మన పత్రిక, వెబ్డెస్క్: మున్సిపల్ ఎన్నికల ( Telangana Municipal Elections ) వేడి అప్పుడే మొదలైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆదివారం మిర్యాలగూడ 47వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జ్ ఎంఏ రుక్సానా అలిం దంపతులు, దాదాపు 200 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కదనే భయంతోనే అధికార పార్టీ నేతలు కారు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో మిర్యాలగూడలో 36 స్థానాలు గెలిచి బీఆర్ఎస్ ఊపుమీదుండగా, తాజా వలసలు ఆ పార్టీకి మరింత బలాన్నిచ్చాయి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వలసలు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
