నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే

Telangana intermediate results 2026

TS Telangana Inter 1st 2nd Year Result 2026 tgbie.cgg.gov.in: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు నేడు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. పరీక్షలు ముగిసిన కేవలం 25 రోజుల్లోనే రికార్డు వేగంతో బోర్డు రిజల్ట్స్ సిద్ధం చేయడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 25 … Read more

LB Nagar: మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి

మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ చౌరస్తా సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను బలితీసుకుంది. మద్యం మత్తులో కారు నడుపుతున్న కనకాల రామ్‌కుమార్ రెడ్డి.. ముందుగా రోడ్డు దాటుతున్న శ్రీధర్ అనే వ్యక్తిని, ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న నల్గొండ జిల్లా అల్వాలకు చెందిన కంచర్ల శివ(20), మిర్యాలగూడకు చెందిన నకిరేకంటి సందీప్ కుమార్(19) మృతి చెందారు. … Read more

TGRJC Set Exam 2026: తెలంగాణ గురుకుల ఇంటర్ ప్రవేశాలు..

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (TGWREIS) ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ‘TGRJC సెట్ 2026’ నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉచితంగా లేదా తక్కువ ఫీజుతో నాణ్యమైన ఇంటర్ చదువుకునేందుకు ఈ ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలతో పాటు కేజీబీవీలలో (KGBV) సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆసక్తి … Read more

ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్

మన పత్రిక, హైదరాబాద్: ప్రజా సమస్యలు బయటకు రాకుండా ఉండేందుకే బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, సమస్యలపై తమ ధర్మ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఇక్కడ దోచుకున్న సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తరలిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాదర్‌గుల్‌లోని సర్వే నంబర్ 613/119లో ఉన్న 374 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఫేక్ డాక్యుమెంట్లతో ఆక్రమిస్తున్నారని … Read more

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

మన పత్రిక, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కోర్టులో చుక్కెదురైంది. ఆయనతో పాటు రితేష్ రెడ్డి, నమిత శర్మలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను మంగళవారం ఉప్పరపల్లి న్యాయస్థానం తిరస్కరించింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున, ఇప్పుడు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందన్న పోలీసుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్, సరఫరాదారుల వివరాలు రాబట్టేందుకు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని … Read more

కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు వాయిదా.. కేసీఆర్ పిటిషన్‌పై ఏప్రిల్ 22న విచారణ

మన పత్రిక, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పును ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది. బుధవారం నాడు ఈ తీర్పు వెలువడాల్సి ఉండగా, అనుకోకుండా ధర్మాసనం దీనిని వాయిదా వేసింది. ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు అధికారులే బాధ్యులని కమిషన్ నివేదిక పేర్కొంది. దీనిని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు, … Read more

రూ.225 కోట్లతో బాసర ఆలయ పునరభివృద్ధి.. సీఎం రేవంత్ శంకుస్థాపన

మన పత్రిక, నిర్మల్: తెలంగాణలోని బాసరలో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయ పునరభివృద్ధి పనులకు సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.225 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచారు. ఆగమ శాస్త్ర నిబంధనలు, … Read more

ఈ నెలాఖరులోగా మిర్యాలగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ

మన పత్రిక, మిర్యాలగూడ: పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం వారు ఈ గృహ సముదాయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలి ఉన్న మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, ప్లంబింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో, వసతులు కల్పించడంలో ఎటువంటి … Read more

గజ్వేల్‌ బంద్‌.. BRS ఆధ్వర్యంలో నిరసన

మన పత్రిక, తెలంగాణ: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ‘గజ్వేల్ బంద్’ ఉదయం నుంచే ఉధృతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బంద్‌లో భాగంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్ డిపో ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున బస్సులు బయటకు … Read more

శిలలతో రూపుదిద్దుకోనున్న బాసర ముగ్గురమ్మల ఆలయం!

మన పత్రిక, తెలంగాణ: అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి చెందిన బాసర క్షేత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రూ.225 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భూమిపూజ చేయనున్నారు. దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి నది తీరాన వెలసిన ఈ క్షేత్రం అక్షరాభ్యాసాలకు కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం వసంత పంచమి వంటి పర్వదినాల్లో వేలాదిమంది చిన్నారులు … Read more