శబరిమలలో ఉద్రిక్తత: తెలుగు భక్తులపై దాడి.. గాజు సీసాతో తల పగలగొట్టిన వ్యాపారి!
మన పత్రిక, వెబ్డెస్క్: Sabarimala | శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. వాటర్ బాటిల్ ధర ఎక్కువైందని ప్రశ్నించినందుకు ఓ షాపు యజమాని ఆగ్రహంతో హైదరాబాద్కు చెందిన భక్తుడిపై గాజు సీసాతో దాడి చేయడంతో తల పగిలింది.
అంతేకాక, సదరు భక్తుడి మెడలోని మాలను కూడా వ్యాపారి తెంపేసినట్లు తెలుస్తోంది. దీనిపై తెలుగు భక్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టగా, స్థానికులు మరియు పోలీసులు వ్యాపారికే మద్దతుగా నిలిచారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ తెలుగు భక్తుల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. సరైన సౌకర్యాలు లేకపోవడంతో పాటు, ఇలాంటి వివక్షాపూరిత దాడులు జరుగుతుండటంపై భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
