Miryalaguda: ఫోన్ చేయగానే స్పందించి రక్తదానం..

మన పత్రిక, మిర్యాలగూడ: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి ప్రాణదాతగా నిలుస్తున్నారు. రక్తం అవసరమైన రోగుల కోసం ఫోన్ చేయగానే తక్షణమే స్పందిస్తూ ఆయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మంగళవారం స్థానిక జ్యోతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఒక రోగికి రక్తం అవసరం ఉందని తెలియగానే, జానకిరామ్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఇలా ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం తనకు ఇది … Read more

నేటి దినఫలాలు (మార్చి 25, 2026): బుధవారం ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

మన పత్రిక, హైదరాబాద్: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం.. నేటి (మార్చి 25, 2026 – బుధవారం) రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.) పంచాంగ వివరాలు:

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఈవీలపై 20% డిస్కౌంట్

మన పత్రిక, హైదరాబాద్: కాలుష్య నియంత్రణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే వారికి 20 శాతం మేర డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోనూ రోజురోజుకూ పెరుగుతున్న … Read more

కోనరావుపేట పీఎం శ్రీ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

మన పత్రిక వెబ్డెస్క్, కోనరావుపేట: చారిత్రక, సాంస్కృతిక విషయాలపై అవగాహన పెంచేందుకు కోనరావుపేట పీ.ఎం.శ్రీ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల విద్యార్థులు వరంగల్ విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా, భద్రకాళి ఆలయం, లక్నవరం సరస్సులను సందర్శించారు. ముఖ్యంగా రామప్ప ఆలయంలోని రుద్రదేవుడు, నందీశ్వరుని విగ్రహాలు, సన్నని దారం దూర్చేంత సూక్ష్మ రంధ్రాలున్న స్తంభాల పనితనం గురించి ఉపాధ్యాయులు వివరించారు. అలాగే, నృత్య భంగిమలను తెలిపే శిల్పాలు, కాకతీయుల శిల్పకళా వైభవం, … Read more

నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

మన పత్రిక, నల్గొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేక్యతండా గ్రామపంచాయతీ వస్త్రం తండా వద్ద ఇటుకల లోడుతో వెళ్తున్న ఓ లారీ, ప్యాసింజర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత … Read more

మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం

మన పత్రిక, సిద్దిపేట: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉగాది పండుగ కానుకగా మార్చి 22వ తేదీన ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలివిడత నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద యాసంగికి సంబంధించి మొత్తం మూడు విడతల్లో రూ. 9 వేల కోట్లను రైతుల బ్యాంకు … Read more

Medchal HIV Injection 2026: యువతికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన యువకుడి అరెస్టు

మన పత్రిక వెబ్డెస్క్, మేడ్చల్: పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఒక యువతికి హెచ్‌ఐవీ (HIV) పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా బలవంతంగా ఎక్కించిన నిందితుడిని పోలీసులు శనివారం (మార్చి 14న) అరెస్టు చేశారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అన్నోజిగూడ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన మనోహర్‌ అనే యువకుడికి బాధిత యువతితో కొద్ది వారాల క్రితం నిశ్చితార్థం జరిగింది. అయితే మనోహర్‌తో పాటు అతని … Read more

మూసీ ప్రాజెక్టుపై పౌరసమాజానికి సీఎం రేవంత్ ప్రజెంటేషన్

మన పత్రిక, హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌరసమాజానికి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. మ్యాప్‌లు, డేటాతో సహా ప్రాజెక్టు లక్ష్యాలను, ప్రయోజనాలను ఆయన సవివరంగా వివరించి అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు వ్యయంపై బీఆర్ఎస్ చేస్తున్న లక్ష కోట్ల ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాపు ఘాట్ వద్ద ప్రతిపాదించిన మహాత్మా గాంధీ విగ్రహ నిర్మాణ వ్యయం రూ. 200 … Read more

మంత్రి ఉత్తమ్.. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు

మన పత్రిక, సూర్యాపేట: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌పై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు (డొమెస్టిక్) వినియోగించే గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వల పరిస్థితిపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), సివిల్ … Read more

నిజామాబాద్ గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా.. నలుగురు మృతి

మన పత్రిక, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రైవేట్ బస్సు మొత్తం 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు బయలుదేరింది. ప్రయాణంలో భాగంగా రాత్రి రెండు గంటల సమయంలో … Read more