Advertisement

కూటమి రెండేళ్ల పాలనపై రేపటి నుంచి టీడీపీ ఇంటింటి ప్రచారం

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని రేపటి నుంచి డోర్ టు డోర్ ప్రచారం చేపట్టాలని TDP నిర్ణయించింది. ఈ కార్యక్రమం మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ శ్రేణులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ ప్రచారంలో భాగంగా ప్రభుత్వం సాధించిన విజయాలను, ఇచ్చిన హామీల అమలు తీరును ప్రజలకు సమగ్రంగా వివరించాలని నాయకులను చంద్రబాబు ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలవడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు కేవలం అనుచరులుగా మిగిలిపోకుండా నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిపక్ష గొడ్డలి పార్టీకి చెందిన విధ్వంసకర విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement