PMAY-G ఆవాస్ పథకం 2025 – AI చెకింగ్‌తో దరఖాస్తు పరిశీలన

PMAY-G AI Checker Tool 2025: ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (Pradhan Mantri Awaas Yojana Gramin PMAY-G) కింద ఇల్లు లేని పేద కుటుంబాలకు కొత్త గృహాలను మంజూరు చేస్తోంది. ఈ పథకానికి దరఖాస్తులు Awaas Plus 2025 App ద్వారా స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల అర్హతను పరిశీలించేందుకు ప్రత్యేక AI Checker Tool ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఆవాస్ పథకం 2025 తాజా అప్డేట్ | PMAY-G Latest Update 2025 Geo-tagging Photos … Read more

మరో 77 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల రద్దు పర్వం వరుసగా ఐదో రోజు కూడా కొనసాగింది. హైదరాబాద్‌కు రావాల్సిన 38 సర్వీసులు, ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన 39 సర్వీసులు కలిపి.. మొత్తంగా 77 విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రద్దయిన ఇండిగో విమానాల సంఖ్య … Read more

పూజారి ఇంట్లో 40 తులాల బంగారం, రూ. 6 లక్షలు మాయం.

nagarkurnool

మన పత్రిక, వెబ్​డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool) కల్వకుర్తిలో(Kalwakurthy) దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పూజారి శ్రీనివాస శర్మ నివాసంలో భారీ చోరీ జరిగింది. నవంబర్ 30న కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఊరెళ్లగా, సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు, రూ. 6 లక్షల నగదు అపహరణకు గురైనట్లు శ్రీనివాస శర్మ గుర్తించారు. యజమానులు … Read more

తెలంగాణ గ్లోబల్ సమిట్‌కు కేంద్రం డుమ్మా.. హాట్ టాపిక్‌గా మారిన ‘ఢిల్లీ’ వైఖరి!

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ సమిట్’కు కేంద్ర ప్రభుత్వం దూరంగా ఉండటం రాజకీయ, బ్యూరోక్రాట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను ఆహ్వానించినప్పటికీ, కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. అయితే, ఏపీలో జరిగిన పెట్టుబడుల సదస్సుకు కేంద్ర మంత్రి పీయూష్ … Read more

CI Suspended: సీఐ సస్పెన్షన్.. కారణమిదే!

ci suspended

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ నగర పోలీసు శాఖలో అవినీతి, నిర్లక్ష్యంపై సీపీ సజ్జనార్ (CP Sajjanar) కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా కుల్సుంపుర సీఐ సునీల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఓ కేసులో డబ్బులు తీసుకుని నిందితుల పేర్లను మార్చారని, వారికి అనుకూలంగా వ్యవహరించారని వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపారు. ఆరోపణలు నిజమని తేలడంతో సీఐ సునీల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న వారిపై … Read more

అమెరికాలో విషాదం… అగ్ని ప్రమాదంలో జనగామ విద్యార్థిని మృతి.

america fire accident

మన పత్రిక, వెబ్​డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్ (Birmingham) ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) సంభవించిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం, గుంటూరుపల్లి గ్రామానికి చెందిన ఉడుమల సహజారెడ్డి (24)గా గుర్తించారు. నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం ఆమె అమెరికా వెళ్లారు. ప్రమాద సమయంలో మంటల్లో చిక్కుకుని సహజారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు … Read more

ACB: రూ. 60 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన హనుమకొండ అదనపు కలెక్టర్

ఏసీబీ వలలో ‘బిగ్ ఫిష్’.. లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అదనపు కలెక్టర్! మన పత్రిక, వెబ్​డెస్క్: రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి పంజా విసిరింది. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కలెక్టర్ స్థాయి అధికారి లంచం కేసులో చిక్కడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. వెంకట్ రెడ్డి ప్రస్తుతం అదనపు కలెక్టర్ గా ఉంటూనే, డీఈఓ … Read more

Airtel Plans Removed: రద్దు… కొత్త ఆప్షన్స్ ఇవే

Airtel Plans Removed

మన పత్రిక, వెబ్​డెస్క్: ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో మరోసారి మార్పులు చేసింది. బడ్జెట్ ధరలో డేటాతో పాటు వినోదాన్ని అందించే రూ. 121 మరియు రూ. 181 డేటా వోచర్లను కంపెనీ తొలగించింది. 30 రోజుల కాలపరిమితితో వచ్చే ఈ రెండు ప్లాన్స్, ఇప్పటివరకు డేటాతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ద్వారా 20కి పైగా ఓటీటీ (OTT) యాప్స్‌కు యాక్సెస్ కల్పించేవి. అయితే ఇకపై ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండవని స్పష్టమైంది. … Read more

Scrub Typhus | ఐదుగురు మృతి, వ్యాధి లక్షణాలివే

Scrub Typhus

ఏపీలో స్క్రబ్ టైఫస్ పంజా.. రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు మృతి, అధికారుల హెచ్చరిక మన పత్రిక, వెబ్​డెస్క్: Scrub Typhus | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ తీవ్రత కొనసాగుతోంది. ప్రధానంగా విజయనగరం (Vizianagaram) , పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యాధి సోకి ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతులలో విజయనగరం జిల్లాకు చెందిన సీహెచ్ రాజేశ్వరి, పల్నాడుకు చెందిన ఎం. జ్యోతి, … Read more

శబరిమలలో భక్తులపై దాడి… తల పగులగొట్టిన వ్యాపారి.

Sabarimala

శబరిమలలో ఉద్రిక్తత: తెలుగు భక్తులపై దాడి.. గాజు సీసాతో తల పగలగొట్టిన వ్యాపారి! మన పత్రిక, వెబ్​డెస్క్: Sabarimala | శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. వాటర్ బాటిల్ ధర ఎక్కువైందని ప్రశ్నించినందుకు ఓ షాపు యజమాని ఆగ్రహంతో హైదరాబాద్‌కు చెందిన భక్తుడిపై గాజు సీసాతో దాడి చేయడంతో తల పగిలింది. అంతేకాక, సదరు భక్తుడి మెడలోని మాలను కూడా వ్యాపారి … Read more