ముదుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

ముదుమాల్ నిలువురాళ్ల పార్కు అభివృద్ధి పనులకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ పార్కు అందుబాటులోకి వస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని తెలిపారు.

జగిత్యాలలో పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు

జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బాడా బస్సు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది విద్యార్థులు ఉన్నారు.

వరంగల్‌లో ఉబర్ బైక్ సేవలు ప్రారంభం

వరంగల్ జిల్లాలో ఉబర్ బైక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోజువారీ ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు స్థానిక డ్రైవర్లకు ఉపాధి లభిస్తుందని ప్రతినిధులు వెల్లడించారు.

పిహెచ్ జ్యువెల్స్ పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

రూ.3.54 కోట్ల ఐటీసీ రీఫండ్ రీవిజన్ కేసులో పిహెచ్ జ్యువెల్స్ వేసిన రెండు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. పన్ను అధికారుల చర్యలను సమర్థించింది.

బండి సంజయ్ వ్యాఖ్యలపై తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ స్పందన

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తును ప్రజలే తేలుస్తారని తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ స్పష్టం చేశారు.

తమ్మినేని సీతారాం దంపతులకు తాత్కాలిక బెయిల్ మంజూరు

భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయగా, వారి కుమారుడు నాగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

టీడీపీ నోటీసులపై స్పందించిన బొండా ఉమా: కమిటీకి వివరణ ఇస్తానని వెల్లడి

వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్న వ్యవహారంలో టీడీపీ నోటీసు ఇచ్చిందని, దీనిపై పార్టీ కమిటీ ముందు తన వివరణ ఇస్తానని ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు.

ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం చంద్రబాబు

ఎల్‌నినో వాతావరణ ప్రభావంపై రైతుల్లో విస్తృతంగా అవగాహన పెంచాలని, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.

జూలై 28న స్టాక్ మార్కెట్లకు సెలవు ఉందా? NSE, BSEల స్పష్టత

జూలై 28 మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లు సాధారణ వేళల్లోనే పనిచేస్తాయని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ట్రేడింగ్ క్యాలెండర్ ద్వారా స్పష్టమవుతోంది.