తెలంగాణ: పెరగనున్న మద్యం, బీర్ల ధరలు..?

మన పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు రాష్ట్రంలోని మందుబాబుల జేబులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన మార్పులు మద్యం ధరల పెంపుకు దారితీస్తున్నాయి. ఈ వేసవిలో మద్యం, బీర్ల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకొకసారి మద్యం ధరలను సమీక్షిస్తారు. చివరిసారిగా 2023 మేలో ధరలు పెంచగా, నిబంధనల ప్రకారం 2025 మేలో మళ్లీ సమీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ గడువు … Read more

AP, TGలో గ్యాస్ సిలిండర్ ధరలు ఎంతంటే..?

మన పత్రిక: దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరణకు లోనవుతుంటాయి. అయితే ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం ప్రభావంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుతో వినియోగదారులపై భారం పెరిగింది. ఏప్రిల్ 1న గ్యాస్ ధరలు తగ్గుతాయనే ఆశతో ఎదురుచూసిన వినియోగదారులకు నిరాశ ఎదురైంది. గృహవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం … Read more

ఆదిలాబాద్: CM వస్తుండు.. వరాలు కురిపించేనా..?

మన పత్రిక, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బజార్‌హట్‌నూర్ మండలం పిప్పిరి గ్రామంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానుండటంతో కొత్త ప్రకటనలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన కీలకంగా మారింది. జిల్లాలో ప్రధాన సమస్యలపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ప్రవహించే పెన్‌గంగా … Read more

ఆదిలాబాద్ జిల్లాకు సీఎం.. 900 మంది పోలీసులతో బందోబస్తు

మన పత్రిక, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం పిప్రి గ్రామంలో జరగనున్న బహిరంగ సభకు అనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 900 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో సభ నిర్వహించేందుకు ప్రత్యేక … Read more

ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం

మన పత్రిక: నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు ఆదివారం తెరపడింది. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుతో జరిగిన ఈ ఎన్నికలో అంకం మౌనిక చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 12 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలిచాయి. స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో కాంగ్రెస్ బలం నాలుగుకు చేరింది. దీంతో … Read more

అర్ధరాత్రి తెలంగాణలోని పలు జిల్లాలో వర్షం

మన పత్రిక: తెలంగాణలో శనివారం అర్థరాత్రి వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షాలు కురిసి పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణలోని కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ నగర పరిధిలోనూ వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా నార్త్ హైదరాబాద్ ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లులు కురిసినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు పలుచోట్ల వర్షం పడడంతో రోడ్లపై నీరు నిలిచింది. … Read more

బాసర మాస్టర్ ప్లాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

మన పత్రిక, తెలంగాణ: చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయం పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా బాసర ఆలయ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రణాళికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, భక్తుల సౌకర్యాలను … Read more

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే దాడి: హరీశ్ రావు

మన పత్రిక, రాజకీయం: గజ్వేల్‌లో చోటుచేసుకున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ దాడి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగినదేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడిగా దీనిని అభివర్ణించిన ఆయన, కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో … Read more

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

మన పత్రిక: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలను అకస్మాత్తుగా వాయిదా వేయడంపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నుకోవడానికి సరిపడా కోరం ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికను వాయిదా వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా బీజేపీ … Read more

కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో

మన పత్రిక, తెలంగాణ: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్‌చల్ చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు అనుముల రేవంత్ రెడ్డి ఫోటోతో క్యాంప్ ఆఫీస్‌లోకి దూసుకెళ్లి, అక్కడ సీఎం ఫోటోను ఏర్పాటు చేశారు. అనంతరం కార్యాలయంలోనే జై కాంగ్రెస్ అంటూ నినాదాలు … Read more