Telangana Assembly: ఇరిగేషన్‌పై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. పాలమూరుపై ఆరా

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి సాగునీటి రంగం, ప్రాజెక్టుల స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్న అంశాలపై సీఎం ఫోకస్ పెట్టారు. రాష్ట్రానికి రావాల్సిన నదీజలాల వాటా, ఏపీతో కొనసాగుతున్న జల … Read more

‘సిక్స్త్ సెన్స్’తో విడిపోయిన జంట ఒక్కటి.. కానీ ఈ ప్రశ్నలకు జవాబేది?

మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక రేప్ కేసు విచారణలో సుప్రీంకోర్టు అరుదైన, ఆసక్తికర తీర్పునిచ్చింది. పరస్పర అపార్థాల వల్ల విడిపోయి, ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష వరకు వెళ్లిన ఓ జంటను తన ‘అసాధారణ అధికారాలను’ (Article 142) ఉపయోగించి తిరిగి కలిపింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం తమ ‘సిక్స్త్ సెన్స్’ (Sixth Sense) ద్వారా వీరు కలుస్తారని ముందే గ్రహించామని వ్యాఖ్యానించింది. అసలేం జరిగిందంటే: 2015లో సోషల్ మీడియాలో … Read more

శివాజీ వ్యాఖ్యలపై రచ్చ.. బట్టల సత్తిగాడు అంటూ ఎస్‌కేఎన్ ఘాటు కౌంటర్

మన పత్రిక, వెబ్​డెస్క్: “అసభ్య వస్త్రధారణే మందల ప్రవర్తనకు కారణమా?” అంటూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఎదుట ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ, తనపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. అయితే, సమస్య బట్టల్లో లేదని, అది కేవలం ‘మూక ఉన్మాదం’ అని సినీ విశ్లేషకులు మండిపడుతున్నారు. నిండుగా కప్పుకున్నా సమంత వంటి వారికి గతంలో ఇబ్బందులు తప్పలేదని, మగాళ్లను కూడా ఈ మూకలు వదలవని గుర్తుచేస్తున్నారు. తాజాగా … Read more

సిమెంట్ మిల్లర్‌లో చిక్కుకుని యువకుడి చేయి నుజ్జునుజ్జు

మన పత్రిక, వెబ్​డెస్క్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్ పల్లిలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్లాబ్ వేస్తుండగా సిమెంట్ మిల్లర్ యంత్రాన్ని ఆపరేట్ చేస్తున్న కొమరం మహేశ్ అనే యువకుడి చేయి ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుంది. దీంతో అతని మణికట్టు వరకు చేయి నుజ్జునుజ్జు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది కిషన్, రఫిక్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం … Read more

కరెంట్ షాక్‌తో కొడుకు, రైలు కింద పడి తండ్రి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో కొడుకు మరణించగా, ఆ బాధను తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. అట్లూరి సునీల్ అనే యువకుడు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా, భార్య ప్రస్తుతం … Read more

కొండగట్టుకు పవన్ కల్యాణ్.. రూ.35 కోట్లతో టీటీడీ పనులకు శంకుస్థాపన

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టును సందర్శించనున్నారు. 2026 జనవరి 3 (శనివారం) ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం పనులకు భూమిపూజ నిర్వహిస్తారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా … Read more

హైదరాబాద్ క్రైమ్త గ్గిన నేరాలు.. మహిళలపై పెరిగిన కేసులు

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్ నగరంలో 2025 సంవత్సరానికి సంబంధించి వార్షిక నేర నివేదికను పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ విడుదల చేశారు. నగరంలో ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 15 శాతం తగ్గినప్పటికీ, మహిళలు, చిన్నారులపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2024తో పోలిస్తే మొత్తం కేసులు 35,944 నుంచి 30,690కి తగ్గాయని సిపి వెల్లడించారు. అయితే, మహిళలపై నేరాలు 6 శాతం పెరిగాయని, ముఖ్యంగా గృహ హింస కేసులు 31 శాతం పెరిగినట్లు నివేదిక స్పష్టం … Read more

అంగన్‌వాడీ జాబ్స్.. 92 పోస్టులు, టెన్త్ అర్హత.. వివరాలివే

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అనంతపురం జిల్లా మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఖాళీగా ఉన్న 92 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 78 అంగన్‌వాడీ వర్కర్, 14 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 2025 జూలై 1 నాటికి … Read more

చలి కోసం బొగ్గుల కుంపటి.. చిన్నారులు సహా నలుగురు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బీహార్‌లోని ఛాప్రాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉండటం స్థానికులను కలచివేసింది. గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వెలువడిన ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్ వాయువు గది అంతా వ్యాపించింది. నిద్రలోనే ఆ విషవాయువును పీల్చడంతో వారంతా ఊపిరాడక, స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు వైద్యులు … Read more

Sangareddy: బైక్ బోల్తా, ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్-బీదర్ జాతీయ రహదారి (NH 161B)పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులను నర్సింహులు (27), మల్లేష్ (24), మహేష్ (23)గా గుర్తించారు. వీరు వరుసకు బావ, బావమరుదులు అవుతారు. నర్సాపూర్ నుంచి నారాయణఖేడ్ వచ్చి తిరిగి వెళ్తుండగా, శివారులో కొత్తగా నిర్మిస్తున్న హైవే పక్కన ఉన్న కల్వర్టు గుంతలో బైక్ … Read more