2014లో విధుల్లో చేరిన వారికి కూడా 2013 బ్యాచ్‌తో సమానంగా సీనియారిటీ, వేతనాలు లభించనున్నాయి. ఉద్యోగ సంఘాల … Read more