హన్మకొండ: ప్రియుడి చేతిలో మహిళ దారుణ హత్య

CRIME: హన్మకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన స్వప్న (40) అనే మహిళ మూడు నెలల క్రితం అదృశ్యమైన ఘటన హత్యగా తేలింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె ప్రియుడే దారుణంగా అంతమొందించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత స్వప్న పుట్టింట్లోనే ఉంటోంది. పూజలు నేర్చుకునేందుకు కర్ణాటకలోని బళ్లారికి వెళ్లివచ్చే క్రమంలో అక్కడి బసవరాజు(27) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. మే 15న బళ్లారికి వెళ్లిన స్వప్న తిరిగి … Read more

వర్ష సూచన.. 18 జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని 18 జిల్లాలకు గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని స్పష్టం చేసింది. రాజధాని హైదరాబాద్‌లోనూ భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఏపీలో అల్పపీడనం కొనసాగుతుండటంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు … Read more

ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్

హైదరాబాద్: మాధురి రాథోడ్‌ నమోదు చేసిన బిఎన్‌ఎస్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో ఈశ్వర్ సాయి తరఫున అడ్వొకేట్ నాగూర్ బాబు తమ వాదనలను వినిపించారు. పెళ్లయిన వ్యక్తితో ఫిర్యాదుదారు సంవత్సరాలుగా సంబంధం కొనసాగించిన విషయాన్ని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం మీడియా సింపతీ కోసమే తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టారని … Read more

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి.. పట్టు చీరపై వాసవీ అమ్మవారు

సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ పట్టు దారాలపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. పట్టు, రెండు గ్రాముల బంగారు జరీని ఉపయోగించి ఏడు మీటర్ల చీరపై వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రతిరూపాన్ని ఎంతో మనోహరంగా కొలువుదీర్చారు. ఈ చీరపై అమ్మవారి చిత్రంతో పాటు 102 మంది రుషుల పేర్లు, గోత్రనామాలు, 25 చారిత్రక చిత్రాలు స్పష్టంగా కనిపించేలా నేయడం విశేషం. ఈ అద్భుత రూపాన్ని తీసుకురావడానికి తనకు 45 రోజుల సమయం పట్టిందని హరిప్రసాద్‌ … Read more

హనుమకొండ: ఓనర్ వేధింపులు.. పెట్రోల్ పోసుకుని దంపతుల ఆత్మహత్య

TG CRIME: అద్దె చెల్లించలేదనే నెపంతో ఇంటి యజమాని అవమానించడంతో మనస్తాపం చెందిన దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టిన హోటల్ యజమానులు కేదారి, పుష్పలత దంపతులు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ క్రమంలో సమయానికి అద్దె చెల్లించలేదని హోటల్ యజమాని కుమారుడు రాము షట్టర్‌కు తాళం వేశాడు. పుష్పలతను … Read more

కుల సర్వే దేశానికే రోల్ మోడల్: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (కుల సర్వే) దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే 2027 జాతీయ జనగణనలో బీసీ, ఓబీసీ కులగణనను తప్పనిసరిగా చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రంలో బీసీల జనాభాపై ప్రభుత్వం వద్ద అత్యంత ప్రామాణికమైన, కచ్చితమైన గణాంకాలు ఉన్నాయని తెలిపారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ … Read more

గద్వాల: ప్రేమ వివాహం.. యువకుడి ఇల్లు ధ్వంసం

TG: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల రూరల్ మండలం రేపల్లి గ్రామంలో కులాంతర ప్రేమ వివాహం ఉద్రిక్తతకు దారితీసింది. వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కక్షతో యువతి కుటుంబసభ్యులు అతని ఇంటిని కూల్చివేశారు. గ్రామానికి చెందిన రంగముని (26), మహేశ్వరి (21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం వీరు వివాహం చేసుకుని రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడగా.. తాను మేజరని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, భర్తతోనే ఉంటానని మహేశ్వరి తేల్చిచెప్పింది. … Read more

పంచాయతీ నిధులు ఇక బ్యాంకు ఖాతాల్లోనే: మంత్రి సీతక్క

గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా నేరుగా వాటి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సంబంధించిన పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును గురువారం అసెంబ్లీ ఆమోదించింది. ఇకపై గ్రామసభ తీర్మానంతో నేరుగా ఈ నిధులను పంచాయతీల అభివృద్ధికే వాడుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటివరకు నిధులను ట్రెజరీలో జమ చేయడం వల్ల వాటిని డ్రా చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ కొత్త విధానంతో పంచాయతీల … Read more

హైదరాబాద్: శాసనసభలో కోరం కరవు

TG: శాసనసభ సమావేశాలను అధికార కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకుంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం అసెంబ్లీ సాగిన తీరే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సభలో మంత్రులు గానీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గానీ కనీస సంఖ్యలో కూడా కనిపించలేదు. బిఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్‌తో ఆ వైపు సీట్లన్నీ ఖాళీగా ఉండగా, అధికార పక్షం హాజరు కూడా నామమాత్రంగానే ఉండటంతో సభ వెలవెలబోయింది. సభ ప్రారంభమైన గంటకే మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లిపోవడంతో, సొంత … Read more

క్యాన్సర్‌కు కారణమవుతున్న పురుగుమందులు: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

రాష్ట్రంలో కూరగాయల సాగు తీవ్రంగా తగ్గిపోవడం పట్ల పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు గ్రామాల్లో కూరగాయలు, సన్‌ఫ్లవర్‌, కందులు, పెసర పంటలు కనిపించేవని, కానీ ఇప్పుడు ఎటు చూసినా వరి సాగే కనిపిస్తోందని తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించిన ఆమె, కూరగాయల రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. పెస్టిసైడ్స్ వాడకం రోజురోజుకూ పెరగడం వల్లే క్యాన్సర్ కేసుల … Read more