జోగి రమేశ్ కుటుంబం ముందస్తు బెయిల్ పిటిషన్లు పోలీసులకు మహిళా కోర్టు

మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులపై నమోదు కేసులో అరెస్టు కాకుండా రక్షణ కోసం విజయవాడ మహిళా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

నల్లమలలో పులుల సంరక్షణకు చర్యలు పెంచుతాం: పవన్ కల్యాణ్

నల్లమల అటవీ ప్రాంతంలో పులుల ఉనికిని శాశ్వతం చేసేలా ఏపీని పులుల సంరక్షణలో ఆదర్శంగా నిలుపుతామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

తిరుమలలో భక్తుల రద్దీ: స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

భూకబ్జా కేసులో పోలీసు విచారణకు హాజరైన తమ్మినేని సీతారాం

రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీసుల విచారణకు హాజరయ్యారు.

ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభం

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

రాయలసీమలో రూ.5,350 కోట్లతో టాటా పవర్ ప్లాంట్లు

టాటా పవర్ సంస్థ రాయలసీమ ప్రాంతంలో రూ.5,350 కోట్ల భారీ పెట్టుబడితో 800 మెగావాట్ల సామర్థ్యం గల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను నిర్మిస్తోంది.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ బాబు కొట్టేస్తున్నారు: జగన్

భోగాపురం విమానాశ్రయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

మాజీ మంత్రి కారుమూరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన

ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రూ. 350 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది.