అబుదాబి దాడుల్లో సిరిసిల్ల యువకుడికి గాయాలు.. ఆందోళనలో కన్నవారు!
మన పత్రిక వెబ్డెస్క్, రాజన్న సిరిసిల్ల: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, దాడుల సెగ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరింది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్. రాజేశ్వరరావుకు గాయాలయ్యాయి. గత ఏడాదిగా అబుదాబి ఎయిర్పోర్ట్లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు.. ఈ దాడుల్లో తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. వీడియో కాల్ ద్వారా తమతో మాట్లాడినప్పటికీ, గాయాలను మాత్రం చూపించలేదని ఆయన తండ్రి ప్రభాకర్ రావు కన్నీటిపర్యంతమయ్యారు. తన … Read more