Advertisement

ఆగస్టు 17 నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభం

మన పత్రిక: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నుంచి ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం సివిల్ ఎన్‌క్లేవ్‌లో విమాన కార్యకలాపాలు ముగియనున్నాయి.

ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. రికార్డు స్థాయిలో 31 నెలల్లోనే ఈ విమానాశ్రయ నిర్మాణ ప్రాజెక్ట్ పూర్తయినట్లు సమాచారం లభించింది.

Advertisement

ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగనుంది. అనంతరం ఆగస్టు 17 నుంచి ఇక్కడి నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు పూర్తిస్థాయిలో సాగనున్నాయి.

Advertisement