శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలు.. లడ్డూ కౌంటర్లు పెంపు – తాజా ఏర్పాట్లు ఇవే

మన పత్రిక వెబ్​డెస్క్, శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ 11 రోజుల ఉత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి పర్వదినం కావడంతో, ఆ రోజున భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, గతేడాదితో పోలిస్తే ఈసారి 20 నుంచి 30 శాతం … Read more

మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామం.. నేడు, రేపు ఆల్ పార్టీ మీటింగ్స్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నేడు, రేపు రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో అఖిలపక్ష సమావేశాలు (All Party Meetings) నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి. రేపు (మంగళవారం) జిల్లా కలెక్టరేట్ల పరిధిలోనూ ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ భేటీల్లో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లపై రాజకీయ … Read more

ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు! మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని, ఈ కేసులో తదుపరి విచారణ అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ … Read more

పాముతో పోలీసులకు చుక్కలు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆటో డ్రైవర్ హల్​చల్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ ఆటో డ్రైవర్ వింతగా ప్రవర్తించాడు. తన ఆటోను సీజ్ చేయొద్దంటూ ఏకంగా పామును బయటకు తీసి పోలీసులనే భయపెట్టాడు. ఈ ఘటన శనివారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలో చోటుచేసుకుంది. సయ్యద్ ఇర్ఫాన్ అనే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో (110 పాయింట్లు) పట్టుబడ్డాడు. పోలీసులు ఆటోను సీజ్ చేయబోగా, వెంట తెచ్చుకున్న పామును చూపిస్తూ ట్రాఫిక్ ఎస్సైని బెదిరించాడు. ఆటో ఇస్తారా? లేక పామును … Read more

బాడీగార్డ్ పై సీఎం రేవంత్ చేయి చేసుకున్నారా? వైరల్ అవుతున్న వీడియో!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం దంపతులు గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో, జనం ఒక్కసారిగా ముందుకు రావడంతో సీఎం తన భద్రతా సిబ్బంది (బాడీగార్డ్)పై చేయి చేసుకున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు, గోపూజ సమయంలో సీఎం షూలు ధరించి ప్రదక్షిణలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులైన సెక్యూరిటీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదని, … Read more

కేటీఆర్: కాంగ్రెస్ నేతలను ఉరితీసినా తప్పులేదు..

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ అంశంపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతలను ఉరితీసినా తప్పులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … Read more

తెలంగాణలో కొత్త వాహనాలపై ‘సెస్’ మోత.. బైక్, కార్లపై రేట్లు ఇవే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారిపై అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో ఇకపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ (Road Safety Cess) పేరుతో కొత్త పన్ను వసూలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం ప్రకారం.. కొత్తగా రిజిస్ట్రేషన్ … Read more

గోదావరి నీళ్లు సముద్రం పాలు.. ఆ వ్యాఖ్యలు సరికాదు: ఎమ్మెల్యే సోమిరెడ్డి

మన పత్రిక వెబ్​డెస్క్, అమరావతి: ఏటా సుమారు 2,000 నుంచి 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, వీటి వినియోగంపై వివాదాలు సృష్టించడం సరికాదని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. అంతర్రాష్ట్ర జలాల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, నీటిని రాజకీయ అస్త్రంగా మార్చొద్దని ఆయన మండిపడ్డారు. విభజన తర్వాత కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో ఉన్నారని గుర్తుచేశారు. గతంలో రాయలసీమను రత్నాల … Read more

Municipal Elections: మిర్యాలగూడలో కాంగ్రెస్‌కు షాక్: బీఆర్ఎస్‌లోకి భారీగా వలసలు

మన పత్రిక, వెబ్​డెస్క్: మున్సిపల్ ఎన్నికల ( Telangana Municipal Elections ) వేడి అప్పుడే మొదలైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆదివారం మిర్యాలగూడ 47వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జ్ ఎంఏ రుక్సానా అలిం దంపతులు, దాదాపు 200 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ … Read more

నెలకు రూ. 40 వేల ఆదాయం.. కొత్త పథకం ఇదే!

indira dairy scheme

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్ (indira dairy scheme)’ పేరుతో డెయిరీ బిజినెస్ చేసే మహిళలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2 లక్షల విలువైన రెండు గేదెలను అందిస్తారు. ఇందులో 70 శాతం (రూ. 1.4 లక్షలు) ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుండగా, మిగిలిన మొత్తం బ్యాంక్ రుణంగా ఉంటుంది. పశుగ్రాసం, షెడ్ల … Read more