Rythu Bharosa: సాగు చేసిన వారికే నిధులు.. ఆలస్యం తప్పదా?

Rythu Bharosa

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో (Telangana) యాసంగి సీజన్ రైతు భరోసా (TG Rythu Bharosa) పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పంట సాగు చేసిన రైతులకే ఈ పెట్టుబడి సాయం అందించాలని భావిస్తోంది. ఇందుకోసం శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించిన తర్వాతే నిధులు జమ చేయనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించి, శాటిలైట్ చిత్రాల ద్వారా పంట విస్తీర్ణాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం … Read more

సీఎం రేవంత్‌ను కలిసిన ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు!

cm revanth reddy ips officers

మన పత్రిక, వెబ్​డెస్క్: హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు ప్రొబెషనరీ ఐపీఎస్ (IPS) అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ప్రొబెషనరీ ఐపీఎస్‌లు ఆయేషా ఫాతిమా, మనీషా నెహ్రా, మంధరె సోహన్ సునీల్, రాహుల్ కాంత్ ఉన్నారు. ఈ సందర్భంగా వారు సీఎంతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీవీఆర్ఆర్ (RBVRR) తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ కూడా పాల్గొన్నారు.

Naveen Yadav : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం

Naveen Yadav took oath as jubilee hills mla

Naveen Yadav : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వి.నవీన్ యాదవ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్ లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు జరిగాయి.

RTC Driver : మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్‌పై బూతులతో రెచ్చిపోయారు

drunken youth abuses rtc driver and conductor

RTC Driver : మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై పోకిరీలు బూతులతో రెచ్చిపోయారు. ఈ ఘటన నర్సంపేటలో  చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్ లో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. అప్పటికే వాళ్లు ఫుల్లుగా తాగి ఉన్నారు. నర్సంపేటకు టికెట్ తీసుకున్నారు. నర్సంపేట వచ్చినా దిగకుండా బస్సులో నిద్రపోతుండటంతో వాళ్లను లేపిన కండక్టర్ పై విరుచుకుపడ్డారు. నిద్రపోతున్న మమ్మల్నే లేపుతావా అంటూ ఆర్టీసీ కండక్టర్ పై బూతుల వర్షం కురిపించారు. … Read more

Reels on Police Vehicles : పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్.. క్షమాపణ చెప్పిన యువకుడు

Reels on Police Vehicles : నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు పోలీస్ వాహనంపై కూర్చొని ఇటీవల ఓ రీల్ చేశాడు. ఆ రీల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ రీల్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రీల్ చేసిన వాళ్ల పూర్తి వివరాలు తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. ఆ తర్వాత ఆ రీల్ చేసిన యువకుడు అశోక్ గా పోలీసులు గుర్తించారు. … Read more

Harish Rao : ‘కేసీఆర్ కోటి 30 లక్షల మందికి చీరలు ఇస్తే.. రేవంత్ రెడ్డి 46 లక్షల మందికే ఇచ్చాడు’

harish rao comments on revanth reddy

Harish Rao : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. బతుకమ్మ చీరలను రాష్ట్రంలో ఉన్న అందరు ఆడపడుచులకు కాకుండా కేవలం మహిళా సంఘాల గ్రూపుల్లో ఉన్న మహిళలకే ఇస్తున్నారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కోటి 30 లక్షల మంది మహిళలకు చీరలు ఇచ్చారని.. రేవంత్ రెడ్డి మాత్రం 46 లక్షల మంది మహిళలకు మాత్రమే ఒక చీర ఇచ్చాడన్నారు. … Read more

Gram Panchayat Elections : సాయంత్రం 6 గంటలకు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్  

tsec to release sapranch election notification today

Gram Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఒకసారి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ల విషయంలో సమస్య రావడంతో ఆ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేశారు. పాత రిజర్వేషన్లతోనే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ సాయంత్రం 6.15 కి తెలంగాణ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేయనుంది. సాయంత్రం హైదరాబాద్ లోని ఏసీ గార్డ్స్ లో ఉన్న డీటీసీపీ … Read more

BRS Rally : పారిశ్రామిక వాడల భూములను అమ్మొద్దంటూ బీఆర్ఎస్ ర్యాలీ

brs protest at ghmc office against industrial lands issue

BRS Rally : హైదరాబాద్ పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మేందుకు వీలుగా హెచ్ఐఎల్‌టీపీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండస్ట్రియల్ భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎరవిచ్చారు? అది తెలంగాణ ప్రజల సొత్తు.. అంటూ బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. ఆ పాలసీని రద్దు చేయాలని చాలా రోజుల నుంచి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ర్యాలీగా బయలుదేరారు.

SSC Student Suicide : మార్కులు తక్కువగా వచ్చాయని పేరెంట్స్ తిట్టారని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

ssc student commits suicide in habsiguda hyd

SSC Student Suicide : పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని హబ్సిగూడ పరిధిలో చోటు చేసుకుంది. తనకు మార్కులు తక్కువగా వచ్చాయని తన పేరెంట్స్ మందలించారని మనస్థాపం చెందిన ఆ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TS High Court : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో నేడే విచారణ

high court hearing today on local body elections

TS High Court : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినేట్ సమావేశం కూడా ఉంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల విషయంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ కూడా రెండు మూడు రోజుల్లో విడుదల కానుంది.