మెదక్: పోలీస్ స్టేషన్‌లో యువకుడి బలవన్మరణం

TG CRIME: మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దుర్గాప్రసాద్ (30) అనే యువకుడు గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ వారం రోజుల క్రితం ఒక యువతి, ఆమె కుటుంబ సభ్యులు దుర్గాప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు ఈ నెల 7న అతడిని స్టేషన్‌కు పిలిపించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే దుర్గాప్రసాద్ ఠాణాలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. … Read more

సీఎం రేవంత్ రెడ్డితో ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీ

TG: ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, సంఘాల నాయకులపై ఉన్న ఒత్తిడి వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల కలుగుతున్న నష్టం, పీఆర్సీ కమిటీ నివేదిక ఆలస్యంపై నెలకొన్న ఆవేదనను వివరించారు. ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం.. తాను ఎల్లప్పుడూ ఉద్యోగుల … Read more

మహిళా పోలీసుల సమర్థత అభినందనీయం: స్పీకర్ గడ్డం

TG: అసెంబ్లీ బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 7న అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీసులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆయన ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సమయంలో తలెత్తిన పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళా ఉద్యోగులు తమ విధులను అత్యంత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించారని స్పీకర్ … Read more

హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

హైదరాబాద్ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు తీవ్ర బీభత్సం సృష్టించింది. ఆటోను తప్పించబోయి అదుపుతప్పిన బస్సు వేగంగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. దిల్‌సుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఈ బస్సు చౌటుప్పల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు దూసుకెళ్లిన ఉద్ధృతికి ఒక కారు పూర్తిగా ధ్వంసమవగా, మరో వాహనం దెబ్బతింది. నేరుగా డీజిల్ పంపు వద్దకు దూసుకెళ్లడంతో అక్కడి పరికరాలు పూర్తిగా విరిగిపడ్డాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో … Read more

వినాయక నిమజ్జనాలపై దుష్ప్రచారం నమ్మవద్దు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై వస్తున్న వ్యతిరేక ప్రచారాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా ఖండించారు. చెరువుల్లో గణేష్ నిమజ్జనానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న చెరువుల్లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగైదు చెరువుల వద్ద మాత్రమే ఆంక్షలు ఉన్నాయని రంగనాథ్ స్పష్టం చేశారు. అమీన్‌పూర్ చెరువు దేశంలోనే ప్రప్రథమ … Read more

సీఎం సొంత ఊరి ముందే కరెంట్ కోసం ధర్నానా?: హరీశ్‌రావు

నాగర్‌కర్నూల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే ఉచిత విద్యుత్ కోసం రైతులు రహదారిపై ధర్నాకు దిగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు ట్రాక్టర్లతో మెరుపు ధర్నా, రాస్తారోకో చేపట్టడం రాష్ట్రంలోని ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ … Read more

BIG BREAKING: KTR, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు

హైదరాబాద్: అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న తమపై దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో BRS ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నెల 7న అసెంబ్లీ వద్ద ప్రొటోకాల్/పరిస్థితుల నిర్వహణలో భాగంగా విధుల్లో ఉండగా తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ … Read more

ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లోనే సీసీ టీవీలు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీ టీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదని, ప్రస్తుతం కేవలం ప్రీమియం, ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రమే వీటిని అందుబాటులోకి తెచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నామని మంత్రి సభలో పునరుద్ఘాటించారు. అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాలు, … Read more

ఫేక్ అకౌంట్‌తో సీఎం డ్రామాలు: మాజీ మంత్రి హరీష్

TG POLITICS: కాంగ్రెస్ నడిపే ఫేక్ అకౌంట్‌ ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చారని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే ఆ ఫేక్ అకౌంట్‌లో పోస్టులు చేస్తూ, దాన్నే పట్టుకుని సీఎం సభను తప్పుదోవ పట్టించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఆ దొంగ ఫేక్ అకౌంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులను అరెస్ట్ … Read more

TG: కానిస్టేబుల్ వయోపరిమితి మరో 3 ఏళ్లు సడలింపు

హైదరాబాద్: పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తదితర శాఖల్లోని కానిస్టేబుల్, తత్సమాన స్థాయి పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు సడలించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖలో సబ్ ఇన్స్‌స్పెక్టర్ (32 ఏళ్లు), కానిస్టేబుల్ (29 ఏళ్లు) పోస్టుల వయోపరిమితిలో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం, ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన 7 … Read more